Tadipatri Sand Issue: ఎస్పీ వద్దకు చేరిన తాడిపత్రి ఇసుక పంచాయతీ..
- అనంతపురం జిల్లా ఎస్పీ వద్దకు చేరిన తాడిపత్రి ఇసుక అక్రమ రవాణా పంచాయితీ.. ఎస్పీ జగదీష్ ను కలిసిన సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి..
- ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tadipatri Sand Issue: తాడిపత్రి ఇసుక అక్రమ రవాణా పంచాయితీ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వద్దకు చేరింది.. తాడిపత్రి లో ఇసుక అక్రమ రవాణా వివాదం రాష్ట్రస్థాయిలో హీట్ ను రాజేసిన విషయం విదితమే కాగా.. నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందా పలుమార్లు సీఐ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. నిన్నటి రోజున ఇసుక అక్రమ రవాణాపై కేసులు నమోదు చేయాలని సీఐని కోరారు ఎమ్మెల్యే.. దీంతో.. ఫోన్ లో ఎమ్మెల్యేతో దురుసుగా మాట్లాడారు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి.. ఇక, సీఐ తీరుపై ఆగ్రహించిన ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి.. రూరల్ పోలీసుస్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సీఐ కమాపణ చెప్పాలంటూ ఆరు గంటల పాటు అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే ధర్నా చేశారు. చివరకు ఉన్నతాధికారుల జోక్యంతో వీడియో కాల్ ద్వారా ఎమ్మెల్యేకు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి సారీ చెప్పడంతో వివాదం ముగిసింది.
Read Also: David Malan: అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మెన్..
Also Read
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Kethireddy Venkatarami Reddy: సెలబ్రిటీల మౌనంపై కేతిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. పద్మశ్రీల భయమా..?
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
మరో వైపు తాడిపత్రి ఘటనపై స్పందించిన సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి.. తన వైపు నుంచి ఎలాంటి తప్పులేదని స్పష్టం చేశాడు. లా అండ్ ఆర్డర్ విఘాతం కలుగుతుంది అని ఆ సమయంలో క్షమాపణ కోరానని, ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు నా పరిధిలోని కాదని.. అది డీఎస్పీ విచారణ చేస్తాడు అని ఎమ్మెల్యేతో చెప్పానన్నారు.. తాడిపత్రి లో 14 నెలల నుంచి విధులు నిర్వహిస్తున్నా.. ఎలాంటి ఇబ్బందులూ రాలేదన్నారు. ఎస్పీ దృష్టికి నిన్న జరిగిన విషయాన్ని వివరించినట్లు సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు.
Read Also: Naga Chaitanya: పెళ్లి అలాగే చేసుకుంటా.. నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇక, జిల్లా ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసినట్టు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తెలిపారు. ఇసుక మాఫియాని ఆరికట్టాలని జిల్లా ఎస్పీని కోరానని వివరించారు.. పోలీసుల తీరులో ఇంకా మార్పు రాలేదని, ఒకరిద్దరి పోలీసుల వల్ల మొత్తం జిల్లా పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని విమర్శించారు.. తాడిపత్రిలో ఇసుక మాఫియా గురించి ఎన్జీటీ కి కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా గురించి నెల రోజుల నుంచి లెటర్లు రాస్తున్నా , ఎవరు స్పందించక పోవడం వల్ల స్వయంగా నేనే రంగంలోకి దిగానన్నారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరితే గంటల సేపు వర్షంలో నిలబెట్టారన్నారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోలేనప్పుడు సీఐగా ఎందుకు పనిచేయాలని ప్రశ్నించారు. ఇంకా కొంతమంది వైసీపీ జెండాను కప్పుకొని డ్యూటీ చేస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!