Dharmana Prasada Rao: అవినీతి నాకు నచ్చదు.. ఎక్కడైనా నయాపైసా తీసుకున్నాడని చెప్పగలరా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ర్టం మొత్తంలో ఎక్కడైనా నయాపైసా ధర్మాన ప్రసాద్ తీసుకున్నాడని చెప్పగలరా..? అని సవాల్ విసిరారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కల్లేపల్లి గ్రామం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు కోట్లాది రుపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, కేసులు విచారణకు రాకుండా స్టేలు తీసుకువస్తుంటాడు అని ఆరోపించారు.. మరోవైపు, నన్ను గెలిపించే ప్రజలు తలదించుకునేలా ఎప్పుడూ పనిచేయన్న ఆయన.. అవినీతి అంటే నాకు నచ్చదు, ఉద్యోగులు అవినితికి దురంగాఉండాలని సూచించారు.. పార్టీలో నేతలు కూడా ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాం, చెడిపోయి ఉన్నాం.. కానీ, ఎక్కడా అవినితి చేయడం లేదన్నారు.. వ్యవస్థలో అవినీతిలేని మార్పు రావాలి, ఆ ప్రయత్నం నేడు జరుగుతుందన్నారు.. సీఎం జగన్కు పిచ్చి , క్రాక్ , ఏం తెలిదని మాటాడుతున్నారు.. అసలు, మార్పు తీసుకురావాలని ప్రయత్నించే జగన్ లాంటి వారు కఠినంగా ఉంటారని.. కఠినంగా ఉన్న జగన్ లాంటి వారిని ఇలాంటి మాటలు అంటారని మండిపడ్డారు ధర్మాన.
Read Also: CP Mahesh Bhagwat: ఇంటర్నేషనల్.. ఇంటర్స్టేట్ డ్రగ్ రాకెట్స్ని పట్టుకున్నాం
Also Read
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి కుమారుడి అరెస్ట్..
- YS Jagan: చీకటి కొంతకాలమే.. వెలుగు రాక తప్పదు.. పాదయాత్ర ప్రారంభిస్తా..
- AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు ధర్మాన ప్రసాదరావు.. చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటాడు, ఈ రాష్ర్టం గురించి మాట్లాడుతాడు.. రేపు అధికారంలోకి రాకపోయినా హైదరాబాద్లోనే చంద్రబాబు ఉండిపోతారని జోస్యం చెప్పారు.. ఇక, చంద్రబాబు టైంలో బ్రోకర్ల వ్యవస్థ ఉండేది, ప్రతీ పనికి డబ్బు పంచుకునేవారు.. కానీ, నేడు నయాపైసా తినటం లేదు, ప్రజలు కూడా వైసీపీ వారు డబ్బు తినటం లేదని అంటున్నారని తెలిపారు.. అభివృద్ధి అంటే ఏంటి టీడీపీ వారు చెప్పాలి..? అని సవాల్ విసిరిన ఆయన.. లేదా టీడీపీ వారు ఎవరైనా రండి నేను చెబుతాను అభివృద్ది ఏంటో అన్నారు. ఇక, ఇన్ని సంవత్సరాలలో విజయవాడలో చంద్రబాబు ఇల్లు ఎందుకు కట్టలేదు అని ప్రశ్నించారు ధర్మాన.. ప్రక్కరాష్ర్టంలో ఉన్నోడు.. ఈ రాష్ర్టం గూర్చి ఏం మాటాడతాడు? అని నిలదీశారు. సుఖమైన వ్యాపారం, పద్ధతి అంతా బాబుకి హైదరాబాద్లోనే ఉంటాయి.. హైదరాబాద్ లో ఉండి టీవీల్లో , జూమ్ మీటింగ్ లలో మాటాడుతున్నారని సెటైర్లు వేశారు. రాష్ర్టం గూర్చి చాలా ఆలోచిస్తాం అని చెబుతాఉంటాడు.. అయన హాయాంలో ఏం చెశారు? అని ఫైర్ అయ్యారు.
ఇక, ధాన్యం పండించిన వాడికి సుఖం లేదు.. వరి పంట మాని వెరేపంట వెసుకొవాలని రైతులకు మేమే విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు మంత్రి ధర్మాన.. ధాన్యం ధర ఎవరు నిర్ణయిస్తారు జగన్ మోహన్ రెడ్డినా? అని ప్రశ్నించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వమే ధర నిర్ణయిస్తుంది.. కానీ, ఈ టీడీపీ వారికి ఏం తెలుస్తుంది, పోరంబోకుల్లా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.. ముడున్నర ఏండ్లలో ఎన్ని మార్పులు వచ్చాయో గమనించాలని అని సూచించారు. సంవత్సరానికి ఒక కుటుంబానికి లక్షవరకూ వస్తుంది.. ప్రజల పన్ను డబ్బులు అవసరమైన పేదలకు సంక్షేమం రూపంలో అందిస్తున్నాం అన్నారు.. సెక్రటేరియట్ సిబ్బంది, వాలంటీర్లు జరుగుతున్న అభివృద్ధి ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
తాజావార్తలు
-
Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
-
Black Magic: చేతబడి అనుమానం.. పనిమనిషిని దారుణంగా చంపిన డాక్టర్..
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి కుమారుడి అరెస్ట్..
-
Telegram: టెలిగ్రామ్కు బిగుస్తున్న ఉచ్చు.. “డార్క్వెబ్”గా మారిందన్న కేంద్రం..
ట్రెండింగ్
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!