Ambati Rambabu: పోటీలో లేకున్నా టీడీపీ కుట్రలు చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీకి భారీ మెజారిటీ రావడంపై మంత్రి అంబటి రాంబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరులో టీడీపీ పోటీలో లేకున్నా కుట్రలు చేసిందని ఆరోపించారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారని.. బద్వేలులో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ నేతలే బీజేపీ ఏజెంట్లుగా ఉన్నారని అంబటి రాంబాబు విమర్శలు చేశారు. గత మూడేళ్లలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోందని తెలిపారు. గత ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి 22 వేల మెజారిటీ సాధిస్తే.. ఇప్పుడు 82 వేల మెజారిటీ వచ్చిందని గుర్తుచేశారు. ఆత్మకూరులో ప్రజలు వైసీపీకి ఘన విజయాన్ని కట్టబెట్టారన్నారు.
అటు మద్యం విషయంలో వస్తున్న ఆరోపణలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు చెంచాలు మద్యంలో విషం ఉందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీలను గత ప్రభుత్వాలే ఇచ్చాయన్నారు. ప్రైవేట్ ల్యాబ్లో పరీక్షించాం అంటున్నారని.. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేసే వారిపై అధికారులు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ సైజ్ ఎంత గెలవటానికి అని అంబటి రాంబాబు చురకలు అంటించారు. టీడీపీ సహకరించకపోతే ఆ మాత్రం ఓట్లు అయినా బీజేపీకి వచ్చి ఉండేవా అని ప్రశ్నించారు. ఆత్మకూరు ఎన్నికల్లో బీజేపీకి జనసేన ఎందుకు ప్రచారం చేయలేదని అంబటి రాంబాబు నిలదీశారు.
Also Read
- CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
- OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
- Liquor Tenders: ఏపీలో మద్యం టెండర్లు.. ఎంఆర్పీ ధరలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
-
WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
ట్రెండింగ్
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!