TDR Bonds Scam: టీడీఆర్ బాండ్లలో అవినీతి.. రూ.700 కోట్ల స్కామ్..!
- టీడీఆర్ బాండ్లలో స్కామ్..
- రూ. 700 కోట్ల మేర అవినీతి జరిగిందన్న మంత్రి నారాయణ..
- టౌన్ ప్లానింగ్ జేడీలు.. ఏడీలతో సమావేశం.. అధికారుల పనితీరుపై సమీక్ష..
- టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై మంత్రి అసహనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDR Bonds Scam: టీడీఆర్ బాండ్ల స్కాం కింద రూ. 700 కోట్ల మేర అవినీతి జరిగిందన్నారు మంత్రి నారాయణ.. టౌన్ ప్లానింగ్ జేడీలు, ఏడీలతో సమావేశమైన ఆయన.. టౌన్ ప్లానింగ్ అధికారుల పని తీరుపై సమీక్ష నిర్వహించారు.. టౌన్ ప్లానింగ్ వింగ్ లో ఉన్న సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి.. సిబ్బంది కొరత, ప్రమోషన్లపై చర్చ సాగింది.. ఇక, లే ఔట్లకు అనుమతులపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.. అయితే, సమావేశంలో టౌన్ ప్లానింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి నారాయణ. టీడీఆర్ బాండ్లపై సరైన సమాచారం ఇవ్వలేదంటూ మండిపడ్డారు.. ప్రభుత్వ పనితీరు చూపించే శాఖలో పురపాలక శాఖ ప్రధానమైందన్న నారాయణ. అధికారులను సస్పెండ్ చేయటం, డిస్మిస్ చేయడం పెద్ద విషయమేం కాదన్నారు.. అయితే, అక్రమాలు జరగకుండా కట్టడి చేయడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
టౌన్ ప్లానింగ్ విషయంలో 2014-19 మధ్య కాలంలో ఒక్క కంప్లైంట్ రాలేదు.. కానీ, గత ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు మంత్రి నారాయణ.. తణుకు, తిరుపతి, గుంటూరు, విశాఖ వంటి నగరాల్లో టీడీఆర్ బాండ్లల్లో స్కాం జరిగింది. తణుకులో 29 బాండ్లు ఇచ్చారు.. ఇవన్నీ అవకతవకలే. గజాల కింద లెక్కలు వేయాల్సి ఉండగా.. ఎకరాల లెక్కలేసి బాండ్లల్లో అవకతవకలు జరిగాయి. 1:200 ఇవ్వాల్సింది 1:400 ఇచ్చారని మండిపడ్డారు.. విలువలూ పెంచేశారు.. ఇదో పెద్ద స్కాం. ముగ్గుర్ని సస్పెండ్ కూడా చేశారు. టీడీఆర్ బాండ్ల విషయంలో నివేదిక వచ్చింది. టీడీఆర్ బాండ్ల విషయంలో అవినీతి ఇలా కూడా చేస్తారా..? అని ఆశ్చర్యం కలిగే రీతిలో స్కాం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Robbery Vegetable Vendor: దారుణం.. కూరగాయలు అమ్మే వ్యక్తిని దోచుకున్న వ్యక్తులు..(వీడియో)
వందల కోట్ల అవినీతి టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. గుంటూరులోనూ ఇదే తరహాలో వాల్యూయేషనులోనే వేరియేషన్ చూపారన్నారు నారాయణ.. 9000 గజాలు అయితే 20 వేల గజాలకు లెక్కలేసి టీడీఆర్ బాండ్లకు లెక్కలేశారు. ఈ స్కాం విషయంలో సీఎం చంద్రబాబుతో సంప్రదిస్తానని వెల్లడించారు. నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి పనులూ చేయొద్దని అధికారులకు స్పష్టంగా చెప్పాను. ఏ స్థాయి నాయకుడైనా సరే నిబంధనలకు విరుద్దంగా చేయమంటే చేయొద్దనే చెప్పాం అన్నారు మంత్రి నారాయణ.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!