Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Anakapalli Ys Jagan Consoled Victims Of The Essenscia Pharma Company At Achyutapuram Sez

YS Jagan: ఫార్మా బాధితులకు పరామర్శ.. ప్రభుత్వం తీరుపై జగన్‌ అభ్యంతరం..

Published Date :August 23, 2024 , 1:00 pm
By Sudhakar Ravula
  • అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ..
  • ప్రమాదంపై ప్రభుత్వం తీరు బాధాకరమన్న మాజీ సీఎం..
YS Jagan: ఫార్మా బాధితులకు పరామర్శ.. ప్రభుత్వం తీరుపై జగన్‌ అభ్యంతరం..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

YS Jagan: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. అచ్యుతాపురం ప్రమాదంపై ప్రభుత్వం తీరు బాధాకరం అన్నారు.. మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రమాదం జరిగితే ప్రభుత్వం స్పందించ కూడదు అనే తాపత్రయం కనిపించిందని దుయ్యబట్టారు.. హోం మంత్రి సహాయచర్యలు పర్యవేక్షణ కోసం వెళుతున్నాను అనే మాటే చెప్పలేదు.. ఫ్యాక్టరీలు ఏ శాఖ పరిధిలోకి వస్తుందో పరిశ్రమల మంత్రికి తెలియదు… ఎంత మంది చనిపోయారు తెలియదని చెప్పారు.. ఘటనా స్థలానికి అంబులెన్సులు కూడా పంపలేకపోయారు.. కంపెనీ బస్సుల్లో బాధితులను తరలించాల్సి వచ్చిందంటు మండిపడ్డారు.. అదే, LG పాలిమర్ ప్రమాదం అర్ధరాత్రి జరిగితే కలెక్టర్, పోలీసులు, అంబులెన్సులు సంఘటనా స్థలికి హుటాహుటిన తరలించాం.. 11 గంటలకు నేను స్పాట్ కు వచ్చాను అని గుర్తుచేసుకున్నారు. కోవిడ్ ఇబ్బందులు అధిగమించి సైతం రెస్క్యూ చేశాం… తొలిసారి కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించామన్నారు.

Read Also: Breaking: నేపాల్‌లో నదిలో పడిపోయిన 40 మందితో ప్రయాణిస్తున్న భారతీయ ప్రయాణీకుల బస్సు..

Also Read

  • Gudivada Amarnath: జగన్‌ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!
  • Anakapalli Earthquake: అనకాపల్లిలో భూప్రకంపనలు..
  • Gudivada Amarnath: చంద్రబాబుకు ఓటేసి ప్రజలు నాలుగోసారి మోసపోయారు..!
  • Wife Kills Husband: ప్రేమ ముసుగులో రక్తపాతం.. భర్త ప్రాణాలు తీసిన భార్య.. ముగ్గురు అరెస్ట్.!
Add as a preferred
source on google

అయితే, అచ్యుతాపురం ఘటనలో ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించిన తీరు అభ్యంతరకరం అన్నారు జగన్‌.. ప్రభుత్వం అనేది సానుభూతి, బాధ్యత తో వ్యవహరించాలన్న ఆయన.. జగన్ హయాంలో ప్రమాదాలు జరిగాయని చంద్రబాబు చెబుతున్నారు.. మరి చంద్రబాబు హయాంలో జరిగిన ప్రమాదాల సంగతేంటి? అని ప్రశ్నించారు. ప్రస్తుత సీఎస్‌ నీరాబ్ కుమార్ కమిటీ వేసి వైసీపీ ప్రభుత్వం హయంలో సమగ్ర నివేదిక రూపొందించి అమలు చేశాం.. కంపెనీలు సమర్పించే నివేదికలపై థర్డ్ పార్టీ ఆడిట్ లు, సేవలు దుబాటులోకి తీసుకుని వచ్చామని తెలిపారు. ప్రతీ పరిశ్రమను తనిఖీ చేసిన తర్వాత అందులో వెలుగు చూసిన లోపాలను సరిదిద్ది కోవడానికి గడవు ఇచ్చి ప్రోటో కాల్ ఖచ్చితంగా పాటించేలా జీవో ఇచ్చామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మానిటర్ చేయడం మానేశారు… ఈ ప్రభుత్వానికి గవర్నెన్స్ మీద, సంక్షేమ పథకాల అమలు మీద లేదు.. కేవలం రెడ్ బుక్ మీదనే ధ్యాస్ వుంది… రెడ్ బుక్ తెరవడం దానిని ఫాలో అవ్వడం మాత్రం కనిపిస్తోందని విమర్శించారు.

Read Also: S.Kota Sub Registrar Suspended: రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి సిసోడియా పర్యటన ఎఫెక్ట్‌.. అధికారులపై చర్యలు షురూ

స్కూళ్లు, హాస్పిటల్లో, పరిశ్రమలు ఇలా అన్ని వ్యవస్థలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తునారని ఆరోపించారు వైఎస్‌ జగన్‌.. ఆరోగ్య శ్రీ, విద్యా దీవెన కింద బకాయిలు విడుదల చేయడం లేదు.. రోగులు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. రైతులకు పెటుబడు సహాయం ఒక్క రూపాయి ఇవ్వలేదు.. 2023-24 ఇన్సూరెన్ ప్రీమియం చెల్లించని కారణంగా రైతుల బీమా ఎగిరిపోయింది.. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది… రాష్ట్రంలో కక్షలు, హింస తప్ప పాలనలో మంచి చేయాలనే పరిస్థితులు లేవు అన్నారు. పరిహారం సానుభూతితో సరైన సమయంలో ఇవ్వాలి.. హాస్పిటల్లో బాధితులకు ఒక్క రూపాయ కూడా అందలేదని విమర్శించారు.. గతంలో తెచ్చిన పరిశ్రమలపై ప్రొటోకాల్ పాటించాలి.. పరిశ్రమలో SOP లు బాగా జరిగేవి కానీ ప్రమాదానికి కారణాలు తెలియవని బాధితులు చెప్పారని మీడియాకు వివరించారు వైఎస్‌ జగన్‌.. ప్రొటోకాల్ ఖచ్చితంగా అమలు చేయడం , సేఫ్టీ పరా మీటర్స్ పాటించాలి…. మూడు వారాలు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాను… పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగితే బాధితుల పక్షాన వైసీపీ పోరాడుతుంది. స్వయంగా నేనే ధర్నాకు వస్తాను …ఇది ప్రభుత్వానికి హెచ్చరిక అంటూ హాట్‌ కామెంట్లు చేశారు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Achyutapuram SEZ
  • Andhra Pradesh
  • Essenscia Pharma Company
  • Victims
  • ys jagan

తాజావార్తలు

  • Urvil Patel: కోచ్ చెప్పాడు, కొట్టాను.. నయా సెన్సేషన్ ఉర్విల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Drishyam 3 : అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తున్న దృశ్యం 3.. మోహన్ లాల్ మరో ఇండస్ట్రీ హిట్ ఇస్తాడా?

  • Road Accident: కారు – బైక్ ఢీ.. ఐదుగురు మృతి.!

  • Kanchana4: ‘కాంచన 4’ నుండి.. ఫ్యాన్స్‌కు షాకింగ్ అప్‌డేట్!

  • Bharath Kanth: సినీ పరిశ్రమలో విషాదం.. ORR ప్రమాదంలో యువ నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions