TDP and BJP: బీజేపీలో చేరాలంటే టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే..!?
- ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి వింత పరిస్థితి..
- బీజేపీలో నేతల చేరికపై టీడీపీ కొన్ని అభ్యంతరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP and BJP: ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ పాలన సాగుతోంది. కూటమి ప్రభుత్వంగా ఒక్కటిగా ఉన్నా.. పార్టీల పరంగా ఎవరిదారిలో వారు వెళ్తున్నారు. రాజకీయంగా బలపడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా ఇటీవలే బీజేపీ కొన్ని చేరికలపై దృష్టి పెట్టింది… మొన్న రాజ్యసభలో కృష్ణయ్య కు అవకాశం ఇచ్చింది.. అలాగే కొంతమంది నేతలను చేర్చుకునే పనిలో పడింది బీజేపీ. అయితే, బీజేపీలో నేతల చేరిక విషయమై మిత్రపక్షం టీడీపీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా గత ప్రభుత్వం పాలనలో వైసీపీలో ఉండి తమ కేడర్ను ఇబ్బందిపెట్టిన నేతలను చేర్చుకోవద్దని టీడీపీ చెబుతున్నట్టు సమాచారం… టీడీపీ క్యాడర్ను వేధించిన వాళ్లు.. బీజేపీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
Read Also: Vallabhaneni Vamsi: హైకోర్టులో వల్లభనేని వంశీ పిటిషన్.. నన్ను ఇరికించే ప్రయత్నం..!
Also Read
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
- AP Weather: సమ్మర్ను తలపిస్తున్న ఏపీ వాతావరణం.. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీలో చేరాలనుకోగా.. స్థానిక నేతలు వ్యతిరేకించినట్లు సమాచారం.. బీజేపీలో చేరాలి అనుకుంటే… టీడీపీ నేతలు అభ్యంతరాలు తెలిపినట్లు సమాచారం. తోట త్రిమూర్తులు విషయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది.. తాము రాజకీయంగా బలపడే విషయంలో ఎవరిని చేర్చుకుంటే టీడీపీకి ఎందుకని బీజేపీ నేతలు చెబుతున్నారు. కూటమి సర్కార్కు మద్దతిస్తాం కానీ.. పార్టీలో నేతల చేరికపై టీడీపీకి సమస్యేంటంటున్నారు బీజేపీ నేతలు. గతంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. టీడీపీలోకి వెళ్ళాలి అనుకుని. జనసేనలో చేరారు. ఇదే బాటలో మరికొందరు పయనిస్తున్నారు. అయితే.. టీడీపీ అభ్యంతరాల వల్ల… తమకు రాజకీయంగా నష్టం జరుగుతుందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చేరే నేతల విషయంలో క్లారిటీగా ఉండాలని బీజేపీ చీఫ్ పురందేశ్వరికి జాతీయ నేతలు చెప్పినట్లు సమాచారం.. మరి భవిష్యత్తులో చేరికలపై బీజేపీ, టీడీపీలు ఎలా వ్యవహరిస్తాన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!