Vallabhaneni Vamsi: హైకోర్టులో వల్లభనేని వంశీ పిటిషన్.. నన్ను ఇరికించే ప్రయత్నం..!
- ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్..
- కాసరనేని కేసులో నన్ను ఇరికించే అవకాశం ఉందన్న వంశీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi: ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్ దాఖలు చేశారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కాసరనేని వెంకట పాండురంగారావు పై గత ఏడాది జరిగిన దాడికి సంబంధించి నమోదైన కేసులో పోలీసులు తనను ఇరికించే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు వంశీ.. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును కోరారు.. పాండురంగారావు పై దాడి ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదు.. పోలీసులు రాజకీయ కారణాలతో తనను నిందితునిగా చేర్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.. తనతో పాండురంగారావుకు గతంలో ఉన్న రాజకీయ విభేదాలతో ఇప్పుడు తనను లక్ష్యంగా చేసుకుని ఈ కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో పోలీసులు ముందుకు వెళ్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు వల్లభనేని వంశీ..
Read Also: PM Modi: ఖతార్ అమీర్కు ఆలింగనంతో స్వాగతం పలికిన ప్రధాని మోడీ.. (వీడియో)
Also Read
- TDP Mahanadu: మహానాడులో చంద్రబాబు కీలక తీర్మానం.. ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలి..
- IMD : నైరుతి రుతుపవనాలు వచ్చేసినట్టేనా..? వాతావరణ శాఖ కీలక అప్డేట్..!
- RK Roja: కూటమి ప్రభుత్వంపై రోజా ఫైర్..
- AP Environment Protection Task Force: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు..నదుల కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
మరోవైపు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.. వంశీ తో పాటు అరెస్టు చేసిన మరో ఇద్దరిని కూడా 10 రోజులు పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు.. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ లో టెక్నికల్ మిస్టేక్స్ ఉండడంతో న్యాయమూర్తి దాన్ని మార్చి ఇవ్వాలని ఆదేశించారు దీంతో పోలీసులు కస్టడీ పిటిషన్ లో మార్పులు జరిపి మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. మరోవైపు రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి బెయిల్ ఇవ్వాలని వంశీ తరుపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఇది కేవలం తనపై రాజకీయ వ్యక్తిగత కక్షతో నమోదు చేసిన కేసుగా వంశీ పేర్కొన్నారు. సత్యవర్ధన్ ను తాను కిడ్నాప్ చేశానని నమోదు చేసిన కేసు కూడా కక్షపూరితంగా చేసిందని వంశీ పిటిషన్ లో తెలిపారు. గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో 2023 ఫిబ్రవరి 23న సత్య వర్ధన్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో తనను ఎవరు తిట్టలేదని స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారని వంశీ తెలిపారు. ఇదే విషయాన్ని కోర్టులో కూడా సత్య వర్ధన్ అఫిడవిట్ రూపంలో సత్య వర్ధన్ తెలియజేశారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను సత్యవర్ధన్ను బెదిరించాల్సిన అవసరం ఏముంటుందని పిటిషన్ లో పేర్కొన్నారు. వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్లు విచారణకు ఎస్సీ ఎస్టీ కోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది. రెండు వర్గాలకు నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వటంతో రేపు కౌంటర్లు ఇరు వర్గాలు దాఖలు చేయనున్నారు పిటిషన్లు మీద రేపు లేదా ఎల్లుండి విచారణ చేయనున్నారు.
తాజావార్తలు
-
AB de Villiers: వైభవ్ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..