MLA Quota MLC Election: ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు.. రేపు క్లారిటీ..!
- ఎమ్మెల్సీలు విషయంలో రేపు కొంత స్పష్టత..
- గత ఎన్నికల్లో టిక్కెట్ రానివాళ్లు..
- టిడిపి పోటీ చేయని స్థానాల్లో ఉన్న బీసీ నేతలపై దృష్టి..
- నేతల పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ ఎంపికపై కసరత్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Quota MLC Election: ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఐదు స్థానాలకు గాను…ఒకటి కన్ఫామ్ అయిపోయింది. జనసేన తరపున నాగబాబుని ఇప్పటికే ఖరారు చేశారు. మిగిలిన నాలుగు స్థానాలకు సంబంధించి టీడీపీకి మూడు వస్తాయి. ఒక ఎమ్మెల్సీని తీసుకోవాలా ? వద్దా ? అన్న డైలమాలో కాషాయ పార్టీ పడింది. మూడు మాత్రం పక్కాగా తెలుగుదేశం పార్టీకి వస్తుండటంతో ఆ పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. బీజేపీ ఎమ్మెల్సీ వద్దంటే…అది కూడా టీడీపీనే తీసుకునే అవకాశం ఉంది. ఉన్న ఎమ్మెల్సీలను ఎవరికి ఇవ్వాలన్న దానిపై తెలుగుదేశం పార్టీలో తర్జనభర్జన సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్లను…ఆశావహులు కలిశారు. ఎమ్మెల్సీ ఆశిస్తున్న వారంతా…మరోసారి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీలు విషయంలో రేపు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టిడిపి ఇద్దరు బీసీలు…ఒక ఎస్సీ…ఒక ఎస్టీకి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. గత ఎన్నికల్లో టిక్కెట్ రానివాళ్లు…టిడిపి పోటీ చేయని స్థానాల్లో ఉన్న బీసీ నేతలపై మాత్రమే దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇద్దరు బీసీలకు ఈసారి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎల్లుండి అధికారికంగా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
Read Also: Nagababu Nomination: నామినేషన్ వేసేందుకు సిద్ధమైన నాగబాబు.. ముహూర్తం ఎప్పుడంటే..?
Also Read
- Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాదు.. అది క్రిమినల్స్ అదృష్టం.. లా అండ్ ఆర్డర్పై పవన్ ఘాటు వ్యాఖ్యలు..
- APL 2026: మంగళగిరిలో ఏపీఎల్ జోష్.. సెమీస్, ఫైనల్కు భారీ ఏర్పాట్లు
- Sajjala Ramakrishna Reddy: గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం.. వైసీపీ కొత్త వ్యూహం
- YS Jagan: ‘హలో ఇండియా’ అంటూ జగన్ పోస్ట్.. కూటమి సర్కార్పై సంచలన ఆరోపణలు
సామాజిక సమీకరణాలు.. జిల్లాల వారీగా ఆయన నేతల పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ ఎంపికపై దృష్టిపెట్టారు సీఎం చంద్రబాబు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి మాజీ మంత్రులు కేఎస్ జవహర్…కిడారి శ్రవణ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మైనారిటీల నుంచి కూడా కొంతమంది ఆశావహులు ఉన్నారు. వీరు చంద్రబాబును కలిసి తమకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. రాజధాని కోసం ఉద్యమంలో పాల్గొని.. చంద్రబాబు అరెస్ట్ సమయంలో దీక్ష చేసిన షేక్ రిజ్వానా…ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి నజీర్..విజయవాడలో ఎమ్ ఎస్ బేగ్ ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఈ సారి మైనారిటీలకు ఎంత వరకు అవకాశం వస్తుందో చూడాలి. నాలుగు సీట్లు టీడీపీకి వస్తే…చివరి నిమిషంలో మైనారిటీలకు ఇవ్వొచ్చన్న యోచనలో ఉంది టీడీపీ. సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఫైనల్ ముందే శ్రీలంకకు వైభవ్ బిగ్ వార్నింగ్.. సూర్యవంశీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూశారా?
-
India ODI Squad vs England: కోహ్లీకి ఫిట్నెస్ షరతు, బుమ్రా రీఎంట్రీ.! ఇంగ్లండ్ వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన..
-
Honda ADV 160: హోండా ADV 160 వచ్చేస్తోంది.. అడ్వెంచర్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు
-
Bollywood : సినీ ఫక్కీలో లేడిప్రొడ్యూసర్ ‘డైమండ్ ఇయర్ రింగ్స్’ కొట్టేశారు
-
The Paradise : ఇంటెన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్… ‘ది ప్యారడైజ్’పై బజ్ పెంచే అప్డేట్
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!