Pawan Kalyan: పవన్ కల్యాణ్ సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారా..?
- హైందవ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్..
- సనాతన ధర్మానికి సారథిగా మారుతున్న పవన్ కళ్యాణ్..
- మధురై మురుగన్ భక్త సమ్మేళనంలో పవన్ వ్యాఖ్యలపై జాతీయస్థాయిలో చర్చ..
- సనాతన ధర్మాన్ని కాపాడటం మన భాద్యత అంటూ పవన్ సందేశం..
- మధురై సభతో హిందూ బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాదు… సనాతన ధర్మ రథసారథి కూడా. హైందవ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా తన ముద్రను ఖచ్చితంగా వేసుకుంటున్నారు. సినిమా స్టార్గా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న పవన్… ఇప్పుడు సనాతన ధర్మానికి సారథిగా మారుతున్న తీరు స్పష్టమవుతోంది. తమిళనాడులోని మధురైలో జరిగిన మురుగన్ భక్త సమ్మేళనంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్… హిందూ ధర్మంపై తన ఉజ్జ్వల ఆలోచనలను పంచుకున్నారు. సనాతన ధర్మం ఒక మతం కాదు. మన జీవన విధానం. దాన్ని గౌరవించటం మన బాధ్యత. అని స్పష్టమైన సందేశం ఇచ్చారు. తన ఆలయాల సందర్శనలు, సంప్రదాయాలపై వ్యాఖ్యలు, సంస్కృతికి ఉన్న నిబద్ధత ద్వారా పవన్ కళ్యాణ్ రాజకీయాల ధర్మాన్ని రాజకీయంతో మేళవిస్తూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో మాట్లాడగల సామర్థ్యం ఆయనకు దేశవ్యాప్తంగా అనుబంధాన్ని పెంచే అంశంగా నిలుస్తోంది. జాతీయ స్థాయి హిందూ ప్రతినిధిగా మార్చే దిశగా తీసుకెళ్తోంది.
Read Also: Telangana Cabinet Meeting: ముగిసిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం
Also Read
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
మధురై సభతో పవన్ కళ్యాణ్ను హిందూ బ్రాండ్ అంబాసిడర్గా చూడటం మొదలైందంటున్నారు విశ్లేషకులు. పవవన్ మాటల్లో స్పష్టత ఉంది. సినిమాలు, రాజకీయాలు, ధర్మ ప్రచారం. ఇలా మూడు మార్గాల్లోనూ ప్రజల గుండెల్లో చోటు సంపాదించారు పవన్ కళ్యాణ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి ఆరోపణలు వినిపించగానే స్పందించిన మొదటి నేత పవన్ కళ్యాణ్. భక్తుల విశ్వాసంపై పవన్ గళమెత్తిన తీరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అది తేలికపాటి తప్పిదం కాదు… సనాతన ధర్మంపై కుట్ర అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయ్యాయి.
Read Also: Bengaluru: రెచ్చిపోయిన మృగాళ్లు.. నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై లైంగిక వేధింపులు
సినిమా స్టార్ నుంచి పొలిటికల్ స్టార్గా టర్న్ అయిన పవన్ కళ్యాణ్… ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా కొత్త గుర్తింపును సంపాదించుకున్నారు. వారాహి డిక్లరేషన్ రూపంలో హిందూ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఆయన… తిరుమల ఘటనతో పాన్ ఇండియా హిందూ ఫైర్ బ్రాండ్గా మారిపోయారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్కు కొత్త గుర్తింపు వచ్చిందంటున్నారు విశ్లేషకులు..
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..