World Population Day: నేడు ప్రపంచ జనాభా దినోత్సవం.. కీలక ప్రకటన చేయనున్న ఏపీ సీఎం..!
- నేడు ప్రపంచ జనాభా దినోత్సవం..
- ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం..
- సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Population Day: నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు.. ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, ఉన్నతాధికారులు.. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు నాయుడు.. జనాభాపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది..
Read Also: US Birthright Citizenship: ట్రంప్కు షాక్.. జన్మతః పౌరసత్వ హక్కుపై ఆదేశాలకు ఫెడరల్ కోర్టు బ్రేక్!
Also Read
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
- Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
- AP Women's Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..
ఇప్పటికే జనాభాలో యువత తగ్గడంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. రాబోయే పదేళ్లలో వృద్ధులు ఎక్కువ అవుతారని గణాంకాలు చెబుతున్నాయి.. దీంతో, జనాభా పెరుగుదల ఆవశ్యకతను సీఎం చంద్రబాబు వివరించే అవకాశం ఉంది.. మరోవైపు, దక్షిణ భారతంలో జనాభా తగ్గుదలపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.. గతంలో.. ఒక్కరు ముద్దు.. ఇద్దరు చాలు అని ప్రచారం చేసిన ప్రభుత్వాలు.. ఇప్పుడు.. ముగ్గురుని కనండి.. నలుగురైతే నష్టమేంటి అనేవిధంగా తమ నిర్ణయాలను మార్చుకుంటున్నాయి.. పిల్లలను బరువుగా భావించకుండా.. ఆస్తిగా పరిగణించాలని కూడా చెబుతున్నారు.. దీంతో, ఇవాళ జరిగే ప్రపంచ జనాభా దినోత్సవంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందంటున్నారు..
Read Also: Off The Record : ఏ పనికైనా డాడీ పర్మిషన్ కావాలంటున్న మంత్రి
ఇక, ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రపంచ జనాభా దినోత్సవం కార్యక్రమనికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు.. కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు బయల్దేరి వెళ్తారు.. మరోవైపు, హైదరాబాద్ నుంచే ఎల్లుండి సాయంత్రం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది..
తాజావార్తలు
-
President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
-
Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
-
RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
-
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
-
BCCI: బంగ్లాదేశ్ సిరీస్లపై స్పందించిన బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పర్యటనలు..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?