AP Liquor Scam Case: లిక్కర్ కేసులో కొత్తగా ఆరుగురు నిందితులు.. చెవిరెడ్డి అరెస్ట్..?
- ఏపీ లిక్కర్ స్కాం కేసులో పెరిగిన నిందితుల సంఖ్య..
- కొత్తగా ఆరుగురు నిందితులను FIRలో చేర్చిన సిట్..
- కోర్టులో మెమో దాఖలు చేసిన సిట్ అధికారులు..
- ఏ34గా వెంకటేష్ నాయుడు, ఏ35గా బాలాజీ కుమార్, ఏ36గా నవీన్..
- ఏ37గా హరీష్, ఏ38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏ39గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో ఇప్పుడు నిందితుల సంఖ్య 39కి చేరింది.. మద్యం కుంభకోణంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి పేరును FIRలో చేర్చింది సిట్.. A 38గా చేవిరెడ్డి పేరును పేర్కొంది.. ఈ మేరకు కోర్టులో మెమో వేశారు సిట్ అధికారులు.. చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు ను ఈ కేసులో A 34గా చేర్చింది.. మరోవైపు, ఇప్పటికే బెంగళూరు విమానాశ్రయం నుంచి కొలంబో వెళ్తుండగా చెవిరెడ్డిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.. చెవిరెడ్డిపై లుకౌట్ నోటీసులు ఉండడంతో.. ఏపీ డీజీపీకి సమాచారం పంపించారు ఇమ్మిగ్రేషన్ అధికారులు.. అయితే, ఏపీ పోలీసుల సూచన మేరకు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ కు చెవిరెడ్డిని తరలించారు అధికారులు.. ఈ రోజు రాత్రికి చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడును అదుపులోకి తీసుకోనున్న సిట్ బృందం.. రేపు చెవిరెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా చూపనుంది.
Read Also: Karnataka: కొడుకు అల్లరి భరించలేక ఇనుప కడ్డీతో వాతలు పెట్టిన తల్లి.. పోలీసులు ఏం చేశారంటే..?
Also Read
- Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
- Sajjala Ramakrishna Reddy: హామీలు గాలికొదిలేశారు.. సర్కార్పై సజ్జల తీవ్ర విమర్శలు..
- Nara Lokesh : ఏపీ శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు కుట్ర
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
ఇక, లిక్కర్ స్కాం కేసులో నిందితుల సంఖ్య పెరిగింది.. కొత్తగా ఆరుగురు నిందితులను చేర్చుతూ కోర్టులో మెమో దాఖలు చేసింది సిట్.. దీంతో, ఇప్పటి వరకు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల మొత్తం సంఖ్య 39కి చేరింది.. ఏ34 గా వెంకటేశ్ నాయుడు.. ఏ38గా చెవిరెడ్డి పేర్లను ప్రస్తావించారు.. సిట్ కొత్తగా చేర్చిన నిందితుల వివరాలను పరిశీలిస్తే.. ఏ34గా వెంకటేష్ నాయుడు, ఏ35గా బాలాజీ కుమార్, ఏ36గా నవీన్, ఏ37గా హరీష్, ఏ38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏ39గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్లను చేర్చారు సిట్ అధికారులు..
తాజావార్తలు
-
Iran-US: శాంతి చర్చలపై ఇరాన్ సంచలన నిర్ణయం.. మరింత టెన్షన్గా పశ్చిమాసియా
-
CM Vijay Tiruchi Speech: తన డ్రెస్సింగ్ స్టైల్పై ట్రోల్స్ చేసినోళ్లకు సీఎం విజయ్ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. !
-
Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
-
Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
-
Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. టన్నుకు రూ.351 పెంపు..
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!