RK Roja: కుప్పం ఘటనపై స్పందించిన మాజీ మంత్రి రోజా.. చంద్రబాబు ఇప్పుడేం చెబుతారు..?
- కుప్పం ఘటన చాలా బాధాకరం..
- సీఎం నియోజకవర్గంలోనే మహిళపై ఇలాంటి దాడులా..?
- రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు..
- ఆడపిల్లల జోలికి వస్తే అదే చివర రోజన్న సీఎం చంద్రబాబు..
- ఇప్పుడు ఏం సమాధానం చెబుతారన్న ఆర్కే రోజా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: కుప్పం ఘటన తీవ్ర కలకలం రేపింది.. అయితే, కుప్పం ఘటన చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలోనే మహిళపై ఇలాంటి దాడులు జరిగితే రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిరోజు మహిళలపై.. చిన్నారులపై దాడులు, అత్యాచారాలు చేయడం.. చెట్టుకు కట్టేసి కోట్టడం జరుగుతున్నాయి.. ఇన్ని దారుణాలు దేశంలో ఇంకే రాష్ట్రంలో అయినా జరిగాయా…? అని ప్రశ్నించారు.. ఆడపిల్లల జోలికి వస్తే అదే చివర రోజు అన్న సీఎం చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతాడు…? అని నిలదీశారు ఆర్కే రోజా..
Read Also: 4-Day Tests: నాలుగు రోజుల టెస్ట్లకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్..?
Also Read
- Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
- Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
- Sajjala Ramakrishna Reddy: 2029లో వైసీపీదే అధికారం.. భారీ మెజారిటీతో గెలుస్తాం..
- Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
నీ సొంత (కుప్పం) నియోజకవర్గంలోనే మహిళను చెట్టుకు కట్టేసి కొడుతుంటే మీరేం చర్యలు తీసుకున్నారు.. అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు రోజా.. తెలుగుదేశం పార్టీ నేత ఆ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టాడు.. ఆ తెలుగుదేశం పార్టీకి నేతకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ? చంద్రబాబు అన్నా.. హోమ్ మంత్రి అన్నా.. వారి పార్టీ కార్యకర్తలకే భయం లేదని విమర్శించారు.. ఎంత హింస చేస్తే అంత మంచి పదవి అని.. లోకేష్ చెప్పడంతో అంతా రెచ్చిపోతున్నారని ఆరోపించారు. అనంతపురంలో 14 మంది టీడీపీ నేతలు 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తే ఎవరు పట్టించుకోలేదు… కనీసం పరిటాల సునీత ఆ అమ్మాయి పరామర్శించలేదు.. కుప్పంలో కూడా మహిళలు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదు.. హోం మంత్రికి ఎంత అహంకారం ఉంటే బాధితురాలిని వీడియో కాల్ ద్వారా పరామర్శిస్తుంది…? అని ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత.. ఇలా మొత్తం ప్రభుత్వం ఫెయిల్యూర్ అని మండిపడ్డారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా..
తాజావార్తలు
-
Raj Thackeray: మోదీని పొగిడి విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? మాధవన్, వివేక్ ఒబెరాయ్పై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
-
Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
-
Samantha Pregnancy: ప్రతి దశ ఒకేలా ఉండదు.. బేబీ బంప్తో సమంత ఫోటోలు వైరల్!
-
Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన ‘షాపింగ్’ కింగ్..
-
AI Effect : AI దెబ్బకు ఉద్యోగాలే మాయం.. చైనాలో మొదలైన ఉపాధి సంక్షోభం.!
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?