Waiting IPS Officers: వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లకు మెమో.. ఎందుకో తెలిస్తే షాకే..!
- వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లకు మెమో జారీ వెనుక షాకింగ్ రీజన్స్..!
- విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఎస్ల కుట్ర..!
- విచారణ చేస్తున్న అధికారులు.. సిబ్బందితో మీటింగ్లు పెడుతున్నారని సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waiting IPS Officers: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.. ఐఏఎస్, ఐపీఎస్లను భారీ సంఖ్యలో బదిలీ చేసింది సర్కార్.. ఇదే సమయంలో మరికొందరిని వెయిటింగ్లో పెట్టింది ప్రభుత్వం.. అయితే, వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు తాజాగా షాక్ ఇచ్చారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. వెయిటింగ్లో ఉంటూ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండని సీనియర్ ఐపీఎస్లకు మెమోలు జారీ చేశారు.. ప్రతీరోజు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు డీజీపీ.. అయితే, వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లకు మెమో జారీ వెనుక షాకింగ్ రీజన్స్ ఉన్నాయని తెలుస్తోంది.
Read Also: Duleep Trophy 2024: అందుకే కోహ్లీ, రోహిత్ ఆడటం లేదు: జై షా
Also Read
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఎస్లు కుట్ర చేస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది.. విచారణ చేస్తున్న అధికారులను, సిబ్బందితో వెయిటింగ్లో ఉన్న కొందరు ఐపీఎస్లు మీటింగ్లు పెడుతున్నారని ప్రభుత్వానికి సమాచారం అందింది.. విచారణ సరిగా చేయొద్దని తూతూ మంత్రంగా ముగించాలంటూ ప్రభావితం చేస్తున్నట్టుగా డీజీపీ కార్యాలయం గుర్తించిందట.. తమ పేర్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల పాత్రను, ప్రమేయాన్ని తక్కువ చేసి చూపేలా కేసులను దర్యాప్తు చేయాలని.. వెయిటింగ్ లో ఉన్న కొందరు ఐపీఎస్లు సూచనలు చేస్తున్నట్టుగా డీజీపీ ఆఫీస్ దృష్టికి వచ్చింది.. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేసినట్టు గుర్తించారు.. అయితే, వీటిని గుర్తించిన నిఘా విభాగం.. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.. దీంతో, వెయిటింగ్లో ఉన్న కొందరు ఐపీఎస్ అధికారుల తీరుతో ప్రభుత్వ పెద్దలు కంగుతిన్నారట.. అయితే, కేసుల దర్యాప్తులో ఆటంకం కల్పించే ప్రయత్నాలను సీరియస్గా తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఈ పరిణామాలతో అప్రమత్తమై మెమోలు జారీ చేసినట్టుగా సమాచారం.
తాజావార్తలు
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?