New Post For CS Sameer Sharma: సీఎస్ సమీర్ శర్మ కోసం కొత్త పోస్టు క్రియేట్ చేసిన జగన్ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని నియమించింది వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. రేపు సాయంత్రం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఇక, ఇప్పటి వరకు సీఎస్గా కొనసాగుతోన్న సమీర్ శర్మ.. రేపు బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.. ఇప్పటికే రెండుసార్లు పదవి పొడిగింపు పొందిన సమీర్ శర్మను వదులుకోవడానికి సిద్ధంగా లేరు సీఎం వైఎస్ జగన్.. దీంతో, 2023 నవంబర్ వరకు ఆయన పదవీకాలం పొడిగించాలంటూ కేంద్రాన్ని మరోసారి కోరారు.. కానీ, ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆయన రేపు పదవీ విరమణ చేయనున్నారు సమీర్ శర్మ.. అయితే, రేపు సీఎస్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న సమీర్ శర్మ కోసం కొత్త పోస్టును క్రియేట్ చేశారు సీఎం వైఎస్ జగన్.. సీఎస్ సమీర్ శర్మ సీఎంకు చీఫ్ ఎగ్జిక్యూటీవుగా నియమించారు. ఇదే సమయంలో.. రేపు రిటైర్ కానున్న విజయ్ కుమార్ సేవలను కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయానికి వచ్చారు.. స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవోగా బాధ్యతలు అప్పగించారు.
Read Also: IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ల బదిలీ.. సీఎంవో స్పెషల్ సీఎస్గా పూనం మాలకొండయ్య
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
కాగా, 2021 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు సమీర్శర్మ.. వాస్తవానికి ఆయన 2021 నంబర్ 30న రిటైర్ కావాల్సి ఉన్నా.. ఏపీ ప్రభుత్వ వినతి మేరకు కేంద్రం ఆయన సేవలను మరో ఆరు నెలలు పొడిగించింది. ఇక, 2022 మే 30 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సమీర్ శర్మ పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలని కేంద్రాన్ని కోరడం.. మళ్లీ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటి వరకు ఆయన సీఎస్గా కొనసాగుతూ వచ్చారు.. కానీ, 2023 నవంబర్ వరకు ఆయన పదవీకాలం పొడిగించేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నించింది. కానీ, కేంద్రం పచ్చజెండా ఊపకపోవడం.. ఇటీవల ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోన్న తరుణంలో పదవీ విరమణ ఖాయమైంది.. అయినా, మరో రకంగా సమీర్ శర్మ సేవలను ఉపయోగించుకునేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. సీఎం వైఎస్ జగన్కు చీఫ్ ఎగ్జిక్యూటీవుగా నియమించింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!