Pawan Kalyan: శేషాచలం అటవీ ప్రాంతంలో కబ్జాల సామ్రాజ్యం..! వీడియో విడుదల చేసిన పవన్ కల్యాణ్..
- శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం జనసేన బిగ్ ఎక్స్పోజ్..
- వీడియోను ట్వీట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- మంగళంపేట అటవీ భూముల్లో భారీ అక్రమ ఆక్రమణలు బహిర్గతం..
- తాను తీసిన ఏరియల్ వ్యూ వీడియోస్ మ్యాపింగ్స్ తో సహా పోస్ట్..
- ఈస్ట్ఘాట్స్లోని రక్షిత అటవీ ప్రాంతంలో 76.74 ఎకరాల భూకబ్జా..!
Pawan Kalyan: శేషాచల అటవీ ప్రాంతంలో కబ్జాల సామ్రాజ్యం.. జనసేన పార్టీ బిగ్ ఎక్స్పోజ్ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాను స్వయంగా బహిర్గతం చేశారు.. మంగళంపేట అటవీ భూముల్లో అక్రమ ఆక్రమణలపై పవన్ కల్యాణ్ తీసిన ఏరియల్ వ్యూ వీడియోలు, మ్యాపింగ్స్తో సహా బహిర్గతం చేశారు. ఈస్ట్ ఘాట్స్ పరిధిలోని రక్షిత అటవీ భూముల్లో 76.74 ఎకరాల భూకబ్జా బయటపడింది అన్నారు. ఈ భూములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధం ఉన్నవని పవన్ కల్యాణ్ ట్వీట్లో పేర్కొన్నారు. రక్షిత అటవీ భూముల్లో అక్రమ కట్టడాల నిర్మాణం జరగిందని అని తెలిపారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా తాజా తిరుపతి పర్యటన లో సైట్ను సందర్శించి పరిశీలించారు. ఉల్లంఘనలపై సమగ్ర నివేదికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించారు.
Read Also: YS Jagan: “క్రెడిట్ చోరీ స్కీం’’ చాలా బాగుంది..! చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
ఇక, ప్రతి వ్యక్తి ఆక్రమణ విస్తీర్ణం, కేసుల స్టేటస్ వివరాలను అటవీ శాఖ వెబ్సైట్లో బహిర్గతం చేయాలని పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నకిలీ వెబ్ల్యాండ్ రికార్డులు, తప్పుడు వారసత్వ హక్కులపై ప్రత్యేక విచారణకు ఆదేశాలు ఇచ్చారు. విజిలెన్స్, లీగల్ టీమ్లతో విచారణ జరపాలని సూచించారు. అన్ని భూసమాచారాన్ని డిజిటలైజ్ చేయాలని కూడా ఆదేశించారు. అటవీ భూములు జాతీయ ఆస్తి.. వాటిని కబ్జా చేసేవారిని విడిచిపెట్టం.. అని పవన్ కల్యాణ్ స్పష్టంగా హెచ్చరించారు. అటవీ, వన్యప్రాణి ప్రాంతాలపై దండయాత్ర చేసినవారికి కఠిన చర్యలు తప్పవని ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
An exclusive aerial survey has exposed 76.74 acres of illegal encroachment inside the protected Mangalam Peta forest lands in the eastern ghats, linked to former Forest Minister and senior leader Sri Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) garu. Hon’ble Deputy CM… pic.twitter.com/6OxRhJEhmb
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) November 13, 2025
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!