Pawan Kalyan: పవన్ కల్యాణ్ సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారా..?
- హైందవ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్..
- సనాతన ధర్మానికి సారథిగా మారుతున్న పవన్ కళ్యాణ్..
- మధురై మురుగన్ భక్త సమ్మేళనంలో పవన్ వ్యాఖ్యలపై జాతీయస్థాయిలో చర్చ..
- సనాతన ధర్మాన్ని కాపాడటం మన భాద్యత అంటూ పవన్ సందేశం..
- మధురై సభతో హిందూ బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాదు… సనాతన ధర్మ రథసారథి కూడా. హైందవ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్గా తన ముద్రను ఖచ్చితంగా వేసుకుంటున్నారు. సినిమా స్టార్గా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న పవన్… ఇప్పుడు సనాతన ధర్మానికి సారథిగా మారుతున్న తీరు స్పష్టమవుతోంది. తమిళనాడులోని మధురైలో జరిగిన మురుగన్ భక్త సమ్మేళనంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్… హిందూ ధర్మంపై తన ఉజ్జ్వల ఆలోచనలను పంచుకున్నారు. సనాతన ధర్మం ఒక మతం కాదు. మన జీవన విధానం. దాన్ని గౌరవించటం మన బాధ్యత. అని స్పష్టమైన సందేశం ఇచ్చారు. తన ఆలయాల సందర్శనలు, సంప్రదాయాలపై వ్యాఖ్యలు, సంస్కృతికి ఉన్న నిబద్ధత ద్వారా పవన్ కళ్యాణ్ రాజకీయాల ధర్మాన్ని రాజకీయంతో మేళవిస్తూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో మాట్లాడగల సామర్థ్యం ఆయనకు దేశవ్యాప్తంగా అనుబంధాన్ని పెంచే అంశంగా నిలుస్తోంది. జాతీయ స్థాయి హిందూ ప్రతినిధిగా మార్చే దిశగా తీసుకెళ్తోంది.
Read Also: Telangana Cabinet Meeting: ముగిసిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
- Pawan Kalyan: మడ అడవుల విస్తరణలో ఏపీకి రెండో స్థానం.. పవన్ హర్షం.. గ్రేట్ గ్రీన్ వాల్పై కీలక ఆదేశాలు..
- AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో వర్షాలపై APSDMA హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
- Minister Kolusu Parthasarathy: అభివృద్ధికి అడ్డంకిగా వ్యవహరిస్తున్నారు.. యువతను రౌడీయిజం వైపు ప్రోత్సహిస్తున్నారు..!
మధురై సభతో పవన్ కళ్యాణ్ను హిందూ బ్రాండ్ అంబాసిడర్గా చూడటం మొదలైందంటున్నారు విశ్లేషకులు. పవవన్ మాటల్లో స్పష్టత ఉంది. సినిమాలు, రాజకీయాలు, ధర్మ ప్రచారం. ఇలా మూడు మార్గాల్లోనూ ప్రజల గుండెల్లో చోటు సంపాదించారు పవన్ కళ్యాణ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి ఆరోపణలు వినిపించగానే స్పందించిన మొదటి నేత పవన్ కళ్యాణ్. భక్తుల విశ్వాసంపై పవన్ గళమెత్తిన తీరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అది తేలికపాటి తప్పిదం కాదు… సనాతన ధర్మంపై కుట్ర అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయ్యాయి.
Read Also: Bengaluru: రెచ్చిపోయిన మృగాళ్లు.. నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై లైంగిక వేధింపులు
సినిమా స్టార్ నుంచి పొలిటికల్ స్టార్గా టర్న్ అయిన పవన్ కళ్యాణ్… ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా కొత్త గుర్తింపును సంపాదించుకున్నారు. వారాహి డిక్లరేషన్ రూపంలో హిందూ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఆయన… తిరుమల ఘటనతో పాన్ ఇండియా హిందూ ఫైర్ బ్రాండ్గా మారిపోయారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్కు కొత్త గుర్తింపు వచ్చిందంటున్నారు విశ్లేషకులు..
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!