RK Roja: కుప్పం ఘటనపై స్పందించిన మాజీ మంత్రి రోజా.. చంద్రబాబు ఇప్పుడేం చెబుతారు..?
- కుప్పం ఘటన చాలా బాధాకరం..
- సీఎం నియోజకవర్గంలోనే మహిళపై ఇలాంటి దాడులా..?
- రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు..
- ఆడపిల్లల జోలికి వస్తే అదే చివర రోజన్న సీఎం చంద్రబాబు..
- ఇప్పుడు ఏం సమాధానం చెబుతారన్న ఆర్కే రోజా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: కుప్పం ఘటన తీవ్ర కలకలం రేపింది.. అయితే, కుప్పం ఘటన చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలోనే మహిళపై ఇలాంటి దాడులు జరిగితే రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతిరోజు మహిళలపై.. చిన్నారులపై దాడులు, అత్యాచారాలు చేయడం.. చెట్టుకు కట్టేసి కోట్టడం జరుగుతున్నాయి.. ఇన్ని దారుణాలు దేశంలో ఇంకే రాష్ట్రంలో అయినా జరిగాయా…? అని ప్రశ్నించారు.. ఆడపిల్లల జోలికి వస్తే అదే చివర రోజు అన్న సీఎం చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతాడు…? అని నిలదీశారు ఆర్కే రోజా..
Read Also: 4-Day Tests: నాలుగు రోజుల టెస్ట్లకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్..?
Also Read
- CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్పాట్.!
- Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
- Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు
- CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
నీ సొంత (కుప్పం) నియోజకవర్గంలోనే మహిళను చెట్టుకు కట్టేసి కొడుతుంటే మీరేం చర్యలు తీసుకున్నారు.. అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు రోజా.. తెలుగుదేశం పార్టీ నేత ఆ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టాడు.. ఆ తెలుగుదేశం పార్టీకి నేతకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ? చంద్రబాబు అన్నా.. హోమ్ మంత్రి అన్నా.. వారి పార్టీ కార్యకర్తలకే భయం లేదని విమర్శించారు.. ఎంత హింస చేస్తే అంత మంచి పదవి అని.. లోకేష్ చెప్పడంతో అంతా రెచ్చిపోతున్నారని ఆరోపించారు. అనంతపురంలో 14 మంది టీడీపీ నేతలు 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తే ఎవరు పట్టించుకోలేదు… కనీసం పరిటాల సునీత ఆ అమ్మాయి పరామర్శించలేదు.. కుప్పంలో కూడా మహిళలు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదు.. హోం మంత్రికి ఎంత అహంకారం ఉంటే బాధితురాలిని వీడియో కాల్ ద్వారా పరామర్శిస్తుంది…? అని ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత.. ఇలా మొత్తం ప్రభుత్వం ఫెయిల్యూర్ అని మండిపడ్డారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా..
తాజావార్తలు
-
Vijay’s Convoy Security Withdrawn: విజయ్ కి షాక్ భద్రత తొలగింపు.. ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ
-
Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..
-
TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
-
TVK Vijay: ఉత్కంఠ పెంచుతున్న తమిళనాడు రాజకీయాలు.. మెజార్టీ నిరూపణకు విజయ్కు రేపటివరకు గవర్నర్ డెడ్లైన్..
-
Thomson QLED Smart TV: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతి.. క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ చౌక ధరతో విడుదల
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!