Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Minister Nara Lokesh Speech At Suparipalana Swarnandhra Pradesh

Minister Nara Lokesh: అది రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు.. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు..

Published Date :June 23, 2025 , 8:16 pm
By Sudhakar Ravula
  • అది రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు.. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు..
  • జూన్‌ 4వ తేదీ చరిత్రలో నిలిచిపోయే రోజన్న మంత్రి లోకేష్..
Minister Nara Lokesh: అది రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు.. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Nara Lokesh: అది రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు.. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు.. జూన్‌ 4వ తేదీ చరిత్రలో నిలిచిపోయే రోజు అన్నారు మంత్రి నారా లోకేష్‌.. రాజధాని అమరావతిలో సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై “సుపరిపాలనలో తొలి అడుగు” పేరిట నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. గెలిచింది కూటమికాదు.. ప్రజలు అని పేర్కొన్నారు.. విధ్వంసపాలనపై ప్రజా తిరుగుబాటుగా అభిర్ణించారు.. అయితే, ఐదేళ్లలో సాధించలేనిది ఏడాదిలోనే సాధించాం.. ఉద్యోగులే ప్రభుత్వానికి గుండెకాయ.. ప్రజలకు చేరువగా వెళ్లి సేవలందించండి.. అంటూ సుపరిపాలన – తొలిఅడుగు సభలో మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు..

Read Also: Dil Raju: ఐకాన్ లో అల్లు అర్జున్ లేడు?

Also Read

  • YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్‌ ఆవేదన..
  • CM Chandrababu: నేను దక్షిణాది రాష్ట్రాల వైపే మాట్లాడుతున్నా.. అందుకే ప్రధాని మోడీకి పూర్తి మద్దతు..
  • AP Ministers Singapore Tour: సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం.. 7 రోజుల టూర్..
  • Andhra Pradesh: వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు.. కొత్త కార్పొరేషన్‌ ఏర్పాటు..

రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు.. బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం గొప్పతనం ఏంటో మరోసారి తెలిసిన రోజు జూన్‌ 4 అన్నారు ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్… అందరూ కూటమి గెలిచింది, టిడిపి గెలిచింది, జనసేన గెలిచింది, బిజేపి గెలిచింది అంటున్నారు. కానీ, గెలిచింది కూటమి కాదు గెలిచింది ప్రజలు.. 94 శాతం స్ట్రైక్ రేట్ ..164 అవుట్ ఆఫ్ 175.. ప్రజలు రికార్డులు బద్దలు కొట్టారు. చరిత్రను తిరగరాసారు. ఇది ప్రజా విజయంగా అభివర్ణించారు.. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసేవారు చెడ్డవారు అయితే చెడ్డ ఫలితాలే వస్తాయని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు.. మనం గత ఐదేళ్లు విధ్వంస పాలన చూశాం అన్నారు.. 10 లక్షల కోట్లు అప్పు చేసారు.. ఆంధ్రప్రదేశ్ ను అప్పులప్రదేశ్ గా మార్చేసారు. ఒక్క కొత్త కంపెనీ తీసుకురాలేదు.. ఉన్న కంపెనీలను తరిమేసారు. దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పెట్టుబడులు పెట్టం అని ఒక పెద్ద కంపెనీ అధినేత ప్రకటించారు. ఆ రోజు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి అదో ఉదాహరణగా పేర్కొన్నారు.

Read Also: Sajjala Ramakrishna Reddy: ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది..!

ఐదేళ్లలో ఒక్క రోడ్డు వెయ్యలేదు.. కనీసం రోడ్డుపై గుంతలు పూడ్చలేదు.. ఒక్క సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు.. రాయలసీమకు వరం లా ఉన్న డ్రిప్ ఇరిగేషన్ ను కూడా రద్దు చేసారని దుయ్యబట్టారు లోకేష్‌.. ఇక, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం ఇచ్చారు అంటూ ఎద్దేవా చేశారు.. కప్పుడు నీళ్లు పోసి కుప్పంకు నీరు ఇచ్చాం అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కు రెండుసార్లు శంకుస్థాపన చేసారే తప్ప ఒక్క ఇటుక పెట్టలేదు. విశాఖపట్నంలో 700 కోట్లతో రాయల్ ప్యాలస్ కట్టుకున్నారే తప్ప రైల్వే జోన్, విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలేదు. ఐదేళ్లు అరాచక పాలన సాగింది. దళిత బిడ్డల్ని చంపి డోర్ డెలివరీ చేసారు. మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ ను వేటాడి, వెంటాడి చంపేసారు. అక్క ను వేధించిన వారిని ప్రశ్నించినందుకు బీసీ బిడ్డ అమర్నాధ్ గౌడ్ పై పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్‌..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm chandrababu
  • Minister Nara Lokesh
  • pawan kalyan
  • Suparipalana – Swarnandhra Pradesh

తాజావార్తలు

  • Talasani Srinivas Yadav: మీరు ధైర్యంగా పోరాటం చేయండి.. మీ వెనుక కేసీఆర్ ఉన్నారు..

  • Bengal Election: బెంగాల్‌లోనూ భారీ పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు

  • Vijay Varma: తమన్నా చాప్టర్ క్లోజ్.. ఆలియా తో విజయ్ వర్మ డేటింగ్?

  • Gujarat: సూరత్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త కోడలు ఆత్మహత్య.. 2 నెలల క్రితమే పెళ్లి

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

ట్రెండింగ్‌

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions