Amaravati Jac: జగన్ ప్రకటనపై నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మూడురాజధానుల రచ్చ కొనసాగుతూనే వుంది. సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఖండిస్తున్నాం అన్నారు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత శివారెడ్డి, మూడు రాజధానుల పేరుతో మళ్లీ ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నికలలో హామీ ఇచ్చారు. తరువాత మాట తప్పి మూడు రాజధానుల పేరుతో మాట తప్పారు.
మహిళలు, రైతులు 800రోజులకు పైగా ఉద్యమం చేశారు. మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుని.. మళ్లీ వివాదం చేయడం సమంజసమా..? అమరావతిని అభివృద్ధి చేసి ఫ్లాట్లు ఇస్తే.. ఆప్రాంతానికి అందరూ వస్తారు. అమరావతి అభివృద్ధికి లక్షల కోట్లు కావాలని చెప్పడం సరి కాదు. విభజన చట్టం ప్రకారం ఎప్పుడో అమరావతి రాజధాని అయ్యింది. ప్రభుత్వాలు మారితే రాజధాని మార్చుకుంటూ పోతారా..?
Also Read
అన్ని పార్టీలు రాజధానిగా అమరావతే ఉండాలని సమర్ధించాయి. మూడేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలా వెనుక బడేలా చేశారు. ఎక్కడా ఒక్క పరిశ్రమ, కట్టడాలు రాకుండా చేశారు. ప్రజలు కూడా సీఎం చేసే మోసాలను గుర్తించి బుద్ది చెప్పాలి. రాజధాని అమరావతిని సాధించుకునేందుకు పోరాటాన్ని కొనసాగిస్తాం. సీఎం జగన్ తీరు మార్చుకుని, మనసు మార్చుకోవాలి. న్యాయ స్థానాలు న్యాయబద్దంగా తీర్పు ఇచ్చినా తప్పుబడతారా..? అమరావతి అభివృద్ధి కోసం మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం అన్నారు శివారెడ్డి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?