Palla Srinivasa Rao: తమ అరాచకాలు, ఎత్తులు సాగడం లేదని వైసీపీ మదన పడుతుంది..!
- పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్..
- వైసీపీపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫైర్..
- కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు..
- ఇందులో ఎటువంటి అనుమానము ఎవరికి అవసరం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palla Srinivasa Rao: కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. పులివెందుల, ఒంటిమిట్ట ఓటర్లు కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు పూర్తిస్థాయి సన్నద్ధంగా ఉన్నారన్న ఆయన.. ఇందులో ఎటువంటి అనుమానము ఎవరికి అవసరం లేదు. వైసీపీ అరాచకాలకు తెరదించుతూ ఈ ఎన్నికల్లో ఓటర్లు తీర్పునివ్వనున్నారు. పూర్తి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ జరుగుతుంటే తమ అరాచకాలు, ఎత్తులు సాగడం లేదని వైసీపీ తీవ్రంగా మదనపడిపోతుందని ఫైర్ అయ్యారు.
Read Also: Surya : సూర్య – వెంకీ అట్లూరి కాంబోలో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ.. ?
Also Read
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
- Ambati Rambabu: రావణ్పై యూఏపీఏ కేసు అన్యాయం.. పోరాటానికి మా మద్దతు
ఇక, ఏదోరకంగా అడ్డంకులు కలిగించేందుకు పసలేని ఆరోపణలు చేస్తోంది అని విమర్శించారు పల్లా శ్రీనివాసరావు.. అందుకే ఎంపీ అవినాష్ రెడ్డి సేవ్ డెమోక్రసీ అంటూ గగ్గోలు పెడుతూ దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి కుయుక్తులన్నీ ప్రజలు పసిగట్టారు. వీరి అరాచకాలకు భరతం పట్టేరీతిన తీర్పును ఇవ్వనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చే దిశగా తీసుకుంటున్న చర్యలు ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తున్నాయి. ఒంటిమిట్ట సీతారామ చంద్రుల ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో ఉన్నాయి. ఒంటిమిట్ట ,పులివెందుల రెండు జడ్పీటీసీ స్థానాలు కూటమి ఖాతాలో చేరబోతున్నాయి. ఈ రెండు ప్రాదేశిక నియోజక వర్గాల ఓటర్లు తమ విస్పష్ట తీర్పును ఎటువంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. వారందరికీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇదే మా శుభాభినందనలు. కూటమి అభ్యర్థుల గెలుపునకు ప్రజలు పూర్తి సహకారం అందిస్తారని విశ్వసిస్తున్నాను అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు పల్లా శ్రీనివాసరావు..
తాజావార్తలు
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
-
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
-
Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!