YS Jagan: రేపు వైఎస్ జగన్ కీలక సమావేశం.. దానిపై నిర్ణయం తీసుకుంటారా?
- రేపు వైసీపీ కీలక ఉన్నత స్థాయి సమావేశం..
- తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరగనున్న మీటింగ్..
- 175 నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు, ఎమ్మెల్యేలతో సమావేశం..
- కూటమి ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధమైన జగన్..
- ఇప్పటికే పీఏసీ సభ్యులు, కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులతో సమావేశాలు..
- ప్రాంతాలు, జిల్లాలవారీగా పోరుబాట కార్యచరణ..
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా ఉంది. కూటమి పార్టీలు, వైసీపీ పోటాపోటీగా జనంలోకి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు కీలక సమావేశం నిర్వహించబోతున్నారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం ఏర్పాటు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి ప్రభుత్వంపై పోరాటం విషయంలో నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు జగన్.
Read Also: AP Government: ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు.. ఇది కూటమి ప్రభుత్వ విజయం..
Also Read
- YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
- CM Chandrababu: నేను దక్షిణాది రాష్ట్రాల వైపే మాట్లాడుతున్నా.. అందుకే ప్రధాని మోడీకి పూర్తి మద్దతు..
- AP Ministers Singapore Tour: సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం.. 7 రోజుల టూర్..
- Andhra Pradesh: వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు.. కొత్త కార్పొరేషన్ ఏర్పాటు..
గతవారం జగన్ పల్నాడు పర్యటన రాజకీయ దుమారానికి కారణమైంది. పర్యటన సూపర్ సక్సెస్ కావటం. ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావటం. వైసీపీ శ్రేణులు, అభిమానులు పోటెత్తటంతో రోడ్లు కిక్కిరిశాయి. పోలీసుల ఆంక్షలను నేతలు ధిక్కరించడం. మరోవైపు కార్యకర్తలు వివాదాస్పద ఫ్లెక్సీలు ప్రదర్శించటం, కాన్వాయ్లోని వాహనం సింగయ్య అనే వ్యక్తి చనిపోవడం రచ్చకు కారణమయ్యాయి. వివాదాస్పద ఫ్లెక్సీలు ప్రదర్శించిన వ్యక్తులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. జగన్ వాహనమే ఢీకొని సింగయ్య మృతి చెందాడని కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో జగన్ను A-2గా చేర్చడంతో వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనీపైనా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లతో జగన్ సమావేశం నిర్వహించనుండటం హాట్ టాపిక్ మారింది.
Read Also: DGCA : దేశంలోని ప్రధాన ఎయిర్ పోర్టుల్లో ‘సర్వేలెన్స్’..
ఇటీవల వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు జగన్. ఇప్పటికే పలు దఫాలుగా వైసీపీ పీఏసీ సభ్యులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, స్థానిక సంస్ధల ప్రజాప్రతినిధులు, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు ఆర్గనైజ్ చేశారు. ఈ మధ్య వరుసగా చోటు చేసకుంటున్న పరిణామాలు, వైసీపీ నేతల అరెస్టులు, పొదిలి, సత్తెనపల్లి పర్యటనల్లో నమోదు చేసిన కేసులు, కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీల అమలు లాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తి కావటంతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా నేతలను సమాయత్తం చేయనున్నారు జగన్. సమస్యలపై ప్రాంతాలవారీగా ఆందోళన నిర్వహణ, జిల్లా స్థాయిలోనూ పోరు బాట నిర్వహించేలా కార్యచరణ రూపొందించనున్నారు. అయితే ఇప్పటిదాకా నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో జగన్ నేరుగా పాల్గొనలేదు. ఇకపై మాత్రం నిరసన కార్యకరమాల్లో జగన్ పాల్గొని… కూటమి విమర్శలను తిప్పికొట్టే అవకాశం ఉందంటున్నారు. రేపటి మీటింగ్లో నేతలకు జగన్ ఏం చెప్పబోతున్నారు..? కేసులపై ఆ పార్టీ నేతల స్పందన ఏంటనేది చూడాలి.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?