Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి.. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Laddu Controversy: కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ, NDDB రిపోర్ట్ ఆధారంగా అవినీతి, టెండర్ లో మినహాయింపులు మరియు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు.. లడ్డూల తయారీకి ఉపయోగిస్తున్న నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆయన.. ఈ వ్యవహారంలో వైసీపీ నేతల వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు.. వైసీపీ నేతల్లా అమ్మనా భూతులు తిట్టాలా..? లడ్డూ విషయంలో చాలా క్లీయర్ గా ఉన్నాం.. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తు అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు.
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు.. ఆ ముగ్గురు ఆ సమయంలో కలసి పని చేశారని తెలిపారు శ్రీనివాస వర్మ.. కానీ, ఇప్పుడు వైసీపీ నేతల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి.. జంతువుల కొవ్వు కలిసిందని NDDB రిపోర్టు బయట పెట్టింది… దాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు బయట పెట్టారు.. ఆ రిపోర్టును కూటమి ప్రభుత్వం ఏమీ తయారు చేయలేదు కదా? అని ప్రశ్నించారు.. భోలే బాబాకు అసలు పాల ఉత్పత్తి లేదు.. డైరీ లేదు… పాలు లేదు కాని.. నెయ్యి చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు..
వైఎస్ జగన్కు క్లీన్చీట్ ఎవరు ఇచ్చారు.. చూపించండి? అని నిలదీశారు శ్రీనివాస వర్మ.. అయితే, వైవీ సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని.. తప్పు చేశామని ఒప్పుకున్నారు.. జగన్కు ఏంటి బాధ.. రికార్డులను ట్యాంపరింగ్ చేస్తే శిక్ష తప్పదు.. అలాంటి అవకాశం లేదు అని స్పష్టం చేశారు.. టెండర్లు నిబంధనలలో పెద్దఎత్తున మార్పులు చేశారు.. కేవలం అవినీతి కోసం అలా చేశారు.. ఆ నెయ్యితోనే స్వామివారికి హారతి ఇస్తాం… అలాంటి నెయ్యిని కల్తీ చేశారు అని మండిపడ్డారు.. 2022లో రిపోర్ట్ ఇస్తే.. ఎందుకు చర్యలు తీసుకోలేదు..? అని ప్రశ్నించారు.. అర్హత లేనివారికి ఎలా నెయ్యి కాంట్రాక్టు ఇస్తారు…? అని నిలదీశారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!