Sand Online Booking: ఆన్లైన్లో ఉచిత ఇసుక బుకింగ్.. ఇక అన్నీ పోర్ట్లోనే..!
- ఏపీలో ఉచిత ఇసుక ఆన్ లైన్ బుకింగ్ విధానం..
- ఉచిత ఇసుక పోర్టల్ను ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు..
- గ్రామ.. వార్డు సచివాలయాల్లోనే ఇసుక బుక్ చేసుకునే అవకాశం..
- ఇసుక రవాణాదారులు తప్పిదాలకు పాల్పడకుండా పోర్టల్ రూపకల్పన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sand Online Booking: ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో ఇసుక దందా జరిగిందని ఆరోపిస్తూ వచ్చిన కూటమి నేతలు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా స్టాక్ను బట్టి ఇసుక సరఫరా కొనసాగిస్తున్నారు.. అయితే, ఇసుక సరఫరాలో మరింత పారదర్శకత తీసుకొచ్చే విధంగా ఆన్లైన్ విధానానికి శ్రీకారం చుడుతోంది చంద్రబాబు నాయుడు సర్కార్.. ఈరోజు నుంచి ఏపీలో ఇసుక ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. వినియోగదారులు ఉచిత ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్పోర్టల్ ఏర్పాటు చేసింది.
Read Also: UPI Lite: చిన్న లావాదేవీల కోసం సరికొత్త ఫీచర్.. ఎలా పని చేస్తుందంటే?
Also Read
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
ఇవాళ్టి నుంచి ఏపీలో ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమల్లోకి రాబోతోంది.. ఉచిత ఇసుక పోర్టల్ను ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.. అధికారులు నుంచి ఇసుక రవాణాదారుల ఎవ్వరూ తప్పిదాలకు పాల్పడకుండా పోర్టల్ రూపకల్పనకు పూనుకుంది సర్కార్.. జిల్లా స్థాయిలో కలెక్టర్, అధికారుల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు.. ఇసుక స్టాక్ ఎంత ఉంది..? సరఫరా కేంద్రాలెన్ని..? లాంటి వివరాలను కూడా పోర్టల్లో చూసుకునే వెసులుబాటు ఉంటుంది.. 2000 చదరపు అడుగుల్లోపు నిర్మాణాలకు సాధారణ బుకింగ్స్ అమలు చేయనుండగా.. 2000 చదరపు అడుగులు మించితే బల్క్ విధానంలో బుక్ చేసుకునేలా పోర్టల్ రూపకల్పన చేసింది ఏపీ ప్రభుత్వం.. ఏపీ శాండ్ పోర్టల్ పేరిట ఈ పోర్టల్ రూపొందించారు.. ఇక, అధికారులు ఇప్పటికే ఏపీ ఇసుక నిర్వహణ పోర్టల్, యాప్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా అన్ని జిల్లాల వివిధ శాఖల ఉద్యోగులందరికీ శిక్షణ ఇచ్చారు. సెప్టెంబరు 11 నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అది ఆలస్యమైంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!