Perni Nani: చంద్రబాబు, పవన్, లోకేష్పై పేర్నా నాని తీవ్ర వ్యాఖ్యలు..
- కూటమి ప్రభుత్వం మంత్రి పేర్ని నాని ఫైర్..
- పాలనపై వారికి వారే డబ్బాలు కొట్టుకుంటున్నారు..
- సొంత డబ్బా కొట్టుకోవడం, జగన్ ని తిట్టటానికే సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: కూటమి ప్రభుత్వం ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని.. కూటమి ప్రభుత్వ పాలనపై వారికి వారే డబ్బాలు కొట్టుకుంటున్నారు.. ఈ కూటమి సమావేశంలో ఈ సంవత్సర కాలం పాలన, రానున్న రోజుల్లో ఏం చేస్తారో చెప్తారని అందరూ ఊహించారు. కానీ, సొంత డబ్బా కొట్టుకోవడం, జగన్ ని తిట్టటానికే సమావేశం జరిపారని దుయ్యబట్టారు.. చంద్రబాబు 420 అబద్దాలు చెప్పగా, లోకేష్ 840 అబద్దాలు చెప్పారు… కానీ, పవన్ కల్యాణ్ కళ్లు మూసుకొని కూర్చున్నారని సెటైర్లు వేశారు.. కూటమి నేతల మీటింగులో స్నాక్స్ కే లక్షలు ఖర్చు చేశారు. మా హయాంలో జరిగిన అభివృద్ధిపై చంద్రబాబు, లోకేష్ తప్పుడు మాటలు మాట్లాడారు. చంద్రబాబు, జగన్ పాలనలో ఎవరిది సుపరిపాలనో? మాతో చర్చించే దమ్ము ఉందా? అని సవాల్ విసిరారు.. ఎవరి హయాంలో ఆర్ధిక స్థితిగతులు ఎలా ఉన్నాయో చర్చించటానికి రెడీనా? ఈ సంవత్సర కాలంలోనే లక్షా 61 వేల కోట్లు అప్పులను చంద్రబాబు చేశారు. మా హయాంలో జరగనిదాన్ని కూడా జరిగినట్టు విష ప్రచారం చేశారు. అసెంబ్లీలో ఒకమాట, బయట ఇంకో మాట మాట్లాడటం వారికే చెల్లింది. జనాన్ని నమ్మించి మోసం చేసినందుకు చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు నాని..
Read Also: Supreme Court : ‘ఆపరేషన్ సింధూర్’ లో పాల్గొంటే కేసు నుంచి రక్షణ ఇవ్వాలా..?
Also Read
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
పాలనలో డొల్లతనం, విచ్చలవిడి అవినీతి కారణంగా రాష్ట్రం అభివృద్ధిలో బాగా వెనుక పడింది. అసలు ఈ సంవత్సర కాలంలో ఏం సంపద సృష్టించారు? అని నిలదీశారు పేర్ని నాని.. సూపర్ సిక్స్ పథకాలన్నీ మోసమే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో బాండ్లు ఇచ్చి జనాన్ని నిలువునా ముంచారు. మెగా డీఎస్సీ పేరుతో తొలి అడుగే తప్పటి అడుగు వేశారు. ఓట్ల కోసం భూసర్వే గురించి జగన్ పై తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు నిసిగ్గుగా ఎలా సర్వే చేస్తున్నారు? పీ4 పేరుతో పేదలను మోసం చేశారు. కోటి 48 లక్షల కుటుంబాలు రాష్ట్రంలో పేదరికంలో ఉన్నారు. కానీ, ఎంతమందిని దత్తత తీసుకుని బాగు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.. చంద్రబాబు హయాంలో ఎప్పుడూ కన్సల్టెంట్ లే బాగుపడతారు తప్ప పేదలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. పల్లె పండుగ పేరుతో 13 వేల పంచాయతీలలో తీర్మానాలు లేకుండా నిధులు డ్రా చేశారు. ఈ ప్రభుత్వ పాలకులు ఈవెంట్ మేనేజర్లు. 300 కోట్లు ఖర్చు పెట్టి యోగామ్యాట్ ల పండుగ చేశారు.. కేంద్రం ఇచ్చే ఆర్ధిక సంఘం నిధులను కూడా ప్రభుత్వం వాడేసింది.. జనం సొమ్ముతో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ విమానాలు, హెలికాప్టర్ లలో తిరుగుతున్నారు.. మీ సొంత డబ్బులతో అలా హెలికాఫ్టర్ లలో తిరగగలరా? అని ప్రశ్నించారు..
Read Also: Hyderabad: డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ టెకీ.. ఊడిన ఉద్యోగం.. అయినా మారని వైనం..
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరపడి జీతాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు.. చిన్న చిన్న ఉద్యోగులు అల్లాడిపోతున్నారు.. ఆ ముగ్గురు మాత్రం ప్రత్యేక హెలికాఫ్టర్ లలో తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పంచాయతీ రాజ్ వ్యవస్థ దిగజారి పోయింది అని విమర్శించారు పేర్ని నాని.. లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. గంజాయు, డ్రగ్స్ టన్నుల కొద్దీ దొరుకుతోంది. కూటమి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే ఈ దారుణాలు జరుగుతున్నాయి. డీజీపీ ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు. జగన్ పై ప్రెస్మీట్ పెట్టటానికి తప్ప ఆయనకు వేరే పనిలేదు. నేర చరిత్ర, మాఫియాతో సంబంధం ఉన్న వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే హోంమంత్రి వెంటనే అక్కడకు వెళ్తుంది. కానీ, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వైసీపీ వారి మీద తప్పుడు కేసులు పెట్టించటానికే పోలీసులను వాడుతున్నారు అని ఫైర్ అయ్యారు.. ఇక, పిఠాపురంలో దళితులను సంఘ బహిష్కరణ చేస్తే పవన్ కళ్యాణ్ కి ఏమాత్రం పట్టదు. కనీసం ఒక్కరి మీద కూడా చర్యలు లేవు.. జనసేన కార్యకర్త మహిళపై లైంగిక దాడికి పాల్పడితే కనీస చర్యలు కూడా లేవని ఆరోపించారు. హోంమంత్రి అనిత మహానటిని మించి పోయారు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జనం చచ్చిపోతే ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఇప్పుడేమో జగన్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగితే ప్రతిపక్షానిదే తప్పు అంటున్నారు. ఇంత బాధ్యత లేని వారు పదవుల్లో ఉండటం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని..
తాజావార్తలు
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
-
Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Toyota Hilux India Launch: కొత్త Toyota Hilux డిజైన్ రివీల్.. ధర, ఫీచర్లపై కీలక అప్డేట్
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!