Vallabhaneni Vamsi: హైకోర్టులో వల్లభనేని వంశీ పిటిషన్.. నన్ను ఇరికించే ప్రయత్నం..!
- ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్..
- కాసరనేని కేసులో నన్ను ఇరికించే అవకాశం ఉందన్న వంశీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi: ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్ దాఖలు చేశారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కాసరనేని వెంకట పాండురంగారావు పై గత ఏడాది జరిగిన దాడికి సంబంధించి నమోదైన కేసులో పోలీసులు తనను ఇరికించే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు వంశీ.. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును కోరారు.. పాండురంగారావు పై దాడి ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదు.. పోలీసులు రాజకీయ కారణాలతో తనను నిందితునిగా చేర్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.. తనతో పాండురంగారావుకు గతంలో ఉన్న రాజకీయ విభేదాలతో ఇప్పుడు తనను లక్ష్యంగా చేసుకుని ఈ కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో పోలీసులు ముందుకు వెళ్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు వల్లభనేని వంశీ..
Read Also: PM Modi: ఖతార్ అమీర్కు ఆలింగనంతో స్వాగతం పలికిన ప్రధాని మోడీ.. (వీడియో)
Also Read
మరోవైపు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.. వంశీ తో పాటు అరెస్టు చేసిన మరో ఇద్దరిని కూడా 10 రోజులు పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు.. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ లో టెక్నికల్ మిస్టేక్స్ ఉండడంతో న్యాయమూర్తి దాన్ని మార్చి ఇవ్వాలని ఆదేశించారు దీంతో పోలీసులు కస్టడీ పిటిషన్ లో మార్పులు జరిపి మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. మరోవైపు రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి బెయిల్ ఇవ్వాలని వంశీ తరుపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఇది కేవలం తనపై రాజకీయ వ్యక్తిగత కక్షతో నమోదు చేసిన కేసుగా వంశీ పేర్కొన్నారు. సత్యవర్ధన్ ను తాను కిడ్నాప్ చేశానని నమోదు చేసిన కేసు కూడా కక్షపూరితంగా చేసిందని వంశీ పిటిషన్ లో తెలిపారు. గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో 2023 ఫిబ్రవరి 23న సత్య వర్ధన్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో తనను ఎవరు తిట్టలేదని స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారని వంశీ తెలిపారు. ఇదే విషయాన్ని కోర్టులో కూడా సత్య వర్ధన్ అఫిడవిట్ రూపంలో సత్య వర్ధన్ తెలియజేశారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను సత్యవర్ధన్ను బెదిరించాల్సిన అవసరం ఏముంటుందని పిటిషన్ లో పేర్కొన్నారు. వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్లు విచారణకు ఎస్సీ ఎస్టీ కోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది. రెండు వర్గాలకు నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వటంతో రేపు కౌంటర్లు ఇరు వర్గాలు దాఖలు చేయనున్నారు పిటిషన్లు మీద రేపు లేదా ఎల్లుండి విచారణ చేయనున్నారు.
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!