Waiting IPS Officers: వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లకు మెమో.. ఎందుకో తెలిస్తే షాకే..!
- వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లకు మెమో జారీ వెనుక షాకింగ్ రీజన్స్..!
- విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఎస్ల కుట్ర..!
- విచారణ చేస్తున్న అధికారులు.. సిబ్బందితో మీటింగ్లు పెడుతున్నారని సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waiting IPS Officers: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.. ఐఏఎస్, ఐపీఎస్లను భారీ సంఖ్యలో బదిలీ చేసింది సర్కార్.. ఇదే సమయంలో మరికొందరిని వెయిటింగ్లో పెట్టింది ప్రభుత్వం.. అయితే, వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు తాజాగా షాక్ ఇచ్చారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. వెయిటింగ్లో ఉంటూ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండని సీనియర్ ఐపీఎస్లకు మెమోలు జారీ చేశారు.. ప్రతీరోజు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు డీజీపీ.. అయితే, వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లకు మెమో జారీ వెనుక షాకింగ్ రీజన్స్ ఉన్నాయని తెలుస్తోంది.
Read Also: Duleep Trophy 2024: అందుకే కోహ్లీ, రోహిత్ ఆడటం లేదు: జై షా
Also Read
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఎస్లు కుట్ర చేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది.. విచారణ చేస్తున్న అధికారులను, సిబ్బందితో వెయిటింగ్లో ఉన్న కొందరు ఐపీఎస్లు మీటింగ్లు పెడుతున్నారని ప్రభుత్వానికి సమాచారం అందింది.. విచారణ సరిగా చేయొద్దని తూతూ మంత్రంగా ముగించాలంటూ ప్రభావితం చేస్తున్నట్టుగా డీజీపీ కార్యాలయం గుర్తించిందట.. తమ పేర్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల పాత్రను, ప్రమేయాన్ని తక్కువ చేసి చూపేలా కేసులను దర్యాప్తు చేయాలని.. వెయిటింగ్ లో ఉన్న కొందరు ఐపీఎస్లు సూచనలు చేస్తున్నట్టుగా డీజీపీ ఆఫీస్ దృష్టికి వచ్చింది.. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేసినట్టు గుర్తించారు.. అయితే, వీటిని గుర్తించిన నిఘా విభాగం.. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.. దీంతో, వెయిటింగ్లో ఉన్న కొందరు ఐపీఎస్ అధికారుల తీరుతో ప్రభుత్వ పెద్దలు కంగుతిన్నారట.. అయితే, కేసుల దర్యాప్తులో ఆటంకం కల్పించే ప్రయత్నాలను సీరియస్గా తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఈ పరిణామాలతో అప్రమత్తమై మెమోలు జారీ చేసినట్టుగా సమాచారం.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!