Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి.. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Laddu Controversy: కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ, NDDB రిపోర్ట్ ఆధారంగా అవినీతి, టెండర్ లో మినహాయింపులు మరియు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు.. లడ్డూల తయారీకి ఉపయోగిస్తున్న నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆయన.. ఈ వ్యవహారంలో వైసీపీ నేతల వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు.. వైసీపీ నేతల్లా అమ్మనా భూతులు తిట్టాలా..? లడ్డూ విషయంలో చాలా క్లీయర్ గా ఉన్నాం.. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తు అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు.
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు.. ఆ ముగ్గురు ఆ సమయంలో కలసి పని చేశారని తెలిపారు శ్రీనివాస వర్మ.. కానీ, ఇప్పుడు వైసీపీ నేతల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి.. జంతువుల కొవ్వు కలిసిందని NDDB రిపోర్టు బయట పెట్టింది… దాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు బయట పెట్టారు.. ఆ రిపోర్టును కూటమి ప్రభుత్వం ఏమీ తయారు చేయలేదు కదా? అని ప్రశ్నించారు.. భోలే బాబాకు అసలు పాల ఉత్పత్తి లేదు.. డైరీ లేదు… పాలు లేదు కాని.. నెయ్యి చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు..
వైఎస్ జగన్కు క్లీన్చీట్ ఎవరు ఇచ్చారు.. చూపించండి? అని నిలదీశారు శ్రీనివాస వర్మ.. అయితే, వైవీ సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని.. తప్పు చేశామని ఒప్పుకున్నారు.. జగన్కు ఏంటి బాధ.. రికార్డులను ట్యాంపరింగ్ చేస్తే శిక్ష తప్పదు.. అలాంటి అవకాశం లేదు అని స్పష్టం చేశారు.. టెండర్లు నిబంధనలలో పెద్దఎత్తున మార్పులు చేశారు.. కేవలం అవినీతి కోసం అలా చేశారు.. ఆ నెయ్యితోనే స్వామివారికి హారతి ఇస్తాం… అలాంటి నెయ్యిని కల్తీ చేశారు అని మండిపడ్డారు.. 2022లో రిపోర్ట్ ఇస్తే.. ఎందుకు చర్యలు తీసుకోలేదు..? అని ప్రశ్నించారు.. అర్హత లేనివారికి ఎలా నెయ్యి కాంట్రాక్టు ఇస్తారు…? అని నిలదీశారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.
తాజావార్తలు
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
-
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
-
Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..