Waiting IPS Officers: వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లకు మెమో.. ఎందుకో తెలిస్తే షాకే..!
- వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లకు మెమో జారీ వెనుక షాకింగ్ రీజన్స్..!
- విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఎస్ల కుట్ర..!
- విచారణ చేస్తున్న అధికారులు.. సిబ్బందితో మీటింగ్లు పెడుతున్నారని సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waiting IPS Officers: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.. ఐఏఎస్, ఐపీఎస్లను భారీ సంఖ్యలో బదిలీ చేసింది సర్కార్.. ఇదే సమయంలో మరికొందరిని వెయిటింగ్లో పెట్టింది ప్రభుత్వం.. అయితే, వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు తాజాగా షాక్ ఇచ్చారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. వెయిటింగ్లో ఉంటూ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండని సీనియర్ ఐపీఎస్లకు మెమోలు జారీ చేశారు.. ప్రతీరోజు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు డీజీపీ.. అయితే, వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లకు మెమో జారీ వెనుక షాకింగ్ రీజన్స్ ఉన్నాయని తెలుస్తోంది.
Read Also: Duleep Trophy 2024: అందుకే కోహ్లీ, రోహిత్ ఆడటం లేదు: జై షా
Also Read
విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఎస్లు కుట్ర చేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది.. విచారణ చేస్తున్న అధికారులను, సిబ్బందితో వెయిటింగ్లో ఉన్న కొందరు ఐపీఎస్లు మీటింగ్లు పెడుతున్నారని ప్రభుత్వానికి సమాచారం అందింది.. విచారణ సరిగా చేయొద్దని తూతూ మంత్రంగా ముగించాలంటూ ప్రభావితం చేస్తున్నట్టుగా డీజీపీ కార్యాలయం గుర్తించిందట.. తమ పేర్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల పాత్రను, ప్రమేయాన్ని తక్కువ చేసి చూపేలా కేసులను దర్యాప్తు చేయాలని.. వెయిటింగ్ లో ఉన్న కొందరు ఐపీఎస్లు సూచనలు చేస్తున్నట్టుగా డీజీపీ ఆఫీస్ దృష్టికి వచ్చింది.. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేసినట్టు గుర్తించారు.. అయితే, వీటిని గుర్తించిన నిఘా విభాగం.. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.. దీంతో, వెయిటింగ్లో ఉన్న కొందరు ఐపీఎస్ అధికారుల తీరుతో ప్రభుత్వ పెద్దలు కంగుతిన్నారట.. అయితే, కేసుల దర్యాప్తులో ఆటంకం కల్పించే ప్రయత్నాలను సీరియస్గా తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఈ పరిణామాలతో అప్రమత్తమై మెమోలు జారీ చేసినట్టుగా సమాచారం.
తాజావార్తలు
-
Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
-
PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్లోకి మీకూ ఎంట్రీ!
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!