Gudivada Amarnath: చంద్రబాబుకు ఓటేసి ప్రజలు నాలుగోసారి మోసపోయారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ఓటు వేసి నాలుగోసారి మోసపోయారని ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్కు సంబంధించిన కీలక హామీలను తాకట్టు పెట్టేసిందని అమర్నాథ్ అన్నారు. ముఖ్యంగా, ఉత్తరాంధ్రకు ఎంతో కీలకమైన రైల్వే జోన్ సాధన విషయంలో ప్రభుత్వం సరైన కృషి చేయడం లేదని విమర్శించారు. రైల్వే జోన్ కోసం ఐదు దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ను వైసీపీ పోరాటం ద్వారానే సాధ్యమైందని పేర్కొన్నారు.
Read Also: Jailer 2: ‘జైలర్ 2’లో షారుఖ్ ఔట్.. పవన్ కళ్యాణ్ ఇన్? రజినీకాంత్ మూవీలో పవర్ స్టార్ సెన్సేషన్!
Also Read
- Gudivada Amarnath: జగన్ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!
- Anakapalli Earthquake: అనకాపల్లిలో భూప్రకంపనలు..
- Wife Kills Husband: ప్రేమ ముసుగులో రక్తపాతం.. భర్త ప్రాణాలు తీసిన భార్య.. ముగ్గురు అరెస్ట్.!
- Janasena: వీడియో వైరల్.. మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన నేతకు పార్టీ నోటీసులు..
రాష్ట్రంలో అభివృద్ధి కేంద్రీకరణపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతిపై మాత్రమే దృష్టి పెట్టి, ఉత్తరాంధ్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ పార్టీ విధానం అని స్పష్టం చేశారు. ఇక, కీలకమైన KK లైన్ ఒడిశాకు వెళ్లిపోతుండటాన్ని ప్రభుత్వ వైఫల్యంగా ఆయన అభివర్ణించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రంతో సమర్థంగా చర్చించలేకపోతున్నారని విమర్శించారు. అలాగే, పోలవరం ప్రాజెక్టులో మార్పులకు అంగీకరించడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని అన్నారు.
అమరావతి నగరంపై కూడా అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లక్షల కోట్లతో నిర్మిస్తున్న అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. ఇది భవిష్యత్తులో “గోస్ట్ క్యాపిటల్”గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనికి మలేషియాలోని Putrajaya నగరాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. ఇక, రైల్వే జోన్ కోసం తాను చేపట్టిన దీక్షపై కేసు నమోదు చేయడాన్ని అమర్నాథ్ ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తే కేసులు పెట్టడం సరైనది కాదని అన్నారు. అవసరమైతే ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తామని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్..
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!