Kadapa Steel Plant: నాన్నగారి కల నిజం అవుతుంది.. ఈ ప్రాంతమంతా అభివృద్ధి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadapa Steel Plant: స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో మొత్తం కడప జిల్లాయే కాదు ప్రాంతమంతా అభివృద్ధి అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కడప జిల్లా సున్నపురాళ్ళ పల్లిలో జేఎస్డబ్ల్యూ స్టీల్స్కు ఇవాళ భూమి పూజ చేశారు సీఎం వైఎస్ జగన్, జిందాల్ చైర్మన్ సజ్జన్ జిందాల్.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఓ చిన్న కార్యక్రమంలా పరిశ్రమ భూమి పూజ నిర్వహిస్తున్నాం.. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో మొత్తం జిల్లా, ప్రాంతమంతా అభివృద్ధి అవుతుందన్నారు. గతంలో స్టీల్ ప్లాంట్ కోసం వైఎస్ ఎన్నో కలలు కన్నారు.. అనాడు స్టీల్ ప్లాంట్ కోసం పరితపించారు.. కానీ, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదని మండిపడ్డారు.. అయితే, దేవుడి దయవల్ల నేడు జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతోందని ఆనందం వ్యక్తం చేశారు సీఎం జగన్.
Read Also: AP Three Capitals: వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానులు..
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
మూడు దశల్లో జిందాల్ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ నిర్మాణం జరుగుతుందని.. 36 నెలల్లో 3300 కోట్లతో మొదటి దశ.. మరో ఐదేళ్ల మొత్తం పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసుకోనుందని వెల్లడించారు సీఎం వైఎస్ జగన్.. మూడు మిలియన్ టన్నుల తో కాదు ఇంకా పెరుగు తుందనే ధీమా వ్యక్తం చేసిన ఆయన.. ప్లాంట్ సపోర్ట్ కోసం చాలా కష్ట పడ్డాం.. మంచి రోజులు వచ్చాయి. 4 వేల కోట్లతో 3500 ఎకరాల భూమి, 700 కోట్ల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. స్టీల్ సిటీ కావాలనే అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. ఇక, కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాం.. లక్ష మందికి ఉపాధి లభిస్తుంది.. జగనన్న ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి చేస్తోందన్నారు.. స్థానికులకు 74 శాతం కల్పన దిశగా చట్టం చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.. గడచిన మూడేళ్లలో పెట్టుబడిదారులకు అనుకూల మైన రాష్ట్రంగా నిలిచింది.. దేశ వ్యాప్తంగా ఎంతో మంది పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం వైపు చూస్తూ ముందుకు వస్తున్నారని.. జిందాల్ పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!