AP Revenue Meetings: నేటి నుంచి రెవెన్యూ సదస్సులు.. అక్కడికక్కడే భూ సమస్యల పరిష్కారం..!
- భూవివాదాల పరిష్కారం దిశగా సర్కార్ అడుగులు..
- ఏపీలో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు..
- 17 వేల 564 గ్రామాల్లో నిర్వహణకు ఏర్పాట్లు..
- భూముల వివరాలు తెలపనున్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Revenue Meetings: రాష్ట్రంలో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇందుకోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. కోర్టులకు వెళ్లకుండా సర్కార్ పరిధిలో పరిష్కరించే సమస్యలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఇవాళ్టి నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సదస్సులు జరుగుతాయి. గత ప్రభుత్వ హయాంలో భూవివాదాలు పెరిగిపోయాయని.. కబ్జాలు, ఆక్రమణలు జరిగాయని.. ఆరోపిస్తోంది కూటమి ప్రభుత్వం.. అయితే, ఏపీలో భూ వివాదాలకు పరిష్కారం చూపేందుకు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 17,564 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో పరిష్కారం కాకుండా మిగిలిపోయిన వివాదాలపై ఇందులో చర్చించి.. తగు నిర్ణయాలు తీసుకోనున్నారు.
Read Also: Chhattisgarh: బీజేపీలో చేరినందుకు.. మాజీ సర్పంచ్లను కిడ్నాప్ చేసి చంపిన నక్సల్స్!
Also Read
- Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
ఇవాళ ప్రారంభమై 33 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ సదస్సులు జరగనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో భూ వివాదాలు బాగా పెరిగినట్టు కూటమి సర్కార్ గుర్తించింది. అలాగే లెక్కకు మిక్కిలిగా వస్తున్న ఫిర్యాదుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. భూములకు సంబంధించిన అన్ని రకాల సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో ఫిర్యాదులు తీసుకుంటారు. వాటికి స్పాట్లోనే పరిష్కారం చూపనున్నారు. అలాగే, సదస్సుల్లో ఆయా గ్రామాలకు సంబంధించిన రికార్డుల్ని ప్రదర్శిస్తారు. అసైన్డ్, ప్రీ హోల్డ్, లీజ్, కేటాయింపు భూముల వివరాలు కూడా ప్రకటిస్తారు. మరోవైపు గతంలో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారుల్లో అనర్హుల ఏరివేతకు కూడా శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. అంతేకాకుండా అసైన్డ్, ప్రీ హోల్డ్ భూముల్లో అక్రమాలు జరిగాయా అన్నది కూడా రెవెన్యూ సదస్సులు ప్రత్యేకంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెబుతోంది ప్రభుత్వం. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 80 శాతం సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అంచనా వేస్తోంది సర్కార్.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!