Ambati Rambabu: తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ వ్యవహారం వైసీపీని ఇరుకున పెడుతోంది. తాను డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు పోలీసుల కస్టడీలో ఎమ్మెల్సీ నేరాన్ని అంగీకరించాడు. దీంతో వైసీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు వైసీపీపై విరుచుకుపడుతున్న తరుణంలో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన స్పష్టం చేశారు. దావోస్లో ఉన్న సీఎం జగన్ కూడా ఎమ్మెల్సీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
MLC Anantha Babu: సుబ్రహ్మణ్యం బ్లాక్మెయిల్ చేశాడు.. అందుకే..!!
Also Read
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
మరోవైపు టీడీపీ నేత నారా లోకేష్పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ ఏం పీకారని అడుగుతున్నాడని.. అలా అనడం తప్పు అని.. ఆయన దగ్గర ఏం ఉందని పీకడానికి అని అంబటి రాంబాబు చురకలంటించారు. లోకేష్కు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదని.. అమెరికా వెళ్లి చదువుకున్నాడో లేదా స్విమ్మింగ్ పూల్లో అమ్మాయిలతో బీర్ తాగుతూ తిరిగాడో తెలియదని ఎద్దేవా చేశారు. లోకేష్ పక్కన తిరిగేవాళ్లే టీడీపీ పనిఅయిపోయిందని అభిప్రాయపడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తన గురించి లోకేష్ పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడని.. తాను తిరిగి మాట్లాడితే ఆయన ఇంటిల్లిపాదీ మీడియా ముందు ఏడుస్తూ కూర్చుంటారని విమర్శించారు. లోకేష్ ఓ మాలోకం అని.. బడుద్దాయి అని.. సంచులు మోసే సన్నాసి అని మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాగా జగన్ పనితీరు చూసి ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జగన్ను సింగిల్గా ఢీ కొట్టలేక టీడీపీ పవన్ కళ్యాణ్, బీజేపీని వెంటతెచ్చుకునే తంటాలు పడుతోందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని మరోసారి ప్రజలు చిత్తు చేయడం ఖాయమన్నారు. వైసీపీని ప్రజలు మళ్ళీ గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీది ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం కాదని.. జగన్ పాలన చూసి ‘ఏడుపే ఏడుపు’ కార్యక్రమం అని ఆరోపించారు.
తాజావార్తలు
-
HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!