Gottipati Ravikumar: వైసీపీ విష ప్రచారాన్ని నమ్మొద్దు.. వారికి ఉచిత విద్యుత్ పథకం..!
- ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు అంటూ..,
- వైసీపీ చేసే విషప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మొద్దు- గొట్టిపాటి రవికుమార్
- విద్యుత్ వ్యవస్థపై కక్షపెట్టుకున్నందుకే రోజూ అసత్యాల బురద చల్లుతున్నాడు
- విద్యుత్ వ్యవస్థను చంద్రబాబు అనతికాలంలోనే సరిదిద్దారు- గొట్టిపాటి రవికుమార్
- ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తుండటాన్ని చూసి జగన్ తట్టుకోలేకపోతున్నాడు.
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు అంటూ వైసీపీ చేసే విషప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మొద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ వ్యవస్థపై జగన్మోహన్ రెడ్డి కక్ష పెట్టుకున్నందుకే రోజూ అసత్యాల బురద చల్లుతున్నాడని ఆరోపించారు. ఐదేళ్లు విధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను చంద్రబాబు అనతికాలంలోనే తన అనుభవంతో సరిదిద్దారని అన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తుండటాన్ని చూసి జగన్ తట్టుకోలేకపోతున్నాడని మండిపడ్డారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల ప్రయోజనంపై అవగాహన లేక జగన్ అసత్యాలు ప్రచారం ప్రారంభించాడని విమర్శించారు. దీర్ఘకాలంలో పథకాల ప్రయోజనాలను ప్రజలు తెలుసుకుంటారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
Read Also: Donald Trump: అమెరికా అధ్యక్షుడైన తొలి రోజు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై ట్రంప్ సంతకం..
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
- School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
- AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
ఎలాంటి అదనపు భారం లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించే పీఎంకుసుమ్, సూర్యఘర్ పథకాల వల్ల నష్టమేంటో జగన్ చెప్పాలి..? అని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర-రాష్ట్ర ప్రాయోజిక పథకాలైన సూర్యఘర్, పీఎం కుసుమ్ వల్ల విద్యుత్ వినియోగదారులకు మరింత లబ్ధి చేకూరుతుందని అన్నారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ మరింత మెరుగ్గా అందించవచ్చని పేర్కొన్నారు. రైతులకు ఫీడర్ లెవల్లోనే నాణ్యమైన విద్యుత్ను జగన్ వద్దంటాడా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యఘర్ ద్వారా నాణ్యమైన విద్యుత్ గృహ వినియోగదారులకు అందుతుందని తెలిపారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.
Read Also: Liver Disease : మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ లివర్ పని అయిపోయినట్లే?
జగన్ నిర్లక్ష్యం చేసిన వీటిని మేం అందిపుచ్చకోవటాన్ని చూసి ఓర్వలేకపోతున్నాడని మంత్రి పేర్కొన్నారు. కుప్పంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సూర్యఘర్ పథకం రాష్ట్రమంతటా అమల్లోకి తెస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు సౌర ఫలకాల ఏర్పాటు ఉచితంగా పెడుతున్నామన్నారు. దేశంలో విప్లవాత్మక మార్పులు అందిపుచ్చుకోవటంలో చంద్రబాబు ఎప్పుడూ ముందు ఉంటారని మంత్రి తెలిపారు. ఏ మంచి పథకంపైనైనా విషం చిమ్మి వ్యవస్థను నాశనం చేసేందుకూ జగన్ ముందు ఉంటాడని దుయ్యబట్టారు. ఇద్దరి పాలన మధ్య తేడా ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. తన ఐదేళ్ల పాలనలో జగన్ గర్వంగా చెప్పుకునే పథకం ఒక్కటైనా ఉందా..? అని ప్రశ్నించారు. ప్రజలు ఒక్క అవకాశం అని నమ్మినందుకు రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టాడని మంత్రి ఆరోపించారు.
తాజావార్తలు
-
Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
-
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్కు భారత మహిళల జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
Police Complaint: సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్!
-
JD Chakravarthy: “సాయంత్రం 7:30 దాటితే చాలు.. నాకు బయటి ప్రపంచంతో పనే లేదు”.. జేడీ చక్రవర్తి
-
Mamata Banerjee: 200కు పైగా సీట్లలో గెలుస్తాం, స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!