Shivraj Singh chouhan: ఒకప్పటి IT మ్యాన్ నేటి AI మ్యాన్ చంద్రబాబు
- ఒకప్పటి IT మ్యాన్ నేటి AI మ్యాన్ చంద్రబాబు..
- అటల్ జీ చంద్రబాబుతో ఆత్మీయ సంబంధం కలిగి ఉన్నాడు..
- మోడీ- చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుంది: శివరాజ్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivraj Singh chouhan: భారతరత్న, మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఏపీలో ఘనంగా కొనసాగుతున్నాయి. రాజధాని అమరావతిలో 14 అడుగుల వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఒకప్పటి IT మ్యాన్ నేటి AI మ్యాన్ చంద్రబాబు నాయుడు తో పాటు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మనందరీ ముఖ్య నేత అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహం ఆవిష్కరణకు సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొనటం ఆనందంగా ఉంది.. హిందీలో అమ్మనీ మా అంటారు కానీ మధ్యప్రదేశ్ లో మాత్రం మామా అంటూ రెండు సార్లు స్మరించుకుంటారని శివరాజ్ సింగ్ అన్నారు.
Read Also: DK Shivakumar: డీకే.శివకుమార్లో నైరాశ్యం.. కార్యకర్తగా ఉంటే బెటర్ అంటూ కామెంట్
Also Read
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
- Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
- Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
ఇక, అటల్ బిహారీ వాజ్ పేయి గురించి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆయన ప్రసంగాలు విని ఎప్పటికైనా ఈ నవ యువకుడు దేశ ప్రధాని అవుతాడని జోస్యం చెప్పారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ తెలిపారు. పార్టీలు వస్తాయి పోతాయి కానీ దేశం ముఖ్యం, దేశ భక్తి ముఖ్యం అన్న నినాదం అటల్ జీ ది.. దేశ భద్రత విషయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీకి పూర్తి సహకారం వాజ్ పేయి అందించారు.. కానీ, నేను ఇందిరా మనవడు రాహుల్ గాంధీ మాత్రం భద్రత విషయంలో మోడీనీ ప్రశ్నిస్తూ ప్రత్యర్థి దేశాలకు మద్దతు ఇస్తున్నట్లుగా ఉంది.. మొదటిసారి ప్రధానిగా అవకాశం దక్కించుకున్న అటల్ జీ తన పదవినీ కాపాడుకునేందుకు రాజకీయ విలువల్ని వదలలేదని శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.
Read Also: Eesha Movie Review: ‘ఈషా’ మూవీ రివ్యూ!
అయితే, రెండవ సారి ప్రధానిగా అటల్ జీ అవకాశం దక్కించుకున్న తర్వాత ఆయన చంద్రబాబుతో రాజకీయ సంబంధాలే కాకుండా ఆత్మీయ సంబంధం కలిగి ఉన్నాడని శివరాజ్ సింగ్ అన్నారు. అటల్ జీ- చంద్రబాబు భాగస్వామ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెట్టింది.. నేడు మోడీ- చంద్రబాబు నాయకత్వంలో విభజన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది అన్నారు. చంద్రబాబు NDA కన్వీనర్ కాదు విజయవంతంగా కూటమినీ నడిపిన రథ సారథి అన్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!