PM Modi Amaravathi Re Launch: ప్రధాని మోడీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత.. ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి వరకు..!
- అమరావతి రీలాంచ్ కి ప్రధాని నరేంద్ర మోడీ..
- ప్రధాని టూర్ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు..
- నిఘా నీడలోకి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం..
- ప్రధాని పర్యటన నేపథ్యంలో కార్గో సర్వీసులు నిలిపివేత..
- సభా ప్రాంగణంలో భారీ భద్రతా ఏర్పాట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Amaravathi Re Launch: మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. రాజధాని అమరావతి రీలాంచ్లో పాల్గొనబోతున్నారు.. అయితే, ప్రధాని టూర్ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.. నిఘా నీడలోకి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లిపోయింది.. ప్రధాని పర్యటన నేపథ్యంలో కార్గో సర్వీసులు నిలిపివేశారు ఎయిర్పోర్ట్ సిబ్బంది.. ఎయిర్పోర్ట్ ప్రధాన గేటు వద్ద ఫ్లైట్ టికెట్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు.. ఇక, ఎయిర్పోర్ట్ పిక్ అప్ కి వచ్చే వారికి పాస్ తప్పనిసరిగా ఉండాలంటున్నారు పోలీసులు..
Read Also: MLC Kavitha : భౌగోళిక తెలంగాణ సాధించాం.. కానీ సామాజిక తెలంగాణ మాత్రం ఇంకా సాధించాల్సిందే
Also Read
- Nadendla Manohar: మనమంతా పవన్ కల్యాణ్ కోసమే.. గ్రూప్ రాజకీయాలు వద్దు..
- Pawan Kalyan: నీట్ నిరసనలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి..
- Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
- Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
మరోవైపు ప్రధాని మోడీ సభకు తరలివచ్చే మార్గాల్లో బందోబస్తు కట్టుదిట్టం చేశారు పోలీసులు.. 6500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. ఈ భారీ బహిరంగ సభకు 5 లక్షల మంది వరకు రాష్ట్ర వ్యాప్తంగా వస్తారని అంచనాలు ఉండగా.. 37 మంది ఐపీఎస్, ట్రైనీ ఐపీఎస్ లతో భద్రత పర్యవేక్షిస్తున్నారు.. ప్రధాన మార్గాల్లో వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పాస్లు ఉంటే వేదిక దగ్గరకు అనుమతి ఇస్తున్నారు.. మిగతా వాహనాలకు 256 ఎకరాల్లో ఉన్న పార్కింగ్ ప్రాంతాలకు పంపిస్తున్నారు.. అంతేకాదు.. రూట్ మ్యాప్ కోసం క్యూ ఆర్ కోడ్ లు ఏర్పాటు చేశారు అధికారులు..
Read Also: HHVM : హరిహర వీరమల్లు రిలీజ్ పై గందరగోళం..
అమరావతి పునఃప్రారంభ సభకు ప్రధాని మోడీ విచ్చేయనున్న నేపథ్యంలో విజయవాడలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.. విజయవాడ నగరంలో 599 మంది ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు.. 175 కీలక ట్రాఫిక్ పాయింట్ల వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు.. నగర శివారుల్లో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు పెట్టారు.. 10 క్రేన్లు, డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.. సభ ప్రాంతానికి వీవీఐపీ రూట్లపై ముందస్తుగా నిఘా పెట్టారు.. గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి ఇప్పటికే వాహనాల బారులు తీరాయి.. ట్రాఫిక్ క్యూలు నివారించేందుకు అస్త్రం యాప్ ఉపయోగిస్తున్నారు.. ట్రాఫిక్ బ్రేక్డౌన్, ఎమర్జెన్సీ పరిస్థితులకు ప్రత్యేక బృందాలు సిద్ధం చేశారు పోలీసులు..
Read Also: Pahalgam Terror Attack: భారత్లోనే పహల్గామ్ ఉగ్రవాదులు! ఎక్కడున్నారంటే..! ఎన్ఐఏ అంచనా ఇదే!
కాగా, ప్రజా రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దబోతోంది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. ఒక మహోన్నత లక్ష్యంతో 2015లో కొత్త రాష్ట్రంలో. కొత్త రాజధాని సంకల్పం జరిగింది..8603 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ప్రాంతంగా గుర్తించారు.ఇందులో 217 చ.కి.మీ. పరిధిలో రాజధాని నగరం నిర్మించబోతున్నారు.దీనిలో 16.9 చ.కీ పరిథిలో కోర్ క్యాపిటల్ ఉంటుంది. ఎపిసిఆర్డిఏ యాక్ట్ 2014 ప్రకారం అమరావతి రాజధానిగా ఏర్పాటు అయింది. రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వేల ఎకరాలు ఇచ్చిన దేశంలోనే ఒకే ఒక ప్రాజెక్ట్ ఇది. 58 రోజుల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరణ చేపట్టడం ఒక సక్సెస్ మోడల్ గా ప్రభుత్వం చెబుతోంది..34281 ఎకరాలు భూ సమీకరణ ద్వారా ఇచ్చారు. 4300 ఎకరాలు భూసేకరణ ద్వారా తీసుకున్నారు. మిగిలిన 15,167 ఎకరాల భూమి ప్రభుత్వ, అటవీ, కొండ, ఇతర భూమలు ఉన్నాయి.
తాజావార్తలు
-
The Paradise: 20 కోట్ల వ్యూస్తో దుమ్మురేపిన ‘ఆయా షేర్’.. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్పై బిగ్ అప్డేట్!
-
Indian Idol 16 Winner: ఇండియన్ ఐడల్ 16 విజేతగా జ్యోతిర్మయి నాయక్.. ట్రోఫీతో పాటు రూ. 20 లక్షల ప్రైజ్ మనీ
-
Ram Charan: రామ్ చరణ్కు గాయం.. సర్జరీ కోసం కోయంబత్తూరు, RC17పై ప్రభావం?
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!