Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి.. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Laddu Controversy: కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ, NDDB రిపోర్ట్ ఆధారంగా అవినీతి, టెండర్ లో మినహాయింపులు మరియు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు.. లడ్డూల తయారీకి ఉపయోగిస్తున్న నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆయన.. ఈ వ్యవహారంలో వైసీపీ నేతల వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు.. వైసీపీ నేతల్లా అమ్మనా భూతులు తిట్టాలా..? లడ్డూ విషయంలో చాలా క్లీయర్ గా ఉన్నాం.. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తు అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు.
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు.. ఆ ముగ్గురు ఆ సమయంలో కలసి పని చేశారని తెలిపారు శ్రీనివాస వర్మ.. కానీ, ఇప్పుడు వైసీపీ నేతల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి.. జంతువుల కొవ్వు కలిసిందని NDDB రిపోర్టు బయట పెట్టింది… దాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు బయట పెట్టారు.. ఆ రిపోర్టును కూటమి ప్రభుత్వం ఏమీ తయారు చేయలేదు కదా? అని ప్రశ్నించారు.. భోలే బాబాకు అసలు పాల ఉత్పత్తి లేదు.. డైరీ లేదు… పాలు లేదు కాని.. నెయ్యి చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు..
వైఎస్ జగన్కు క్లీన్చీట్ ఎవరు ఇచ్చారు.. చూపించండి? అని నిలదీశారు శ్రీనివాస వర్మ.. అయితే, వైవీ సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని.. తప్పు చేశామని ఒప్పుకున్నారు.. జగన్కు ఏంటి బాధ.. రికార్డులను ట్యాంపరింగ్ చేస్తే శిక్ష తప్పదు.. అలాంటి అవకాశం లేదు అని స్పష్టం చేశారు.. టెండర్లు నిబంధనలలో పెద్దఎత్తున మార్పులు చేశారు.. కేవలం అవినీతి కోసం అలా చేశారు.. ఆ నెయ్యితోనే స్వామివారికి హారతి ఇస్తాం… అలాంటి నెయ్యిని కల్తీ చేశారు అని మండిపడ్డారు.. 2022లో రిపోర్ట్ ఇస్తే.. ఎందుకు చర్యలు తీసుకోలేదు..? అని ప్రశ్నించారు.. అర్హత లేనివారికి ఎలా నెయ్యి కాంట్రాక్టు ఇస్తారు…? అని నిలదీశారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.
తాజావార్తలు
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!