Nadendla Manohar: విలువలతో కూడిన రాజకీయాలు.. ప్రజలకు మార్పు చూపించాలనే మా ఆలోచన
- పారదర్శకంగా విలువలతో కూడిన రాజకీయాలు చేసి ప్రజలకు మార్పు చూపిస్తాం..
- రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలకు కూడా బకాయిలు పెట్టేశారు..
- రైతుల బకాయిలు తీర్చడానికి రూ.1000 కోట్లు సీఎం మంజూరు చేశారు..
- ద్వారంపూడి కుటుంబం అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది..
- ఇంకా తనిఖీలు చేస్తాం.. ద్వారంపూడి కుటుంబంపై చర్యలుంటాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: పారదర్శకంగా విలువలతో కూడిన రాజకీయాలు చేసి ప్రజలకు మార్పు చూపించాలని మా ఆలోచన అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.. గత ఐదేళ్ల పాలన వలన రైతులు ఎంతో ఆవేదనతో ఇబ్బందులు ఎదుర్కొని చితికిపోయారు.. రైతు భుక్తే ప్రమాదంలోకి నెట్టేశారు.. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలకు కూడా బకాయిలు పెట్టేశారు.. 36,300 కోట్ల రూపాయల అప్పుల పాలు చేశారు… 1659 కోట్ల రూపాయలు రైతులకు బకాయి పెట్టారని మండిపడ్డారు.. అయితే, రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి బాధ్యత మాది.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రైతుల అంశంపై సానుకూలంగా స్పందించారు.. రైతుల బకాయిలు తీర్చడానికి 1000 కోట్ల రూపాయలు సీఎం చంద్రబాబు మంజూరు చేశారని వెల్లడించారు.
Read Also: Bansuri Swaraj: న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ నియామకం
Also Read
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
ఇక, ఆహార భద్రత కూడా మా బాధ్యత.. బియ్యం, నిత్యవసర సరుకులు తూకంలో తేడా వచ్చినా, పక్కదారి పట్టించినా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు మంత్రి నాదెండ్ల.. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం చేసిన అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందని ఆరోపించిన ఆయన.. ఇంకా తనిఖీలు చేస్తాం.. ద్వారంపూడి కుటుంబంపై చర్యలుంటాయని స్పష్టం చేశారు.. కచ్చితంగా స్ధానిక కలెక్టర్ తో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తున్నాం.. రైతుల పొట్ట కొట్టిన వారి పై చర్యలుంటాయి.. సక్రమ పంపిణీ జరపడం జిల్లా యంత్రాంగం బాధ్యత.. పారదర్శకంగా విలువలతో కూడిన రాజకీయాలు చేసి ప్రజలకు మార్పు చూపించాలని మా ఆలోచన అన్నారు. అయితే, కాకినాడ పోర్టును అక్రమాలకు అడ్డాగా మార్చారు.. 35404 మెట్రిక్ టన్నులు 159 కోట్ల విలువ కలిగిన సరుకు సీజ్ చేశాం.. కాకినాడ నగరంలో పోర్టు సమీపంలో ఉన్న గోడౌన్ల తనిఖీలో మాత్రమే 35404 మెట్రిక్ టన్నులు వచ్చింది.. ఒక కిలో బియ్యం 39 రూపాయలకు ఇస్తోంది… 1000 కోట్లను జిల్లాలకు చెల్లించిన విధానం.. పశ్చిమ గోదావరి కి 565.95 కోట్లు, తూర్పు గోదావరికి 121.96 కోట్లు, కోనసీమ కి 163.59 కోట్లు, కాకినాడ కు 21.92 కోట్లు, ఏలూరు కి 119 కోట్లు, బాపట్ల కు 6.65 కోట్లుగా ఉందని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!