Site icon NTV Telugu

Jana Sena Party: 26 నుంచి జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు.. కీలక ఆదేశాలు..

Nadendla Manohar

Nadendla Manohar

Jana Sena Party: ఈ నెల 26వ తేదీ నుంచి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది.. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రణాళికపై పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు పార్టీ పీఏసీ ఛైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కీలక ఆదేశాలు జారీ చేశారు.. ప్రజలతో మమేకమై సభ్యత్వ నమోదును విస్తరించాలని సూచించారు.. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.. సమష్టిగా రెండు వారాల సమయాన్ని వినియోగించుకుని భారీగా సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.. ఈ నెల 26 నుంచి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుంది.. దీని కోసం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించనున్నట్టు వెల్లడించారు.

Read Also: CM Chandrababu: పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..

క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు సేకరించి స్పష్టమైన నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు మనోహర్‌.. స్థానిక సమస్యల పరిష్కారంలో చొరవ చూపితే పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.. కొత్త సభ్యుల చేరికపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. జెన్ జీని పార్టీకి దగ్గర చేయాలని పిలుపునిచ్చారు.. ప్రతి నియోజకవర్గంలో 75 నుంచి 100 మంది సాధక్‌ల ఎంపికకు ప్రణాళికలు రూపొందించాలి.. గతంలో 12.6 లక్షల సభ్యత్వాలు ఉండగా.. ఈసారి రెట్టింపు లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.. ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉండి మొదటిసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నాం.. పార్టీ విస్తరణకు ఉద్యమి సభ్యత్వ నమోదు కీలకమని స్పష్టం చేశారు జనసేన పీఏసీ ఛైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్..

Exit mobile version