Minister Kolusu Parthasarathy: వైసీపీ ఖాళీ అవుతోంది.. నంబర్ 2లు కూడా వెళ్లిపోయారు.
- వైసీపీ ఖాళీ అవుతోందన్న మంత్రి కొలుసు పార్థసారథి..
- పార్టీలో నంబర్ 2గా ఉన్న వ్యక్తులు కూడా వెళ్లిపోయారని వ్యాఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kolusu Parthasarathy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి వలసలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి కొలుసు పార్థసారథి.. వైసీపీ ఖాళీ అవుతోందన్న ఆయన.. పార్టీలో నంబర్ 2గా ఉన్న వ్యక్తులు కూడా వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు.. ఇక, నీతిఆయోగ్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడితే.. దానిని వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. ఒక వ్యక్తి మూర్ఖత్వం మూలంగా రాష్ట్రం నష్టపోయిందని విమర్శించారు.. చంద్రబాబు నాయుడు మాటలపై దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగ చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.. రాష్ట్రాన్ని అగాధంలోకి వైసీపీ నెట్టింది.. కూటమి 7 నెలల పాలనపై తాము చర్చకు సిద్ధమని ప్రకటించారు మంత్రి కొలుసు పార్థసారథి.. అమరావతితో సహా మిగిలిన ప్రాజెక్టులకు 31 వేల కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి.. 6.33 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి అని వెల్లడించారు.. వైసీపీ మొదటి ఏడు నెలలు ఏమి చేసింది..? అని నిలదీశారు.. అన్న క్యాంటీన్లను కూడా వైఎస్ జగన్ మూసేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొలుసు పార్థసారథి..
Read Also: Varun Chakravarthy: చక్రవర్తి ఖాతాలో చెత్త రికార్డు.. ప్రపంచ క్రికెట్లో ఇదే తొలిసారి!
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!