Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వచ్చేసింది.. అన్ని పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.. ఇక, జనసేన పోటీ.. టికెట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ్టి నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తారని తెలిపిన ఆయన.. రాజకీయాల్లో పాఠాలు ఉండవని, అనుభవమే పాఠమని ఆయన అన్నారు. కూటమిలో భాగస్వామ్య పార్టీల మధ్య చిన్నచిన్న ఇబ్బందులు తలెత్తినా తొందరపడి మాట్లాడకుండా సమన్వయంతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన శ్రేణులు క్షేత్రస్థాయిలో బలపడాలని మనోహర్ సూచించారు. గతంలో జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన మూడు చోట్ల విజయం సాధించిందని, మరో ఏడు చోట్ల రెండో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. కేవలం టికెట్ వస్తే గెలుస్తామనే ఆలోచనలను పక్కన పెట్టాలని, ప్రజలు అభ్యర్థులు, పార్టీల పనితీరును నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. ప్రజల అవసరాలు, స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని సూచించారు.
కూటమి భాగస్వామ్యం వల్లే రాష్ట్రం ఈ స్థాయికి చేరుకోగలిగిందని.. మూడు పార్టీలు బలంగా విశ్వసిస్తున్నాయని మనోహర్ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఆలోచనలను కొంతమంది నాయకులు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదని, అయితే పార్టీ జెండా పట్టుకున్న కార్యకర్తలు ఆయన ఆలోచనలను బలంగా అర్థం చేసుకున్నారని చెప్పారు. గత పాలకులు అధికారంలోకి వస్తే భూములను దోపిడీ చేయవచ్చనే ఆలోచనతో వ్యవహరించారని ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ప్రజలు అలాంటి విధానాలను తిరస్కరించారని అన్నారు. పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
Also Read
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
సీట్ల కేటాయింపుపై స్పష్టత రావాల్సి ఉందని మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క సీటు కూడా ఖరారు కాలేదని, సమన్వయ కమిటీ స్థాయిలో సమావేశాలు జరుగుతున్నాయని చెప్పారు. తుది నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్థాయిలో జరుగుతుందని తెలిపారు. టికెట్లు ఎవరికి వస్తాయన్నది పార్టీ అధ్యక్షుడి తుది నిర్ణయమని, అంతకుముందు జరుగుతున్న ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జనసేన పార్టీ గతంలోనూ సీట్ల సర్దుబాటుపై పార్టీ అధ్యక్షుడి నిర్ణయమే తుది అని స్పష్టం చేసింది.
120 సీట్లలో పోటీ చేస్తే గెలుస్తామనే ధోరణి వద్దని మనోహర్ అన్నారు. పోటీ చేసే సీట్ల సంఖ్య కంటే, గెలిచే బలం ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయడమే ముఖ్యమని చెప్పారు. పార్టీ ఆలోచనలు, విధానాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని సూచించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడిదారులకు భరోసా కల్పించడంలో విజయవంతమైందని, ఉత్తరాంధ్రకు వస్తున్న భారీ పెట్టుబడులు అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. జనసేన పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పడలేదని, ప్రజల కోసం పుట్టిందని మనోహర్ అన్నారు. పార్టీలో గ్రూపులు లేవని, పవన్ కల్యాణ్ నిర్ణయమే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికలో ఏదైనా పొరపాటు లేదా సమస్య కనిపిస్తే వెంటనే పార్టీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇక, వార్డుల వారీగా నాయకత్వాన్ని సిద్ధం చేసుకోవాలని, పార్టీ అండగా నిలుస్తుందని మనోహర్ తెలిపారు. సమిష్టి నాయకత్వంతో ముందుకు వెళ్తామని, 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించే లక్ష్యంతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో సీట్ల సంఖ్యపై కాకుండా, గెలిచే సామర్థ్యం ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను అంచనా వేయాలని జనసేన ఇప్పటికే తన కమిటీలకు సూచించిందని తెలిపారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్..
తాజావార్తలు
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!