Pawan Kalyan: సిద్ధం అని రాష్ట్రం అంతా పోస్టర్లు వేస్తున్నారు.. దేనికి సిద్ధం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరారు. పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలశౌరిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం బాలశౌరి విజన్ తనకు నచ్చిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అనంతరం సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనని అర్జునుడుగా జగన్ పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆరోపించారు. సొంత చెల్లి షర్మిలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా సపోర్ట్ చేస్తున్న జగన్ అర్జునుడా అని విమర్శించారు. సొంత చిన్నాన్నను చంపిన వారిని వెనకేసుకుని వస్తున్న జగన్ అర్జునుడా అని అన్నారు.
Balashowry: దమ్ము ధైర్యంతో ప్రశ్నించే నాయకుడు పవన్ కల్యాణ్..
Also Read
- AP High Court: రుషికొండ భవనాల వినియోగంపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
- Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ సంక్షేమ వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తున్నారు.. మళ్లీ వైసీపీ విజయం ఖాయం..
- Minister Narayana: అమరావతి వర్సెస్ మావిగన్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
- YSR 77th Birth Anniversary: మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం’.. వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ వైరల్..
మేము జగన్ లా అర్జునుడు, శ్రీ కృష్ణుడులా పోల్చుకోవడం లేదు.. మీరు వైసీపీ నేత జగన్.. మేము జనసేన అంతే.. ఎవరూ మంచి చేస్తారో ప్రజలు నిర్ణయిస్తారని పవన్ కల్యాణ్ తెలిపారు. మరోవైపు.. సిద్ధం అని రాష్ట్రం అంతా పోస్టర్లు వేస్తున్నారు.. దేనికి సిద్ధం..? అని ప్రశ్నించారు. జగన్ చెప్పేవన్నీ అబద్దాలే.. దేనికి సిద్ధమని దుయ్యబట్టారు. మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు, ఉద్యోగాల భర్తీ మాట తప్పారని మండిపడ్డారు. జగన్ బాధపడకు.. మేము- వస్తున్నాం.. మిమల్ని ఎండగడతానని దుయ్యబట్టారు.
Minister Kakani: చంద్రబాబు, లోకేష్, సోమిరెడ్డి నాపై నిందలు వేశారు..
నేను చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధం అని పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన – టీడీపీ ప్రభుత్వం స్థాపించబోతున్నామని తెలిపారు. పొత్తులతో కొంచం కష్టంగా ఉంటుంది.. సీట్ల సర్దుబాటులో కొంతమందికి బాధ కలిగిస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన బలమైన పాత్ర ఉంటుందని పేర్కొన్నారు. జనసేన పోటీ చేసే స్థానాలు 98 శాతం విజయావకాశాలు ఉన్నాయని అన్నారు. జగన్ దుర్మార్గపు పాలన నుండి రాష్ట్రాన్ని రక్షించాలని ఆయన తెలిపారు. గతంలో సీపీఐ, సీపీఎం పార్టీలతో పొత్తు సమయంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి.. ఇప్పుడు టీడీపీ పొత్తు సీట్ల సర్దుబాటులో కొన్ని ఇబ్బందులు ఉంటాయని అన్నారు. తనపై నమ్మకంతో అంతా తన వెనుక నడవండి అని తెలిపారు. ఎంత అని కాదు.. ఎన్నని కాదు.. 98 శాతం స్ట్రైక్ రేట్ ఉండాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..