Pandu Ranga Temple: ఆ గుడికి వేల సంఖ్యలో మందుబాబులు క్యూ కడుతారు.. ఎందుకో తెలుసా?
- అనంతపురం జిల్లా ఉంతకల్లు గ్రామంలోని పాండురంగ స్వామి ఆలయం..
- మద్యం మానివేయగల దేవుడు ఉన్నాడని మీకు తెలుసా?..
- మాలధారణ మాదకద్రవ్యాలకు విరుగుడు?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pandu Ranga Temple: ఇటీవల మద్యానికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మద్యం తాగడం మానేయడానికి కుటుంబ సభ్యులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే మద్యం మానివేయగల దేవుడు ఉన్నాడని మీకు తెలుసా? నిజమే, ఆ స్వామిని దర్శించుకోవడం వల్ల మనిషిలోని చెడు గుణాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మాలధారణ మాదకద్రవ్యాలకు విరుగుడు? అవుననే అంటున్నారు మందు బాబులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఉన్న ఆ ఆలయానికి వెళ్లి పూలమాలలు వేస్తే మద్యానికి దూరంగా ఉండాల్సిందే అని అంటున్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ఉంతకల్లు గ్రామంలోని పాండురంగ స్వామిని ఆంధ్ర పుండరీపురంగా పిలుస్తారు. ఆలయ గొప్పతనం గురించి తెలియని మందు బాబులు ఇక్కడ లేరంటే అతిశయోక్తి కాదు. తాగుబోతులను పోగొట్టే దైవంగా ఉంతకల్లులో వెలసిన పాండురంగ స్వామి రుక్మిణి సమేతంగా తాగుబోతుల నుంచి పూజలు అందుకుంటున్నాడు. వినడానికి కాస్త వింతగా అనిపించినా.. నెలలో రెండు రోజులు పాండురంగ స్వామి ఆలయం మందు బాబులతో కిటకిటలాడుతుంది.
Read also: Health Tips: టీ తాగుతూ సిగరెట్ తాగుతున్నారా..?
Also Read
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!
- Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?
- CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం... సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..
ఈ ఆలయానికి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. భక్తి శ్రద్ధలతో పాండురంగ స్వామిని కొలిస్తే. మెడలో పాండురంగ స్వామి దండ ఉంటే తాగి చాలా దూరం పరిగెత్తేవాడట. జన్మలో మద్యం జోలికి వెళ్లరని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పాండురంగ స్వామి మాల మాసంలోని శుక్త ఏకాదశి, కృష్ణ ఏకాదశి రోజుల్లో మాత్రమే ధరించాలి. తాగుబోతులు మాత్రమే పాండురంగ స్వామి మాల ధరించడం చాలా ఏళ్లుగా ఆచారం. స్వామివారిని దర్శించుకునేందుకు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మందు తాగడం మానేయాలనే దృఢ సంకల్పంతో మాలధారణ చేయాలనుకునే వారు ఉదయాన్నే స్నానం చేసి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించి భక్తుల మెడలో పాండురంగ స్వామి మాల వేస్తారు. పాండురంగ స్వామి మాలధారణ చేసిన వారికి మళ్లీ మద్యం ముట్టిన దాఖలాలు లేవని ప్రధాన అర్చకులు చెబుతున్నారు. మద్యానికి బానిసలైన వారు స్వామివారి ఆలయానికి వచ్చి మాలధారణ చేసిన తర్వాత మద్యానికి దూరంగా ఉంటూ ప్రశాంత జీవనం గడుపుతారన్నారు.
Flipkart Offers: రూ.1కే ఆటో రైడ్.. ఎగబడుతున్న జనం!
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!