Pandu Ranga Temple: ఆ గుడికి వేల సంఖ్యలో మందుబాబులు క్యూ కడుతారు.. ఎందుకో తెలుసా?
- అనంతపురం జిల్లా ఉంతకల్లు గ్రామంలోని పాండురంగ స్వామి ఆలయం..
- మద్యం మానివేయగల దేవుడు ఉన్నాడని మీకు తెలుసా?..
- మాలధారణ మాదకద్రవ్యాలకు విరుగుడు?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pandu Ranga Temple: ఇటీవల మద్యానికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మద్యం తాగడం మానేయడానికి కుటుంబ సభ్యులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే మద్యం మానివేయగల దేవుడు ఉన్నాడని మీకు తెలుసా? నిజమే, ఆ స్వామిని దర్శించుకోవడం వల్ల మనిషిలోని చెడు గుణాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మాలధారణ మాదకద్రవ్యాలకు విరుగుడు? అవుననే అంటున్నారు మందు బాబులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఉన్న ఆ ఆలయానికి వెళ్లి పూలమాలలు వేస్తే మద్యానికి దూరంగా ఉండాల్సిందే అని అంటున్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ఉంతకల్లు గ్రామంలోని పాండురంగ స్వామిని ఆంధ్ర పుండరీపురంగా పిలుస్తారు. ఆలయ గొప్పతనం గురించి తెలియని మందు బాబులు ఇక్కడ లేరంటే అతిశయోక్తి కాదు. తాగుబోతులను పోగొట్టే దైవంగా ఉంతకల్లులో వెలసిన పాండురంగ స్వామి రుక్మిణి సమేతంగా తాగుబోతుల నుంచి పూజలు అందుకుంటున్నాడు. వినడానికి కాస్త వింతగా అనిపించినా.. నెలలో రెండు రోజులు పాండురంగ స్వామి ఆలయం మందు బాబులతో కిటకిటలాడుతుంది.
Read also: Health Tips: టీ తాగుతూ సిగరెట్ తాగుతున్నారా..?
Also Read
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
- Thopudurthi Rajasekhar Reddy Arrest: మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
ఈ ఆలయానికి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. భక్తి శ్రద్ధలతో పాండురంగ స్వామిని కొలిస్తే. మెడలో పాండురంగ స్వామి దండ ఉంటే తాగి చాలా దూరం పరిగెత్తేవాడట. జన్మలో మద్యం జోలికి వెళ్లరని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పాండురంగ స్వామి మాల మాసంలోని శుక్త ఏకాదశి, కృష్ణ ఏకాదశి రోజుల్లో మాత్రమే ధరించాలి. తాగుబోతులు మాత్రమే పాండురంగ స్వామి మాల ధరించడం చాలా ఏళ్లుగా ఆచారం. స్వామివారిని దర్శించుకునేందుకు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మందు తాగడం మానేయాలనే దృఢ సంకల్పంతో మాలధారణ చేయాలనుకునే వారు ఉదయాన్నే స్నానం చేసి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించి భక్తుల మెడలో పాండురంగ స్వామి మాల వేస్తారు. పాండురంగ స్వామి మాలధారణ చేసిన వారికి మళ్లీ మద్యం ముట్టిన దాఖలాలు లేవని ప్రధాన అర్చకులు చెబుతున్నారు. మద్యానికి బానిసలైన వారు స్వామివారి ఆలయానికి వచ్చి మాలధారణ చేసిన తర్వాత మద్యానికి దూరంగా ఉంటూ ప్రశాంత జీవనం గడుపుతారన్నారు.
Flipkart Offers: రూ.1కే ఆటో రైడ్.. ఎగబడుతున్న జనం!
తాజావార్తలు
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
-
Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..