Andhra Pradesh: అమావాస్య ఎఫెక్ట్..! వెలవెల బోతున్న రిజిస్ట్రేషన్ ఆఫీసులు..
- ఏపీలో రిజిస్ట్రేషన్లపై అమావాస్య ఎఫెక్ట్..
- ఫిబ్రవరి 1 నుంచి మార్కెట్ ధరలను పెంచనున్న ప్రభుత్వం..
- గత రెండు రోజులుగా రద్దీగా రిజిస్ట్రేషన్ ఆఫీసులు..
- రేపు అమావాస్య కావడంతో ఇవాళ, రేపు ప్రభావం..
- జనంలేక వెలవెలబోతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువల పెంపునకు రంగం సిద్ధమైంది.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల ధరలు పెంచాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రద్దీగా మారతాయని అందరూ అనుకుంటారు.. కానీ, ఏపీలో రిజిస్ట్రేషన్లపై అమావాస్య ఎఫెక్ట్ పడింది.. మార్కెట్ ధరలను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వం పెంచుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు గత రెండు రోజులుగా రద్దీగా ఉన్నాయి.. అయితే, రేపు అమావాస్య కావడంతో దాని ప్రభావం ఇవాళ, రేపు రెండు రోజులు పడింది.. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.. ఈ నెలాఖరు చివరి రెండు రోజులుగా ఉన్న 30, 31 తేదీల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రద్దీగా మారే అవకాశం ఉంది..
Read Also: Neha Shetty: హాట్ పిక్స్ తో హీట్ పుట్టిస్తున్న టిల్లు హీరోయిన్
Also Read
- Nadendla Manohar: మనమంతా పవన్ కల్యాణ్ కోసమే.. గ్రూప్ రాజకీయాలు వద్దు..
- Pawan Kalyan: నీట్ నిరసనలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి..
- Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
- Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
కాగా, జనవరి 1వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్ చార్జీలు పెరుగుతాయనే ప్రచారం సాగింది.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అంశంపై కసరత్తు జరిగినా.. పలు వర్గాల నుంచి అభ్యంతరాలు రావడంతో ఈ ప్రక్రియ వాయిదా వేసింది సర్కార్.. తాజాగా మార్కెట్ ధరలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఈ నేపథ్యంలో భూముల విలువ 10 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు.. అయితే, రాజధాని అమరావతికి పెట్టుబడులతో పాటుగా ప్రపంచస్థాయి సంస్థలను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతం పరిధిలోని 29 గ్రామాల్లో భూముల ధరలతో పాటు రిజిస్ర్టేషన్ చార్జీల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.. ఇదే సమయంలో డిమాండ్ భారీగా ఉన్న విజయవాడ, గుంటూరు, భోగాపురం, విశాఖ లాంటి తదితర ప్రాంతాల్లో భూముల ధరలతో పాటుగా రిజిస్ర్టేషన్ చార్జీలు కూడా పెంచేందుకు సిద్ధమైంది ప్రభుత్వం..
తాజావార్తలు
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
CAT 2026 Notification: IIMల్లో MBA చదవాలనుకునే వారికి అలర్ట్.. CAT 2026 నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 3 నుంచి దరఖాస్తులు
-
Polimera 3: ‘పొలిమేర 3’ నుంచి అదిరే అప్డేట్.. కీలక పాత్రలో బ్లాస్ట్ స్టార్ అర్జున్
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Varanasi: మహేష్ ‘వారణాసి’కి కీరవాణి మ్యూజిక్ మ్యాజిక్.. సెప్టెంబర్ నుంచి అసలు పని!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!