Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Payyavula Keshav: అనంతపురం జిల్లాలో నెలకొన్న నీటి పరిస్థితులపై రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి నీటి కష్టాలను ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. 1994లో ఇలాంటి నీటి కష్టాలను చూశానని, ప్రస్తుతం రైతులు ప్రకృతితో యుద్ధం చేస్తున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను తాను కళ్లారా చూస్తున్నానని తెలిపారు. నీటి లభ్యతపై ప్రజలు, రైతులను అప్రమత్తం చేసేందుకు ప్రతి గ్రామంలో చాటింపు వేయించామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా రైతులు పెట్టుబడులు పెట్టి నష్టపోకూడదనే ఉద్దేశంతో నీటి పరిస్థితిని ముందుగానే తెలియజేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం తాగునీటికే అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వచ్చే ఏడాది జూలై వరకు అవసరమైన తాగునీటిని నిల్వ చేసుకునేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
సాగునీటి పరిస్థితి తీవ్రంగా ఉందని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. ఈ ఏడాది వరి, మిర్చి వంటి పంటలకు నీరు అందించే పరిస్థితి లేదని తెలిపారు. హెచ్ఎల్సీ, హంద్రీ-నీవా కాలువలపై ఆధారపడే రైతులు పంటలు వేయవద్దని ఆయన స్పష్టంగా సూచించారు. నీటి లభ్యతపై స్పష్టత లేకుండా రైతులు సాగు ప్రారంభిస్తే పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీకి నవంబర్ 10వ తేదీ వరకు నీరు వచ్చే అవకాశం ఉందని పయ్యావుల కేశవ్ తెలిపారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న నీటిని ముందుగా తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Kethireddy Venkatarami Reddy: సెలబ్రిటీల మౌనంపై కేతిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. పద్మశ్రీల భయమా..?
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
తాగునీటి అవసరాలను ముందుగా తీర్చిన అనంతరం హంద్రీ-నీవా ద్వారా సాగునీటి కేటాయింపులపై మరోసారి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉన్నాయని, ఈ సంవత్సరం చాలా కష్టకాలమని ఆయన పేర్కొన్నారు. రైతులు పరిస్థితిని అర్థం చేసుకుని సాగు విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు మంత్రి పయ్యావుల కేశవ్…
తాజావార్తలు
-
SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
-
Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
ట్రెండింగ్
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!