Pawan Kalyan: వైసీపీకి షాక్.. జనసేన గూటికి వైసీపీ కార్పొరేటర్లు.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- విశాఖపట్నంలో వైసీపీకి గట్టి షాక్..
- జనసేనలో చేరిన ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలు..
- పార్టీ కండువా కప్పి.. జనసేన పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి.. ఇప్పటికే కొన్ని మున్సిపాల్టీల్లో వైసీపీకి గుడ్బై చెప్పి.. టీడీపీలో చేరారు కార్పొరేటర్లు.. దీంతో.. కొన్ని మున్సిపాల్టీలను తన ఖాతాలో వేసుకుంది టీడీపీ.. మరోవైపు.. విశాఖపట్నంలో ఈ రోజు వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో.. ఆ ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలకు డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. పార్టీ కండువా కప్పి.. జనసేన పార్టీలోకి ఆహ్వానించారు..
Read Also: UP Video: యూపీలో రెచ్చిపోయిన జంట.. కారులో వెళ్తూ చిల్లర చేష్టలు
Also Read
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
- AP Weather: సమ్మర్ను తలపిస్తున్న ఏపీ వాతావరణం.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఇక, ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్.. ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలోకి ఇదే తొలి జాయినింగ్గా పేర్కొన్న ఆయన.. గత కొంత కాలంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను. ఇప్పుడు పార్టీ కార్యక్రమంలో పాల్గొటుంటే కొత్తగా ఉందన్నారు.. వ్యక్తిగతంగా వైసీపీ మనకు శత్రువు కాదు.. కానీ, వైసీపీ విధానాలతోనే జనసేన విభేధిస్తోందన్నారు.. నాయకుడు తప్పు చేస్తే.. శిక్ష కార్యకర్తలకు పడుతుంది. రాజకీయంగా, అన్ని రకాలుగా జనసేన నేతలు, కార్యకర్తలు ఎదగాలనే నేను కోరుకుంటున్నాను అన్నారు.. జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో కూటమి గెలవాలని కోరుకుంటున్నాను అన్నారు పవన్.. విశాఖ కాలుష్య నివారణపై కార్పొరేటర్లుగా మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి అని సూచించారు.. విశాఖలో త్వరలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తాం. త్వరలో విశాఖలో పర్యటిస్తాను. రియల్ ఎస్టేట్ సమస్యలు చాలా ఉన్నాయి. పేదలకు న్యాయం చేసేలా కొర్పొరేటర్లు పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!