Gudivada Amarnath: చంద్రబాబుకు ఓటేసి ప్రజలు నాలుగోసారి మోసపోయారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ఓటు వేసి నాలుగోసారి మోసపోయారని ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్కు సంబంధించిన కీలక హామీలను తాకట్టు పెట్టేసిందని అమర్నాథ్ అన్నారు. ముఖ్యంగా, ఉత్తరాంధ్రకు ఎంతో కీలకమైన రైల్వే జోన్ సాధన విషయంలో ప్రభుత్వం సరైన కృషి చేయడం లేదని విమర్శించారు. రైల్వే జోన్ కోసం ఐదు దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ను వైసీపీ పోరాటం ద్వారానే సాధ్యమైందని పేర్కొన్నారు.
Read Also: Jailer 2: ‘జైలర్ 2’లో షారుఖ్ ఔట్.. పవన్ కళ్యాణ్ ఇన్? రజినీకాంత్ మూవీలో పవర్ స్టార్ సెన్సేషన్!
Also Read
- Gudivada Amarnath: జగన్ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!
- Anakapalli Earthquake: అనకాపల్లిలో భూప్రకంపనలు..
- Wife Kills Husband: ప్రేమ ముసుగులో రక్తపాతం.. భర్త ప్రాణాలు తీసిన భార్య.. ముగ్గురు అరెస్ట్.!
- Janasena: వీడియో వైరల్.. మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన నేతకు పార్టీ నోటీసులు..
రాష్ట్రంలో అభివృద్ధి కేంద్రీకరణపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతిపై మాత్రమే దృష్టి పెట్టి, ఉత్తరాంధ్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ పార్టీ విధానం అని స్పష్టం చేశారు. ఇక, కీలకమైన KK లైన్ ఒడిశాకు వెళ్లిపోతుండటాన్ని ప్రభుత్వ వైఫల్యంగా ఆయన అభివర్ణించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రంతో సమర్థంగా చర్చించలేకపోతున్నారని విమర్శించారు. అలాగే, పోలవరం ప్రాజెక్టులో మార్పులకు అంగీకరించడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని అన్నారు.
అమరావతి నగరంపై కూడా అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లక్షల కోట్లతో నిర్మిస్తున్న అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. ఇది భవిష్యత్తులో “గోస్ట్ క్యాపిటల్”గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనికి మలేషియాలోని Putrajaya నగరాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. ఇక, రైల్వే జోన్ కోసం తాను చేపట్టిన దీక్షపై కేసు నమోదు చేయడాన్ని అమర్నాథ్ ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తే కేసులు పెట్టడం సరైనది కాదని అన్నారు. అవసరమైతే ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తామని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్..
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!