Jana Sena Party: 26 నుంచి జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు.. కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jana Sena Party: ఈ నెల 26వ తేదీ నుంచి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది.. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రణాళికపై పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు పార్టీ పీఏసీ ఛైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కీలక ఆదేశాలు జారీ చేశారు.. ప్రజలతో మమేకమై సభ్యత్వ నమోదును విస్తరించాలని సూచించారు.. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.. సమష్టిగా రెండు వారాల సమయాన్ని వినియోగించుకుని భారీగా సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.. ఈ నెల 26 నుంచి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుంది.. దీని కోసం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించనున్నట్టు వెల్లడించారు.
Read Also: CM Chandrababu: పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు సేకరించి స్పష్టమైన నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు మనోహర్.. స్థానిక సమస్యల పరిష్కారంలో చొరవ చూపితే పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.. కొత్త సభ్యుల చేరికపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. జెన్ జీని పార్టీకి దగ్గర చేయాలని పిలుపునిచ్చారు.. ప్రతి నియోజకవర్గంలో 75 నుంచి 100 మంది సాధక్ల ఎంపికకు ప్రణాళికలు రూపొందించాలి.. గతంలో 12.6 లక్షల సభ్యత్వాలు ఉండగా.. ఈసారి రెట్టింపు లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.. ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉండి మొదటిసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నాం.. పార్టీ విస్తరణకు ఉద్యమి సభ్యత్వ నమోదు కీలకమని స్పష్టం చేశారు జనసేన పీఏసీ ఛైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్..
తాజావార్తలు
-
Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!