Waiting IPS Officers: వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లకు మెమో.. ఎందుకో తెలిస్తే షాకే..!
- వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లకు మెమో జారీ వెనుక షాకింగ్ రీజన్స్..!
- విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఎస్ల కుట్ర..!
- విచారణ చేస్తున్న అధికారులు.. సిబ్బందితో మీటింగ్లు పెడుతున్నారని సమాచారం..
Waiting IPS Officers: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.. ఐఏఎస్, ఐపీఎస్లను భారీ సంఖ్యలో బదిలీ చేసింది సర్కార్.. ఇదే సమయంలో మరికొందరిని వెయిటింగ్లో పెట్టింది ప్రభుత్వం.. అయితే, వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు తాజాగా షాక్ ఇచ్చారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. వెయిటింగ్లో ఉంటూ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండని సీనియర్ ఐపీఎస్లకు మెమోలు జారీ చేశారు.. ప్రతీరోజు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు డీజీపీ.. అయితే, వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లకు మెమో జారీ వెనుక షాకింగ్ రీజన్స్ ఉన్నాయని తెలుస్తోంది.
Read Also: Duleep Trophy 2024: అందుకే కోహ్లీ, రోహిత్ ఆడటం లేదు: జై షా
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఎస్లు కుట్ర చేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది.. విచారణ చేస్తున్న అధికారులను, సిబ్బందితో వెయిటింగ్లో ఉన్న కొందరు ఐపీఎస్లు మీటింగ్లు పెడుతున్నారని ప్రభుత్వానికి సమాచారం అందింది.. విచారణ సరిగా చేయొద్దని తూతూ మంత్రంగా ముగించాలంటూ ప్రభావితం చేస్తున్నట్టుగా డీజీపీ కార్యాలయం గుర్తించిందట.. తమ పేర్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల పాత్రను, ప్రమేయాన్ని తక్కువ చేసి చూపేలా కేసులను దర్యాప్తు చేయాలని.. వెయిటింగ్ లో ఉన్న కొందరు ఐపీఎస్లు సూచనలు చేస్తున్నట్టుగా డీజీపీ ఆఫీస్ దృష్టికి వచ్చింది.. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేసినట్టు గుర్తించారు.. అయితే, వీటిని గుర్తించిన నిఘా విభాగం.. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.. దీంతో, వెయిటింగ్లో ఉన్న కొందరు ఐపీఎస్ అధికారుల తీరుతో ప్రభుత్వ పెద్దలు కంగుతిన్నారట.. అయితే, కేసుల దర్యాప్తులో ఆటంకం కల్పించే ప్రయత్నాలను సీరియస్గా తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఈ పరిణామాలతో అప్రమత్తమై మెమోలు జారీ చేసినట్టుగా సమాచారం.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?