TDR Bonds Scam: టీడీఆర్ బాండ్లలో అవినీతి.. రూ.700 కోట్ల స్కామ్..!
- టీడీఆర్ బాండ్లలో స్కామ్..
- రూ. 700 కోట్ల మేర అవినీతి జరిగిందన్న మంత్రి నారాయణ..
- టౌన్ ప్లానింగ్ జేడీలు.. ఏడీలతో సమావేశం.. అధికారుల పనితీరుపై సమీక్ష..
- టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై మంత్రి అసహనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDR Bonds Scam: టీడీఆర్ బాండ్ల స్కాం కింద రూ. 700 కోట్ల మేర అవినీతి జరిగిందన్నారు మంత్రి నారాయణ.. టౌన్ ప్లానింగ్ జేడీలు, ఏడీలతో సమావేశమైన ఆయన.. టౌన్ ప్లానింగ్ అధికారుల పని తీరుపై సమీక్ష నిర్వహించారు.. టౌన్ ప్లానింగ్ వింగ్ లో ఉన్న సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి.. సిబ్బంది కొరత, ప్రమోషన్లపై చర్చ సాగింది.. ఇక, లే ఔట్లకు అనుమతులపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.. అయితే, సమావేశంలో టౌన్ ప్లానింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి నారాయణ. టీడీఆర్ బాండ్లపై సరైన సమాచారం ఇవ్వలేదంటూ మండిపడ్డారు.. ప్రభుత్వ పనితీరు చూపించే శాఖలో పురపాలక శాఖ ప్రధానమైందన్న నారాయణ. అధికారులను సస్పెండ్ చేయటం, డిస్మిస్ చేయడం పెద్ద విషయమేం కాదన్నారు.. అయితే, అక్రమాలు జరగకుండా కట్టడి చేయడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
Also Read
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
టౌన్ ప్లానింగ్ విషయంలో 2014-19 మధ్య కాలంలో ఒక్క కంప్లైంట్ రాలేదు.. కానీ, గత ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు మంత్రి నారాయణ.. తణుకు, తిరుపతి, గుంటూరు, విశాఖ వంటి నగరాల్లో టీడీఆర్ బాండ్లల్లో స్కాం జరిగింది. తణుకులో 29 బాండ్లు ఇచ్చారు.. ఇవన్నీ అవకతవకలే. గజాల కింద లెక్కలు వేయాల్సి ఉండగా.. ఎకరాల లెక్కలేసి బాండ్లల్లో అవకతవకలు జరిగాయి. 1:200 ఇవ్వాల్సింది 1:400 ఇచ్చారని మండిపడ్డారు.. విలువలూ పెంచేశారు.. ఇదో పెద్ద స్కాం. ముగ్గుర్ని సస్పెండ్ కూడా చేశారు. టీడీఆర్ బాండ్ల విషయంలో నివేదిక వచ్చింది. టీడీఆర్ బాండ్ల విషయంలో అవినీతి ఇలా కూడా చేస్తారా..? అని ఆశ్చర్యం కలిగే రీతిలో స్కాం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Robbery Vegetable Vendor: దారుణం.. కూరగాయలు అమ్మే వ్యక్తిని దోచుకున్న వ్యక్తులు..(వీడియో)
వందల కోట్ల అవినీతి టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. గుంటూరులోనూ ఇదే తరహాలో వాల్యూయేషనులోనే వేరియేషన్ చూపారన్నారు నారాయణ.. 9000 గజాలు అయితే 20 వేల గజాలకు లెక్కలేసి టీడీఆర్ బాండ్లకు లెక్కలేశారు. ఈ స్కాం విషయంలో సీఎం చంద్రబాబుతో సంప్రదిస్తానని వెల్లడించారు. నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి పనులూ చేయొద్దని అధికారులకు స్పష్టంగా చెప్పాను. ఏ స్థాయి నాయకుడైనా సరే నిబంధనలకు విరుద్దంగా చేయమంటే చేయొద్దనే చెప్పాం అన్నారు మంత్రి నారాయణ.
తాజావార్తలు
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!