YS Jagan: గోదావరి జలాలు, పోలవరం-బనకచర్లపై జగన్ కీలక వ్యాఖ్యలు..
- గోదావరి, పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుపై జగన్ కీలక వ్యాఖ్యలు..
- పొరుగు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులతో మిగులు నీటి లభ్యత ప్రశ్నార్థకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఏపీ, తెలంగాణ మధ్య కొనసాగుతోన్న జల వివాదాలపై కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమైన చర్చించిన వేళ.. గోదావరి జలాలు, పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.. పోలవరం ప్రాజెక్టు మరియు గోదావరి జలాల సమస్యకు సంబంధించి స్పష్టంగా అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఉందన్న ఆయన.. ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఇందిరా సాగర్ ప్రాజెక్టు పురోగతిని అడ్డుకుంది.. గోదావరి నదికి చెందిన అనేక ప్రధాన ఉపనదులు ఛత్తీస్గఢ్ లోని ప్రాణహిత, ఇంద్రావతి మరియు శబరి వంటివి కేంద్ర సహకారంతో పొరుగు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టుల వల్ల మిగులు నీటి లభ్యత ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు..
Read Also: Parliament Sessions: ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సెషన్స్.. 8 బిల్లులను ప్రవేశ పెట్టనున్న మోడీ సర్కార్!
Also Read
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
గోదావరికి అతిపెద్ద ఉపనది అయిన ప్రాణహిత నదిని ఎగువన ఉపయోగిస్తున్నారు.. ఇంద్రావతి-ప్రాణహితను ఒక జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్కు 50 వేల కోట్లు కేటాయించింది. ఇది పోలవరం వద్ద దిగువకు గూడవల్లి వద్ద గోదావరి మిగులు జలాల లభ్యతను ప్రశ్నార్థకం చేస్తుందన్నారు. ఇక, అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే పోలవరం దారి మళ్లింపు కోసం ఏదైనా మిగులు జలాలు అందుబాటులో ఉంటాయా? అని ప్రశ్నించారు జగన్.. రెండోది పోలవరం ఆనకట్ట ఎత్తు విషయాల చంద్రబాబు రాజీ పడ్డారని విమర్శించారు.. మొదట ఆమోదించబడిన ఎత్తు 45.72 మీటర్లు అయితే, దానిని 41.15 మీటర్లకు పరిమితం చేయడానికి చంద్రబాబు అంగీకరించారు.. ఆనకట్ట ఎత్తును 45.72 మీటర్లకు పెంచకుండా.. ప్రాజెక్టులో తగినంత నీటిని నిల్వ చేయలేరన్నారు.. నీటిని ఇతర ప్రాంతాలకు మళ్లించడం కూడా సాధ్యం కాదన్నారు జగన్.
Read Also: 8 vasanthalu: థియేటర్లో దేఖలేదు.. ఇప్పుడేమో తెగ లేపుతున్నారు!
పోలవరం పునరావాసం మరియు పునరావాస ప్యాకేజీకి అవసరమైన అదనపు 15 వేల కోట్ల నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి ఈ నిధులను సమకూర్చుకోవాలని సూచించారు జగన్.. అప్పుడే ఆనకట్టను మొదట అనుక్కున విధంగా పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు.. పోలవరం పూర్తి నిల్వ సామర్థ్యాన్ని నిర్ధారించకుండా బనకచర్ల ప్రాజెక్టు గురించి తొందరపడటం ఆర్థికంగా నష్టం జరుగుతుందన్నారు వైఎస్ జగన్.. తగినంత నీరు లేని ప్రాజెక్టుకు 80,000 కోట్లు ఖర్చు చేయడం ప్రజా ధనాన్ని వృథా చేయడమే అవుతుందన్నారు.. ఈ సమస్యలన్నింటినీ పూర్తిగా అధ్యయనం చేసి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!