Tadipatri Sand Issue: ఎస్పీ వద్దకు చేరిన తాడిపత్రి ఇసుక పంచాయతీ..
- అనంతపురం జిల్లా ఎస్పీ వద్దకు చేరిన తాడిపత్రి ఇసుక అక్రమ రవాణా పంచాయితీ.. ఎస్పీ జగదీష్ ను కలిసిన సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి..
- ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tadipatri Sand Issue: తాడిపత్రి ఇసుక అక్రమ రవాణా పంచాయితీ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వద్దకు చేరింది.. తాడిపత్రి లో ఇసుక అక్రమ రవాణా వివాదం రాష్ట్రస్థాయిలో హీట్ ను రాజేసిన విషయం విదితమే కాగా.. నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందా పలుమార్లు సీఐ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. నిన్నటి రోజున ఇసుక అక్రమ రవాణాపై కేసులు నమోదు చేయాలని సీఐని కోరారు ఎమ్మెల్యే.. దీంతో.. ఫోన్ లో ఎమ్మెల్యేతో దురుసుగా మాట్లాడారు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి.. ఇక, సీఐ తీరుపై ఆగ్రహించిన ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి.. రూరల్ పోలీసుస్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సీఐ కమాపణ చెప్పాలంటూ ఆరు గంటల పాటు అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే ధర్నా చేశారు. చివరకు ఉన్నతాధికారుల జోక్యంతో వీడియో కాల్ ద్వారా ఎమ్మెల్యేకు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి సారీ చెప్పడంతో వివాదం ముగిసింది.
Read Also: David Malan: అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మెన్..
Also Read
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!
- Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?
- CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం... సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..
మరో వైపు తాడిపత్రి ఘటనపై స్పందించిన సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి.. తన వైపు నుంచి ఎలాంటి తప్పులేదని స్పష్టం చేశాడు. లా అండ్ ఆర్డర్ విఘాతం కలుగుతుంది అని ఆ సమయంలో క్షమాపణ కోరానని, ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు నా పరిధిలోని కాదని.. అది డీఎస్పీ విచారణ చేస్తాడు అని ఎమ్మెల్యేతో చెప్పానన్నారు.. తాడిపత్రి లో 14 నెలల నుంచి విధులు నిర్వహిస్తున్నా.. ఎలాంటి ఇబ్బందులూ రాలేదన్నారు. ఎస్పీ దృష్టికి నిన్న జరిగిన విషయాన్ని వివరించినట్లు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు.
Read Also: Naga Chaitanya: పెళ్లి అలాగే చేసుకుంటా.. నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇక, జిల్లా ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసినట్టు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తెలిపారు. ఇసుక మాఫియాని ఆరికట్టాలని జిల్లా ఎస్పీని కోరానని వివరించారు.. పోలీసుల తీరులో ఇంకా మార్పు రాలేదని, ఒకరిద్దరి పోలీసుల వల్ల మొత్తం జిల్లా పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని విమర్శించారు.. తాడిపత్రిలో ఇసుక మాఫియా గురించి ఎన్జీటీ కి కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా గురించి నెల రోజుల నుంచి లెటర్లు రాస్తున్నా , ఎవరు స్పందించక పోవడం వల్ల స్వయంగా నేనే రంగంలోకి దిగానన్నారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరితే గంటల సేపు వర్షంలో నిలబెట్టారన్నారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోలేనప్పుడు సీఐగా ఎందుకు పనిచేయాలని ప్రశ్నించారు. ఇంకా కొంతమంది వైసీపీ జెండాను కప్పుకొని డ్యూటీ చేస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి.
తాజావార్తలు
-
Kantamaneni Ravi Shankar: పంచభూతాలపై టాలీవుడ్ లో కొత్త సినిమా
-
CM Vijay: సీఎం విజయ్కి షాక్ ఇచ్చిన మిత్రపక్షాలు.. ‘రెండు ఆకుల’ రాజకీయంలో దళపతి వెనకడుగు!
-
Peddi: తమిళ్, మలయాళ బాక్సాఫీస్పై ‘పెద్ది’ దండయాత్ర మొదలు!
-
Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ క్రేజ్ చూసి పిచ్చెక్కిపోయింది.. మహీ చిరకాల ప్రత్యర్థి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!