Amaravati Capital: అమరావతికి అధికారిక గెజిట్.. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు..!
- అమరావతికి అధికారిక గెజిట్..
- గెజిట్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నట్లే..
- కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్..
- వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Capital: అమరావతి రాజధాని విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమరావతిని అధికారికంగా రాష్ట్ర రాజధానిగా గుర్తించే గెజిట్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి రాజధాని బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాజధాని విషయం చర్చించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం హోం శాఖలో ఫైల్ క్లియర్ అయి, న్యాయశాఖ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
Read Also: Election Commission: స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డెట్.. వారంలోనే..
Also Read
- Perni Nani: అమరావతిపై ప్రభుత్వానికి పేర్ని నాని సవాల్..! "లెక్కలు చెప్పండి.. చర్చకు రండి"
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
ఇక, రాజధాని నిర్మాణంలో భాగంగా రైతులకు భూవినిమయ ఒప్పందంలో 98 శాతం ప్లాట్ల పంపిణీ పూర్తైనట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మిగిలిన 2 శాతం సమస్యలు కూడా త్వరలో పరిష్కారం కానున్నాయని తెలిపారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా శాశ్వతంగా ప్రకటించేందుకు పార్లమెంట్ సాక్షిగా బిల్లు తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు. దీనితో అమరావతి రాజధాని విషయంలో ఓపెన్ ఎండింగ్ లేకుండా శాసనపరంగా పూర్తి నిర్ధారణ కలిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, అమరావతి గెజిట్పై త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో, రాజధాని ప్రాంతంలో తిరిగి కార్యకలాపాలు వేగం పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
రాజధానిలో రైతుల సమస్యలపై ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశం జరిగింది.. రైతుల సమస్యలపై చర్చించారు.. రాజధాని లో రైతులకు ప్లాట్ల కేటాయింపు.. జరీబు భూములు.. గ్రామ కంఠ సమస్యల పై కూడా చర్చించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్… దాదాపు 30 వేల మంది రైతులు. 34 వేల ఎకరాలకు పైగా రాజధానికి భూములను ఇచ్చారు.. రైతుల త్యాగాలు ఎప్పటికి గుర్తుంటాయి అన్నారు.. ఇన్ని వేల మంది రైతులు ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి… 700 ఎకరాల్లో… ప్లాట్లు కేటాయింపు జరగాలి.. అసైన్డ్ ల్యాండ్… ఇతర కారణాలతో ప్లాట్లు కేటాయింపు జరగలేదు అన్నారు.. ఇక, 30 రోజుల్లో జరీబు సమస్యలకు పరిష్కారం కావాలని చెప్పాం అన్నారు.. కొంతమంది గైడ్ లైన్స్ పాటించక పోవడం వల్ల ఇబ్బందులు వచ్చాయి. లంక గ్రామాలకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి.. లంక ప్రాంత భూములను తీసుకుని మంచి భూమి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు..
మరోవైపు, అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో మరోపరిస్థితి ఉంది.. కొంతమంది అమ్ముకున్నారు.. అసైన్డ్ ల్యాండ్స్ విషయం లో రాష్ట్రం మొత్తం పరిస్థితి అంచనా వేయాల్సి ఉందన్నారు.. 90 రోజుల్లో అసైన్డ్ ల్యాండ్ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం అని ప్రకటించారు పెమ్మసాని.. ఐదుగురు కాంట్రాక్టర్లు, రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి పెడతారు.. వచ్చే జూన్ లో రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తాం.. వచ్చే ఆరు నెలల్లో రైతుల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్..
తాజావార్తలు
-
Vijay Deverakonda: సేవా కార్యక్రమాలతో మరోసారి మనసులు గెలిచిన విజయ్.. రాజకీయాలపై కొత్త చర్చకు కారణమయ్యారా?
-
Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. బాస్ ఎవరో నెతన్యాహుకు తెలుసు..!
-
Bhadra Rajyoga 2026: జూలై 7 నుంచి ఈ మూడు రాశుల అదృష్టం మారనుందా? బుధుడి సంచారం వల్ల ఎవరికి ఎక్కువ లాభం?
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!