New Post For CS Sameer Sharma: సీఎస్ సమీర్ శర్మ కోసం కొత్త పోస్టు క్రియేట్ చేసిన జగన్ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని నియమించింది వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. రేపు సాయంత్రం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఇక, ఇప్పటి వరకు సీఎస్గా కొనసాగుతోన్న సమీర్ శర్మ.. రేపు బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.. ఇప్పటికే రెండుసార్లు పదవి పొడిగింపు పొందిన సమీర్ శర్మను వదులుకోవడానికి సిద్ధంగా లేరు సీఎం వైఎస్ జగన్.. దీంతో, 2023 నవంబర్ వరకు ఆయన పదవీకాలం పొడిగించాలంటూ కేంద్రాన్ని మరోసారి కోరారు.. కానీ, ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆయన రేపు పదవీ విరమణ చేయనున్నారు సమీర్ శర్మ.. అయితే, రేపు సీఎస్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న సమీర్ శర్మ కోసం కొత్త పోస్టును క్రియేట్ చేశారు సీఎం వైఎస్ జగన్.. సీఎస్ సమీర్ శర్మ సీఎంకు చీఫ్ ఎగ్జిక్యూటీవుగా నియమించారు. ఇదే సమయంలో.. రేపు రిటైర్ కానున్న విజయ్ కుమార్ సేవలను కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయానికి వచ్చారు.. స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవోగా బాధ్యతలు అప్పగించారు.
Read Also: IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ల బదిలీ.. సీఎంవో స్పెషల్ సీఎస్గా పూనం మాలకొండయ్య
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కాగా, 2021 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు సమీర్శర్మ.. వాస్తవానికి ఆయన 2021 నంబర్ 30న రిటైర్ కావాల్సి ఉన్నా.. ఏపీ ప్రభుత్వ వినతి మేరకు కేంద్రం ఆయన సేవలను మరో ఆరు నెలలు పొడిగించింది. ఇక, 2022 మే 30 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సమీర్ శర్మ పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలని కేంద్రాన్ని కోరడం.. మళ్లీ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటి వరకు ఆయన సీఎస్గా కొనసాగుతూ వచ్చారు.. కానీ, 2023 నవంబర్ వరకు ఆయన పదవీకాలం పొడిగించేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నించింది. కానీ, కేంద్రం పచ్చజెండా ఊపకపోవడం.. ఇటీవల ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోన్న తరుణంలో పదవీ విరమణ ఖాయమైంది.. అయినా, మరో రకంగా సమీర్ శర్మ సేవలను ఉపయోగించుకునేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. సీఎం వైఎస్ జగన్కు చీఫ్ ఎగ్జిక్యూటీవుగా నియమించింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!