CM Chandrababu: ఎమ్మెల్యేలకు సీఎం స్వీట్ వార్నింగ్.. ఇసుక విషయంలో జోక్యం వద్దు..
- ఎట్టి పరిస్థితుల్లో కూటమి ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దు..
- కూటమి ఎమ్మెల్యేలకు స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు..
- గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై ఇప్పటికే విచారణ..
- నియోజకవర్గాల్లో ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దన్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక పాలసీపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.. విపక్షాలు దానిపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి.. అయితే, ఇసుకలో జోక్యం వద్దంటూ కూటమి ఎమ్మెల్యేలకు సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇసుక విషయంలో జోక్యం చేసుకుంటే చర్యలు తప్పవంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు ఇచ్చారు చంద్రబాబు.. ఇక, వాలంటీర్ల గురించి పదే పదే మాట్లాడే జగన్.. పదవీ కాలం ఏడాది క్రితం పూర్తైనా పట్టించుకోలేదు. వాలంటీర్ల పదవీ కాలం ఏడాది క్రితమే ముగిసిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వాలంటీర్లు పేరోల్స్లో లేకుండా పోయారు. వాలంటీర్లకు జగన్ ఏం సమాధానం చెబుతారు..? అని నిలదీశారు. తప్పుడు ప్రచారం ఎంత చేసినా.. ప్రజాస్వామ్యంలో మోసం చేయడం కష్టం. 151 సీట్లతో గెలిచి విర్రవీగిన వ్యక్తి.. 11 స్థానాలకే పరిమితమయ్యారు.. అదే ప్రజాస్వామ్య రహస్యం అన్నారు.
Read Also: Balineni Srinivasa Reddy: అక్కడే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా-బాలినేని
Also Read
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
- Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఎట్టి పరిస్థితుల్లో కూటమి ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దు అని స్పష్టం చేశారు చంద్రబాబు.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇసుక విషయంలో జోక్యం చేసుకోకుంటే.. రాబోయే రోజుల్లో మన గెలుపునకు అదే దోహదం చేస్తుందన్నారు.. మూడు పార్టీల్లోని ఎమ్మెల్యేలు ఉచిత ఇసుక విధానాన్ని జయప్రదం చేసేలా సహకరించాలని కోరారు.. కొత్త మద్యం పాలసీ తెచ్చాం.. నాణ్యమైన మద్యాన్ని రూ. 99కే ఇస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పులతో పాటు.. మనం చేస్తున్న మంచి పనులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పోలవరాన్ని పూర్తి చేసి జాతికి, రైతులకు అంకితం చేయాలి. అమరావతికి పూర్వవైభవం తెస్తాం. కేంద్రం అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇస్తోంది.. ఇంకా మరింత ఇస్తామని హామీ ఇచ్చారు. అమరావతికి నిధుల కొరత లేదు అని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
-
Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..