Vishnuvardhan Reddy: గద్దర్పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. పద్మ పురస్కారం ఎలా ఇస్తారు..?
- గద్దర్పై బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు..
- ఎల్టీటీ ప్రభాకరన్, నయీమ్తో గద్దర్ను పోల్చిన విష్ణు..
- గద్దర్ కి పద్మ పురస్కారం ఇవ్వాలని ఎలా లేఖ రాస్తారు..
- భారత రాజ్యాంగాన్ని విశ్వసించని వ్యక్తి గద్దర్..
- గద్దర్ కి పద్మ పురస్కారం ఎలా ఇస్తారు? అని నిలదీత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnuvardhan Reddy: ప్రజాయుద్ధనౌక గద్దర్కు పద్మ పురస్కారం ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి లేఖ రాయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తే.. నక్సలైట్లతో కలిసి ఎంతో మందిని గద్దర్ హత్య చేయించారు. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు గద్దర్పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.. ఎల్టీటీ ప్రభాకరన్, నయీమ్తో గద్దర్ను పోల్చారు విష్ణువర్ధన్ రెడ్డి.. గద్దర్ కి పద్మ పురస్కారం ఇవ్వాలని ప్రధానికి సీఎం లేఖరాయడంపై స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి.. భారత రాజ్యాంగాన్ని విశ్వసించని వ్యక్తి గద్దర్ కి పద్మ పురస్కారం ఎలా ఇస్తారు? అని నిలదీశారు.
Read Also: MP Ayodhya Rami Reddy: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి..
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
అనేక మంది పోలీసులను చంపిన కేసులో కోర్టులకు తీరగలేనని రాష్ట్రపతికి గద్దర్ లేఖ రాసుకున్నారు.. గద్దర్ మావోయిస్టు లీడర్.. గద్దర్ కుమార్తె ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి గద్దర్ కు పద్మ పురస్కారం ఇవ్వాలా? అంటూ రేవంత్రెడ్డిని ప్రశ్నించారు విష్ణువర్ధన్రెడ్డి.. ఇక, రాజీవ్గాంధీని చంపిన వారికి రేవంత్ పద్మ పురస్కారం ఇవ్వమంటారా? అని నిలదీశారు.. గద్దర్ కి LTT తీవ్రవాదులకు తేడా లేదన్న ఆయన.. మాజీ మావోయిస్టు ,రాజ్యాంగం వ్యతిరేకించిన వ్యక్తికి ఏ హోదా లో రేవంత్ రెడ్డి పద్మ అవార్డు అడుగుతున్నారు.. ఉగ్రవాదులకు కూడా రేవంత్ పద్మ అవార్డులు అడుగుతారా అని ప్రశ్నించారు.. గద్దర్ ను మావోయిస్టు అని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ.. గద్దర్ ను చంపడానికి ప్రయత్నించింది కాంగ్రెస్ పార్టీ.. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి పద్మ అవార్డుల గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.. పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియ కూడా తెలియని వాళ్లు రేవంత్ కి సలహాలు ఇస్తున్నట్లు ఉందని దుయ్యబట్టారు.. పబ్లిక్ డొమైన్ లో ఓటింగ్ ద్వారా కూడా పద్మ పురస్కారాలు ఇస్తారు.. దరఖాస్తులు చేయని మొగలయ్యకు పద్మ శ్రీ ఇచ్చారు.. భారత ప్రభుత్వం గుర్తించి రామయ్య పద్మ అవార్డు అందించిందని చెప్పుకొచ్చారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి.
తాజావార్తలు
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!