Gottipati Ravikumar: వైసీపీ విష ప్రచారాన్ని నమ్మొద్దు.. వారికి ఉచిత విద్యుత్ పథకం..!
- ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు అంటూ..,
- వైసీపీ చేసే విషప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మొద్దు- గొట్టిపాటి రవికుమార్
- విద్యుత్ వ్యవస్థపై కక్షపెట్టుకున్నందుకే రోజూ అసత్యాల బురద చల్లుతున్నాడు
- విద్యుత్ వ్యవస్థను చంద్రబాబు అనతికాలంలోనే సరిదిద్దారు- గొట్టిపాటి రవికుమార్
- ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తుండటాన్ని చూసి జగన్ తట్టుకోలేకపోతున్నాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు అంటూ వైసీపీ చేసే విషప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మొద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ వ్యవస్థపై జగన్మోహన్ రెడ్డి కక్ష పెట్టుకున్నందుకే రోజూ అసత్యాల బురద చల్లుతున్నాడని ఆరోపించారు. ఐదేళ్లు విధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను చంద్రబాబు అనతికాలంలోనే తన అనుభవంతో సరిదిద్దారని అన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తుండటాన్ని చూసి జగన్ తట్టుకోలేకపోతున్నాడని మండిపడ్డారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల ప్రయోజనంపై అవగాహన లేక జగన్ అసత్యాలు ప్రచారం ప్రారంభించాడని విమర్శించారు. దీర్ఘకాలంలో పథకాల ప్రయోజనాలను ప్రజలు తెలుసుకుంటారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
Read Also: Donald Trump: అమెరికా అధ్యక్షుడైన తొలి రోజు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై ట్రంప్ సంతకం..
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
ఎలాంటి అదనపు భారం లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించే పీఎంకుసుమ్, సూర్యఘర్ పథకాల వల్ల నష్టమేంటో జగన్ చెప్పాలి..? అని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర-రాష్ట్ర ప్రాయోజిక పథకాలైన సూర్యఘర్, పీఎం కుసుమ్ వల్ల విద్యుత్ వినియోగదారులకు మరింత లబ్ధి చేకూరుతుందని అన్నారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ మరింత మెరుగ్గా అందించవచ్చని పేర్కొన్నారు. రైతులకు ఫీడర్ లెవల్లోనే నాణ్యమైన విద్యుత్ను జగన్ వద్దంటాడా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యఘర్ ద్వారా నాణ్యమైన విద్యుత్ గృహ వినియోగదారులకు అందుతుందని తెలిపారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.
Read Also: Liver Disease : మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ లివర్ పని అయిపోయినట్లే?
జగన్ నిర్లక్ష్యం చేసిన వీటిని మేం అందిపుచ్చకోవటాన్ని చూసి ఓర్వలేకపోతున్నాడని మంత్రి పేర్కొన్నారు. కుప్పంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సూర్యఘర్ పథకం రాష్ట్రమంతటా అమల్లోకి తెస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు సౌర ఫలకాల ఏర్పాటు ఉచితంగా పెడుతున్నామన్నారు. దేశంలో విప్లవాత్మక మార్పులు అందిపుచ్చుకోవటంలో చంద్రబాబు ఎప్పుడూ ముందు ఉంటారని మంత్రి తెలిపారు. ఏ మంచి పథకంపైనైనా విషం చిమ్మి వ్యవస్థను నాశనం చేసేందుకూ జగన్ ముందు ఉంటాడని దుయ్యబట్టారు. ఇద్దరి పాలన మధ్య తేడా ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. తన ఐదేళ్ల పాలనలో జగన్ గర్వంగా చెప్పుకునే పథకం ఒక్కటైనా ఉందా..? అని ప్రశ్నించారు. ప్రజలు ఒక్క అవకాశం అని నమ్మినందుకు రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టాడని మంత్రి ఆరోపించారు.
తాజావార్తలు
-
Peddi Box Office Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. 4 రోజుల్లో ఎంత వచ్చిందంటే?
-
ITR Filing Benefits: ఐటీఆర్ దాఖలు చేస్తే లాభాలే లాభాలు.. తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు
-
India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన ‘ఇండియా కూటమి’.. నేడు కీలక సమావేశం.!
-
Alexander Zverev: జ్వెరెవ్కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఫ్రెంచ్ ఓపెన్లో కోబోలీపై విజయం
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!