MP Ayodhya Rami Reddy: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి..
- తాను పార్టీ మారుతున్నాను అన్న ప్రచారంలో వాస్తవం లేదు..
- క్లారిటీ ఇచ్చిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి..
- పార్టీ విజయాల బాటలో ఉన్నప్పుడు అన్ని సక్రమంగానే ఉంటాయి..
- ఓటమి ఎదురైనప్పుడే నాయకులు పోరాటం చేయాలి..
- విజయసాయిరెడ్డి ఒత్తిళ్లకు భయపడే వ్యక్తి కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Ayodhya Rami Reddy: కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. అయితే, ఇదే సమయంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా సాయిరెడ్డి బాటలో నడుస్తున్నారనే ప్రచారం గుప్పుమంది.. రేపోమాపో అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తారనే గుసగుసలు వినిపించాయి.. అయితే, తాను పార్టీ మారుతున్నాను అన్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి.. పార్టీ విజయాల బాటలో ఉన్నప్పుడు అన్ని సక్రమంగానే కనపడతాయని, ఓటమి ఎదురైనప్పుడే నాయకులు పోరాటం చేయాలని సూచించారు.. విజయసాయిరెడ్డి ఒత్తిళ్లకు భయపడే వ్యక్తి కాదని, రాజకీయాలకు ఎందుకు దూరం అయ్యారన్నది ఆయన వ్యక్తిగతమన్నారు.. ఇక, వైసీపీలో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకుంటామని తెలిపారు.. మా పార్టీలో లోపాలు లేకపోతే, మళ్లీ ఎన్నికల్లో మేమే గెలిచే వాళ్లం కదా? అని ప్రశ్నించారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి.
Read Also: DGP Dwaraka Tirumala Rao: టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి లోపు లక్ష కెమెరాలు ఏర్పాటు..
Also Read
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
ప్రతి రాజకీయ పార్టీకి ఎత్తులు, పల్లాలు ఉంటాయి.. ఒత్తిడి తట్టుకొని నిలబడగలిగితే, పార్టీలు బ్రతుకుతాయి, లేదంటే మనుగడ చాలిస్తాయి అన్నారు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి.. మా పార్టీలో అన్ని కరెక్ట్ గా జరిగితే మొన్న ఎన్నికల్లో మేమే గెలిచేవాళ్లం.. పార్టీలో కొన్ని లోపాలు ఉన్నాయి.. వాటిని సరిదిద్దుకుంటాం అన్నారు.. నేను పార్టీ మారుతున్నాను అన్న ప్రచారం వాస్తవం కాదు.. ప్రతి కుటుంబంలో అలకలు, కలతలు ఉన్నట్లే, ప్రస్తుతం వైసీపీలో ఉన్నాయన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి..
తాజావార్తలు
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..