Andhra Pradesh: గంజాయి సరఫరాలో నంబర్ వన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Stood At First Place in Marijuana Case: గంజాయి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఏపీలోనే అత్యధికంగా 26% గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారని, ఆ రాష్ట్రంలో దొరికినంత గంజాయి మరే ఇతర రాష్ట్రాల్లో దొరకలేదని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నివేదిక (2021) వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. 2021లో దేశవ్యాప్తంగా 7,49,761 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా, ఒక్క ఏపీలోనే 2,00,588 (26.75%) కిలోల గంజాయిని గుర్తించారు. ఇక ఏపీ తర్వాత రెండో స్థానంలో ఒడిశా (1,71,713) నిలిచింది. దేశంలో లభ్యమైన గంజాయిలో.. మొత్తం 50% ఈ రెండు రాష్ట్రాల్లోనే లభించిందంటే, ఏ స్థాయిలో అక్కడ గంజాయి సరఫరా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో హషీష్ 18.14 కిలోలు, హషీష్ ఆయిల్ 6.13 లీటర్లు, 3 ఎల్ఎస్డీ బ్లాట్స్ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 1775 కేసులు నమోదు కాగా.. 4202 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక తెలంగాణ విషయానికొస్తే.. 35,270 కిలోల గంజాయి పట్టుకున్నట్టు ఆ నివేదికలో వెల్లడైంది. అలాగే 0.03 కిలోల హషీష్, 18.5 లీటర్ల హషీష్ ఆయిల్, 0.03 కిలోల హెరాయిన్, 0.01 కిలోల కెటామైన్, 31 ఎల్ఎస్డీ బ్లాట్స్ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ కేసుల్లో గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా మొత్తం 7618 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకోగా.. అందులో ఒక్క గుజరాత్లోనే 3334 కిలోల హెరాయిన్ లభించింది. ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా.. అక్కడ 1337 కిలోల హెరాయిన్ని పట్టుకున్నారు. ఇక డ్రగ్స్ అత్యధిక ప్రభావం ఉన్న పంజాబ్లో 443.51 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్టు ఎన్సీబీ నివేదిక వెల్లడించింది.
Also Read
- Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
తాజావార్తలు
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
JR NTR : ఎన్టీఆర్ లైనప్లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్తో సినిమా రెండేళ్లు పోస్ట్పోన్
-
Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
-
Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
-
RaviTeja : ఒకటి కాదు రెండు.. థియేటర్ దద్దరిల్లిపోద్ది
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!