Fighting in Wedding: పెళ్లిలో భోజనం విషయంలో గొడవ.. కర్రలతో దాడి
- అనంతపురం జిల్లా గుత్తిలో ఓ పెళ్లి వేడుకలో ఘర్షణ..
- వివాహ వేడుకలో భోజనం వడ్డించే విషయంలో వివాదం..
- ఒక వర్గం మరో వర్గంపై కర్రలతో దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fighting in Wedding: పెళ్లి వేడుక అంటే అంతా అట్టహాసంగా జరుగుతోంది.. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో హుషారుగా సాగుతోంది.. అయితే, భోజనం వడ్డించే విషయంలో చోటు చేసుకున్న చిన్న వివాదం కాస్తా చిలికి చిలికి గాలివానగా మారినట్టు పెద్దది అయ్యింది.. చివరకు రెండు వర్గాలు పరస్పరం కర్రలతో దాడి చేసుకునేంత వరకు వెళ్లింది.. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది.
Read Also: NICDC: రాయలసీమలో పరిశ్రమలకు కేంద్రం పెద్దపీట.. ఎన్ఐసీడీసీకి రూ.872 కోట్లు విడుదల..
Also Read
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Kethireddy Venkatarami Reddy: సెలబ్రిటీల మౌనంపై కేతిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. పద్మశ్రీల భయమా..?
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లిలో సోమవారం రాత్రి ఓ వివాహ వేడుకలో భోజనం వడ్డించే విషయంలో మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఒక వర్గం మరో వర్గంపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘర్షణలో ఓ వర్గానికి చెందిన మాబు, ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డారు. భోజనం వడ్డించే విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. మహమ్మద్ రసూల్, నూర్ భాషా, రెహనాతో పాటు మరో ఇద్దరు మాబు, ఆసిఫ్ పై కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో మహబూబ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!