CM Chandrababu: ఎమ్మెల్యేలకు సీఎం స్వీట్ వార్నింగ్.. ఇసుక విషయంలో జోక్యం వద్దు..
- ఎట్టి పరిస్థితుల్లో కూటమి ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దు..
- కూటమి ఎమ్మెల్యేలకు స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు..
- గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై ఇప్పటికే విచారణ..
- నియోజకవర్గాల్లో ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దన్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక పాలసీపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.. విపక్షాలు దానిపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి.. అయితే, ఇసుకలో జోక్యం వద్దంటూ కూటమి ఎమ్మెల్యేలకు సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇసుక విషయంలో జోక్యం చేసుకుంటే చర్యలు తప్పవంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు ఇచ్చారు చంద్రబాబు.. ఇక, వాలంటీర్ల గురించి పదే పదే మాట్లాడే జగన్.. పదవీ కాలం ఏడాది క్రితం పూర్తైనా పట్టించుకోలేదు. వాలంటీర్ల పదవీ కాలం ఏడాది క్రితమే ముగిసిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వాలంటీర్లు పేరోల్స్లో లేకుండా పోయారు. వాలంటీర్లకు జగన్ ఏం సమాధానం చెబుతారు..? అని నిలదీశారు. తప్పుడు ప్రచారం ఎంత చేసినా.. ప్రజాస్వామ్యంలో మోసం చేయడం కష్టం. 151 సీట్లతో గెలిచి విర్రవీగిన వ్యక్తి.. 11 స్థానాలకే పరిమితమయ్యారు.. అదే ప్రజాస్వామ్య రహస్యం అన్నారు.
Read Also: Balineni Srinivasa Reddy: అక్కడే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా-బాలినేని
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
ఎట్టి పరిస్థితుల్లో కూటమి ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దు అని స్పష్టం చేశారు చంద్రబాబు.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇసుక విషయంలో జోక్యం చేసుకోకుంటే.. రాబోయే రోజుల్లో మన గెలుపునకు అదే దోహదం చేస్తుందన్నారు.. మూడు పార్టీల్లోని ఎమ్మెల్యేలు ఉచిత ఇసుక విధానాన్ని జయప్రదం చేసేలా సహకరించాలని కోరారు.. కొత్త మద్యం పాలసీ తెచ్చాం.. నాణ్యమైన మద్యాన్ని రూ. 99కే ఇస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పులతో పాటు.. మనం చేస్తున్న మంచి పనులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పోలవరాన్ని పూర్తి చేసి జాతికి, రైతులకు అంకితం చేయాలి. అమరావతికి పూర్వవైభవం తెస్తాం. కేంద్రం అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇస్తోంది.. ఇంకా మరింత ఇస్తామని హామీ ఇచ్చారు. అమరావతికి నిధుల కొరత లేదు అని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!