Minister Narayana : అమరావతి పునర్నిర్మాణంలో మరో ముందడుగు
- 56వ సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు
- క్వాంటం కంప్యూటింగ్ సెంటర్కు ఆమోదం
- వరద రహిత అమరావతిపై ఫోకస్
- రైతు భూముల వర్గీకరణకు కమిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సర్వంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 56వ సీఆర్డీఏ (CRDA) అథారిటీ సమావేశంలో రాజధాని అభివృద్ధికి సంబంధించి ఏడు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశం అనంతరం పురపాలక శాఖ మంత్రి నారాయణ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ, రాజధాని నిర్మాణ పనుల కోసం భారీగా నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు.
రాజధానిలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ, 103.96 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ‘అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్’ భవనాల టెండర్లకు అథారిటీ పచ్చజెండా ఊపింది. ఈ కేంద్రం అమరావతిని అంతర్జాతీయ సాంకేతిక చిత్రపటంలో నిలబెట్టనుంది. వీటితో పాటు, రాజధానిలో నివసించే అఖిల భారత సర్వీసు అధికారులు (IAS, IPS) , గౌరవ న్యాయమూర్తుల నివాసాల వద్ద అదనపు నిర్మాణ పనుల కోసం 109.52 కోట్ల రూపాయల మంజూరుకు అథారిటీ ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఏపీసీఆర్డీఏ , అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ADCL) పాలనా వ్యయాలకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా సీఎం సమీక్షించారు.
Also Read
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
Sharath Kumar : విజయ్ రాజకీయ నాయకుడే కాదు.. హిందువులమని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు!
భవిష్యత్తులో అమరావతిలో వర్షం కురిసినా ఎక్కడా నీరు నిలవకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా పకడ్బందీ ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాజధానిలో భారీ పంపింగ్ స్టేషన్ల నిర్మాణం, జోన్-8లో ఎల్పీఎస్ (LPS) పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. భారీ వర్షాలను సైతం తట్టుకునేలా నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అలాగే, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న యోగా , నేచురోపతి సెంటర్ కోసం భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలకు అథారిటీ అధికారికంగా ఆమోద ముద్ర వేసింది.
రాజధాని ప్రాంత రైతుల చిరకాల కోరిక అయిన జరీబు , మెట్ట భూముల వర్గీకరణ సమస్యపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ వర్గీకరణలో నెలకొన్న సందిగ్ధతను తొలగించి, రైతులకు న్యాయం చేసేందుకు ఒక రాష్ట్ర స్థాయి కమిటీని నియమించాలని అథారిటీ నిర్ణయించింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా భూముల విలువ , కేటాయింపులపై స్పష్టత రానుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తో పాటు సీఆర్డీఏ ఉన్నతాధికారులు పాల్గొని, రాజధాని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తీర్మానించారు.
108MP కెమెరా, Snapdragon 6 Gen 3తో భారత్లో REDMI Note 15 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఎంతంటే..?
తాజావార్తలు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..