Minister Bosta: మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు విఫలం.. బొత్స ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచివాలయంలో మున్సిపల్ కార్మికులతో జీవోఎం చర్చలు ముగిసాయి. కార్మిక సంఘాల డిమాండ్ల పై మంత్రి బొత్స, సజ్జల, అధికారులు విడిగా చర్చించారు. కనీస వేతనం 21 వేల కంటే అదనంగా మరో మూడు వేలు అయినా పెంచాలని మున్సిపల్ కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. అంతేకాకుండా.. గ్రాట్యుటీ ఇవ్వాల్సిందేనని మున్సిపల్ కార్మిక సంఘాలు కోరారు. అయితే.. జీతాలు 24 వేలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో మరోసారి చర్చలు విఫలమయ్యాయి. కాగా.. సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.
Minister Seediri: 14 ఏళ్ళు సీఎంగా ఉండి కొత్తగా ఒక్క పోర్టుకు నిర్మాణం చేయలేదు..
Also Read
- Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కాల్వలు, బాత్రూం క్లీనర్స్, సేవరేజ్, గార్బేజ్ సిబ్బంది, మలేరియా వర్కర్స్ వంటి 10 క్యాటగిరీల వారికి 21 వేల కనీస వేతనం ఇస్తామన్నారు. ప్రస్తుతం ఇస్తున్న 15 వేలు, అలవెన్స్ స్థానంలో మొత్తం జీతంగా పరిగణించాలి అని అడిగారన్నారు. వాటికి అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. మరోవైపు.. నాన్ పీహెచ్ వర్కర్లకు సంబంధించిన క్యాటగిరీల సమస్యలు అన్నింటినీ వారం, పది రోజుల్లో పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చామన్నారు. యాక్సిడెంటల్ డెత్స్ విషయంలో నష్ట పరిహారం ఐదు నుంచి ఏడు లక్షలకు పెంచటానికి అంగీకరించామని మంత్రి తెలిపారు.
Ram Temple Inauguration: జైళ్లలో రామ మందిర ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం..
మూడు నెలల్లో నష్టం పరిహారాన్ని క్లెయిమ్ చేసుకోని వారికి వన్ టైం సెటిల్మెంట్ కింద అవకాశం ఇవ్వటానికి అంగీకరించామని పేర్కొన్నారు. రిటైర్ అయిన తరువాత వన్ టైం సెటిల్మెంట్ గా 50 వేలు ఇస్తాం అని హామీ ఇచ్చామని తెలిపారు. కనీస సర్వీస్ 10 ఏళ్ళు ఉండాలి.. పదేళ్ళు పైన సర్వీస్ ఉన్న వారికి ఏడాదికి రెండు వేలు చొప్పున ఇస్తామన్నారు మంత్రి. రెండేళ్లలోనే జీతాలు పెంచుతారా అని మంత్రి ప్రశ్నించారు.? సమ్మె విరమించాలని కోరుతున్నాం.. ప్రభుత్వం ఐదేళ్ళ కాలానికి ఉంటుంది.. ఐదేళ్ళకు ఒకసారి జీతాలు పెంచుతారని మంత్రి అన్నారు. ప్రతి ఏటా జీతాలు పెంచుతారా అని ప్రశ్నించారు?. వచ్చే ప్రభుత్వంలో జీతాలు పెంచుతాం అని చెప్పాం.. పండుగల సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని మంత్రి సూచించారు. సమ్మె విరమిస్తారని నమ్ముతున్నట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
-
Acer Sospiro A15: ఏసర్ సోస్పిరో A15 విడుదల.. డ్యూయల్ డిస్ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ
-
ENG-W vs IND-W: లార్డ్స్లో భారత్ హవా.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా మహిళలు..!
-
Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్తో కొత్త కాంబో?
-
Vivo Y05e: వివో Y05e విడుదల.. 5150mAh బ్యాటరీ, Unisoc T606 చిప్తో బడ్జెట్ స్మార్ట్ఫోన్
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!