YSRCP: తాడిపత్రిలో వైసీపీ సమావేశం తాత్కాలికంగా వాయిదా.. కేతిరెడ్డి కీలక వ్యాఖ్యలు!
- తాడిపత్రిలో వైసీపీ సమావేశం తాత్కాలికంగా వాయిదా..
- పోలీసుల సూచనతో వైసీపీ సమావేశం ఈనెల 18కి వాయిదా..
- ఈ నెల 18న వైసీపీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన కేతిరెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం తాత్కాలికంగా వాయిదా పడింది. ఇవాళ తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏర్పాటు చేశారు. జిల్లాలో మంత్రుల పర్యటన దృష్ట్యా వాయిదా వేసుకోవాలని తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి కోరారు. ఈ నెల 18 లేదా ఆ తర్వాత కార్యక్రమం నిర్వహించుకోవచ్చని సూచనలు చేశారు. ఇక, పోలీసుల సూచనతో వైసీపీ సమావేశం ఈనెల 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: S Jaishankar: గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి జిన్పింగ్ను కలిసిన జైశంకర్..
Also Read
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
- Thopudurthi Rajasekhar Reddy Arrest: మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 18వ తేదీన తాడిపత్రిలో వైఎస్సార్ సీపీ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు.. తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు. ఈ రోజు వైసీపీ సమావేశాన్ని నిర్వహించాలని భావించాం.. మంత్రుల పర్యటన కారణంగా వాయిదా వేసుకోవాలని తాడిపత్రి ఏఎస్పీ లేఖ రాశారు.. పోలీసుల సూచనలు గౌరవించి.. తాడిపత్రి వైసీపీ సమావేశాన్ని 18వ తేదీకి వాయిదా వేశామని పెద్దారెడ్డి వెల్లడించారు.
Read Also: IB Executive Recruitment 2025: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 జాబ్స్.. ఈ అర్హతలుంటే అస్సలు వదలొద్దు
మరోవైపు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో మూడవ అతి పెద్ద పార్టీగా వైసీపీ అవతరించిందన్నారు. వైసీపీ ఏమైనా ఎల్టీటీఈ, జైషే మహమ్మద్ లాంటి నిషేధిత ఉగ్రవాద పార్టీ కాదు అని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులు పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం సహకరించాలి అని కోరారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకరండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
-
Donald Trump: “నీకు పిచ్చి పట్టింది, నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి” నెతన్యాహుపై ట్రంప్ ఫైర్
-
Italy Earthquake: ఇటలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!