Botsa Satyanarayana: ప్రతిపక్ష హోదా ఫస్ట్.. ఆ తర్వాతే అన్నీ..
- వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశాం..
- ప్రజల పక్షాన మాట్లాడేది ప్రతిపక్షం.. హోదా అవసరం...
- హోదా తమకు ఇవ్వకుండా గొంతు నొక్కలని చూస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా డిమాండ్ ఆది నుంచి ఉంది.. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం కావడంతో.. ప్రతిపక్ష హోదా కోల్పోయింది వైసీపీ.. అయితే, తమ పార్టీ మినహా అన్ని కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీలే కాబట్టి.. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది వైసీపీ.. ఇక, ఈ రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలోనే అది డిమాండ్ వినిపించింది వైసీపీ.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ప్రారంభించగా.. ప్రతిపక్ష హోదా ఇవ్వండి.. ప్రజల గొంతు వినిపించేందుకు అవకాశం ఇవ్వండి అంటూ నినాదాలు చేశారు వైసీపీ సభ్యులు.. ఆ తర్వాత పోడియం వద్దకు దూసుకెళ్లడం.. కాసేపు నిరసన తెలిపిన తర్వాత.. గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేయడం జరిగిపోయాయి.. దీనిపై శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: PM Modi: ఊబకాయంపై యుద్ధం.. 10 మందిని నామినేట్ చేసిన మోడీ
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశాం. ప్రజల పక్షాన మాట్లాడేది ప్రతిపక్షం అవసరం అన్నారు బొత్స.. అలాంటి హోదా తమకు ఇవ్వకుండా గొంతు నొక్కలని చూస్తున్నారని మండిపడ్డారు.. సభలో ఉన్నది రెండే పక్షాలు అని.. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పేంటి? అని నిలదీశారు.. మిర్చి రైతుల ఇబ్బందులు ప్రభుత్వ పట్టించుకోవటం లేదు. మా నేత జగన్ వెళ్ళే వరకు మిర్చి రైతుల ఇబ్బందులు పట్టించుకోలేదన్నారు.. ఇక, గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రతిపక్ష హోదా డిమాండ్ చేశాం.. మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నాం. జగన్ మిర్చి రైతుల దగ్గరకు వెళ్లాక ఆలోచించడం మొదలు పెట్టారని తెలిపారు.. రైతులకు న్యాయం చేస్తే సంతోషం.. కానీ, అసెంబ్లీలో రైతుల సమస్యలపై మాట్లాడాలి అంటే ప్రతిపక్ష హోదా కావాలన్నారు.. మిర్చి రైతుల పరామర్శలకు వెళ్తే కేసులు పెడతారు అని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. మ్యూజికల్ నైట్ కు ఇవేమీ ఉండవు అని దుయ్యబట్టారు.. ప్రతిపక్ష హోదా ఇవ్వడం పై ప్రభుత్వ స్పందన తర్వాత అసెంబ్లీకి వస్తామో లేదో చెబుతాం. లేకపోతే ప్రజల్లో ఉండి పోరాటం చేస్తాం అని ప్రకటించారు బొత్స సత్యనారాయణ..
Read Also: DK Aruna: తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం!
మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి.. రైతుల గురించి పట్టించుకొనే వరకు పోరాటం చేస్తాం.. మిర్చి రైతుల సమస్యలపై కేంద్రంతో మాట్లాడుతాం అంటున్నారే కానీ ముందుకు వెళ్లలేదని విమర్శించారు బొత్స.. మిర్చి యార్డుకు వెళ్తే మా నాయకుడు మీద కేసులు పెడుతున్నారు.. మ్యూజికల్ నైట్ లు పెట్టుకుంటే లీగల్ అంట.. ఇవన్నీ అడగాలంటే మా పార్టీని ప్రతిపక్షంగా గుర్తించాలని కోరుతున్నాం.. సూపర్ సిక్స్ అన్నారు.. సెవెన్ అన్నారు.. పెన్షన్ తప్ప ఒక్క హామీ నెరవేర్చలేదు.. గ్యారెంటీ అంటే మోసం అని అర్థం అవుతుంది.. ప్రభుత్వం ప్రతిస్పందన చూసి అసెంబ్లీకి హాజరయ్యే విషయం ఆలోచిస్తాం.. ప్రభుత్వం స్పందించక పోతే మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అన్నారు బొత్స సత్యనారాయణ..
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!